సమ్మక్క-సారక్క వర్సిటీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
ములుగులో ఏర్పాటుచేస్తున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు.
మెజారిటీ సీట్లు గిరిజన విద్యార్థులకే
కిషన్రెడ్డి వెల్లడి
జాతరలో మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి
ఈనాడు- వరంగల్, దిల్లీ; కాజీపేట, న్యూస్టుడే: ములుగులో ఏర్పాటుచేస్తున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. వర్సిటీలో మెజారిటీ సీట్లు గిరిజన బిడ్డలకే కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం ఆయన మేడారం జాతరలో పాల్గొని, సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క కేంద్ర మంత్రికి స్వాగతం పలికి, ఆదివాసీ మర్యాదలతో గద్దెల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు విడుదల చేసిందని, ఇంతకుముందు కేంద్రం నుంచి జాతరకు రూ.50 లక్షలు మాత్రమే వచ్చేవని చెప్పారు. ములుగులో రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 337 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, తాత్కాలిక భవనంలో ఈ ఏడాది తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
జాతరకు యునెస్కో గుర్తింపునకు ప్రయత్నం
జాతరకు జాతీయ హోదా ఎందుకివ్వడం లేదని అడిగిన ఓ ప్రశ్నకు కిషన్రెడ్డి బదులిస్తూ.. జాతీయ హోదా విధానం అంటూ దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గిరిజన పర్యాటక సర్క్యూట్ కింద ములుగుకు రూ.80 కోట్లు ఇచ్చామని, గతంలో మేడారంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ.19 కోట్లు ఇచ్చిందని బదులిచ్చారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 30 ప్రత్యేక రైళ్లను వేశామన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో ఎంతో కృషి చేశామని, మేడారానికి కూడా ‘ఇన్టాంజబుల్ కల్చరల్ హెరిటేజ్’ కింద యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ల్ో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. గత ప్రభుత్వం భూసేకరణ చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుత సర్కారు భూమిని ఇస్తే సత్వరమే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు జాతరకు వస్తే.. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని, ఏర్పాట్లు చేయడం అధికారులకు సవాలుగా మారుతుందని కిషన్రెడ్డి తెలిపారు. జాతర నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.
- సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్ముండాకు లేఖ రాశారు. తెలంగాణలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
- కేసీఆర్ హయాంలో అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ రవీంద్రనాయక్ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్