దండకారణ్యంలో తప్పదా రణం?
దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.
మావోయిస్టుల డెన్లో చకచకా పోలీసు బేస్ క్యాంపుల నిర్మాణాలు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూకుడు పెంచిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
అబూజ్మడ్లోకి సైతం అడుగుపెట్టిన బలగాలు
కీలక నేత హిడ్మా స్వగ్రామం పువర్తిలోనూ పాగా
చర్ల, న్యూస్టుడే: దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సమాంతర పాలన సాగించిన ప్రాంతాల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు పాగా వేస్తున్నాయి. ఎక్కడికక్కడ బేస్ క్యాంపుల ఏర్పాటు ద్వారా మావోయిస్టులపై నిర్బంధం పెంచుతున్నాయి.
ఆపరేషన్ హిడ్మా..
మావోయిస్టు కీలక నేత, పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడవి హిడ్మా సొంత గ్రామం సుకుమా జిల్లా పువర్తిలో భద్రతా బలగాలు ఈనెల 16న కొత్త బేస్ క్యాంపు ఏర్పాటుచేశాయి. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ జాతీయ జెండా ఎగిరింది. మావోయిస్టుల కార్యస్థానంగా పేరొందిన పువర్తిని బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. వేల మంది పువర్తి చుట్టుపక్కల అడవుల్లో జల్లెడపడుతున్నారు. వందల మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న హిడ్మా కోసం బలగాలు వేటాడుతున్నాయి. చుట్టుపక్కల కీకారణ్య గ్రామాల్లోనూ మరిన్ని బేస్ క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కొత్తగా కొలువుదీరిన భాజపా ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. మావోయిస్టుల డెన్లో బేస్ క్యాంపుల నిర్మాణాల్లో వేగం పెంచింది. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల సేఫ్ జోన్ అయిన అబూజ్మడ్లోకి సైతం బలగాలు అడుగుపెట్టాయి. సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో అబూజ్మడ్ విస్తరించి ఉంది. కొండలు, గుట్టల్లో దట్టంగా చెట్లు పెరిగి కనీసం నడవటానికీ సరైన దారి లేని ప్రాంతాన్నే అబూజ్మడ్ అంటారు. మావోయిస్టులు తలదాచుకుంటున్న డెన్లపై ఆపరేషన్కు వివిధ క్యాడర్లకు చెందిన 3వేల మంది పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
తాడోపేడో తేల్చుకునేలా మావోయిస్టుల దూకుడు
కీలక ప్రాంతాల్లోకి బలగాలు అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు సంయుక్త దాడులకు తెగబడేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నిఘావర్గాలకు సమాచారమందింది. తాడోపేడో తేల్చుకునేందుకు మావోయిస్టులు కొత్త క్యాంపులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా జనవరి 16న బీజాపూర్ జిల్లా పామేడు ఠాణా పరిధిలోని పామేడు, చింతవాగు, కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఏకకాలంలో భీకరదాడులకు తెగబడ్డారు. నిఘావర్గాలు ఊహించని విధంగా గ్రనేడ్ లాంఛర్లతో దాడులకు దిగారు. సమర్థంగా తిప్పికొట్టినా ఇలాంటి దాడులు మరిన్ని జరగొచ్చనే నిఘావర్గాల సంకేతాలతో కేంద్ర పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరిస్తున్నారు. ఇదే సమయంలో సంయుక్త దాడులకు తెగబడేందుకు ఛత్తీస్గఢ్తో ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మావోయిస్టులు పెద్దసంఖ్యలో దండకారణ్యం చేరుకున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారమందింది. గెరిల్లా యుద్ధానికి తెగబడే మావోయిస్టులపై బలగాలు వ్యూహాత్మక పోరుకు సన్నద్ధమవుతున్నాయి.
పక్కకు మళ్లిన చర్చల అంశం..
చర్చల అంశం పక్కకు మళ్లి దండకారణ్యం రణక్షేత్రంగా మారటంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చల అంశం ఇంతక్రితం తెరపైకి వచ్చింది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ ప్రతిపాదించిన వర్చువల్ చర్చల అంశంపై దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. కొత్త క్యాంపుల నిర్మాణాలు, ఆరు నెలల వరకు సాయుధదళాల కూంబింగ్ ఆపాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే తమ డిమాండ్లను అమలుపరచాలని కోరింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్