27 నుంచి మరో రెండు గ్యారంటీలు
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్, కరెంటు పథకాలు ప్రారంభిస్తాం
సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం
మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య
ఈనాడు, వరంగల్: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్కార్డు ఉన్నవారికి రూ.500కే సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని, దోపిడీని ఎదుర్కొని విజయం సాధించామన్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులు సీతక్క, కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సలహాదారు వేం నరేందర్రెడ్డిలతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు...
‘‘ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపై ఆదివాసీ తల్లీబిడ్డలు పోరాడి అమరులయ్యారు. కాబట్టే వందల సంవత్సరాలైనా సమ్మక్కసారలమ్మలను దేవతలుగా కొలుస్తున్నాం. గతేడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచే జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాం. ఆ పోరాటస్ఫూర్తిని సమ్మక్క సారలమ్మల నుంచే పొందాం. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు మేం కృషి చేస్తాం. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని నేను అనను... కానీ ప్రభుత్వం తమ సమస్యలు వింటుందనే నమ్మకాన్ని మాత్రం ఈ 75 రోజుల్లో ప్రజలకు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ నెల 27న మరో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం. ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీటికి శ్రీకారం చుడతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన వివరించారు. ‘‘స్టాఫ్ నర్సులు, సింగరేణి ఉద్యోగులు, పోలీసు, ఆబ్కారీశాఖ, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగాలు నింపాం. మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. 25 వేల కొలువులను నింపి ఎల్బీ స్టేడియంలో ప్రజల ముందే నియామక పత్రాలు అందజేశాం. గతంలో ఉద్యోగాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న మామా అల్లుళ్లు, తండ్రీ కొడుకులు ఇప్పుడు మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సీఎం విమర్శించారు. 65 ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు.
కేసీఆర్ అవినీతిని మోదీ పట్టించుకోలేదు
‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మేడిపండులా తయారైందని స్పష్టమైంది. ఏపీ ప్రభుత్వం కృష్ణానది జలాలను తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం కళ్లప్పగించి చూసింది. విద్యుత్తు విషయంలో కూడా జరిగిన తప్పులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు వివరించారు. గతంలో ఎప్పుడూ జరగనంత దోపిడీ ఈ పదేళ్లలో జరిగింది. అలా జరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుంది. ప్రతిపక్షంలో మేం ఉన్నప్పుడు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసీఆర్ అవినీతిని పట్టించుకోలేదు. ఇప్పుడు మేం న్యాయ విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యాక సీబీఐ విచారణను మా ప్రభుత్వం కోరాలని కేంద్రం అంటోంది. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే సీబీఐ విచారణ అంటున్నారు, చర్యలు తీసుకోవడానికి కాదు. అందుకే మేం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో చేపట్టే విచారణను భారాస నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సీఎం అన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునేందుకు భారాస, భాజపా చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని ఆరోపించారు. త్వరలో రైతులకిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేసేందుకు బ్యాంకులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘గతంలో ప్రభుత్వ పోస్టింగ్లలో కమీషన్లు తీసుకునేవారు. ఇప్పుడు పనితీరును చూసి పోస్టింగ్లు ఇస్తున్నాం. గతంలో సర్కారు ఉద్యోగులకు నెలాఖరులో కూడా జీతాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు ఖాతాల్లో జమచేస్తున్నాం. ఇంకా పాలన గాడిన పడాల్సి ఉంది. అందుకే సెలవులు లేకుండా అహర్నిశలు పనిచేస్తున్నారు. గతంలో సచివాలయంలోకి విపక్షాలకు, మీడియాను లోనికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ స్వేచ్ఛనిచ్చింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
కిషన్రెడ్డి ఆదివాసీలను అవమానపరిచారు
మేడారం ప్రాంతాన్ని ఆదివాసీల ఆచారాలకు అనుగుణంగా వారి అనుమతితో అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఈసారి రాష్ట్రప్రభుత్వం రూ.110 కోట్లను విడుదల చేసిందని..పర్యవేక్షణ కోసం సీతక్క నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. ‘‘ఆరు వేల బస్సులను వేశాం. దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుదరదని మాట్లాడారు. ఉత్తరభారత దేశంలో జరిగే కుంభమేళాకు రూ.వందల కోట్లు ఇచ్చే కేంద్రం సమ్మక్క జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చి సరిపెట్టింది. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్షాలను జాతరకు మేం అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. మీరు అయోధ్యను సందర్శించాలని పిలుపునిస్తే మేమంతా వెళ్లి రాముడిని దర్శించుకుంటున్నాం. కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జాతీయ హోదా ఇవ్వబోమని ఆదివాసీ బిడ్డలను అవమానిస్తూ మాట్లాడడం సరికాదు’’ అన్నారు. రాష్ట్ర పండగగా గుర్తించాలని అప్పట్లో సీతక్క అప్పటి సీఎం చంద్రబాబును కోరితే ఆయన జాతరను రాష్ట్ర పండగగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు.
సమ్మక్క సారలమ్మలను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, భాజపా నేత ఈటల రాజేందర్ తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం