సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు!
రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా ఉన్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను మూసివేసి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లో కలిపివేయాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది.
ఆడిట్లో బయటపడిన అక్రమాలు
రూ.558 కోట్ల బకాయిలు, రూ.94.88 కోట్ల అవినీతి
‘సెస్’ను మూసివేసి డిస్కంలో కలిపేయాలని ఈఆర్సీ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా ఉన్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్)ను మూసివేసి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లో కలిపివేయాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని చేనేత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న సెస్ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని విస్పష్టంగా పేర్కొంది. ఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం.. సెస్ పరిధిలో కరెంటును రాయితీపై తీసుకుని ‘బోగస్ కనెక్షన్లతో’ వినియోగిస్తున్నారు. ఒక కేటగిరీలో కనెక్షన్ తీసుకుని మరో కేటగిరీలో కరెంటు వాడుకోవడం వల్ల ఈ సంస్థకు విద్యుత్ సరఫరాచేస్తున్న ఉత్తర డిస్కంకు నష్టాలు వస్తున్నాయి. వీటితో సహా మొత్తం రూ.94.88 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్లో గుర్తించారు. పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు నిర్దేశించిన హైటెన్షన్(హెచ్టీ) కేటగిరీలో కరెంటు వాడుకుంటూ బిల్లులు మాత్రం గృహావసరాలు వంటివాటికి వినియోగించే లోటెన్షన్(ఎల్టీ) పేరుతో తక్కువగా చెల్లించడం వల్ల రూ.23.77 కోట్లు, పలు కనెక్షన్లను ఒకే పేరుతో వాడుకోవడం వల్ల మరో రూ.22.16 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తం 12 అంశాల్లో రూ.94.88 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఎల్టీ కనెక్షన్లను ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇవ్వవద్దని గతంలో ఈఆర్సీ డిస్కంలకు పలు ఉత్తర్వులు జారీచేసింది. అయినా ఎల్టీ పేరుతో కనెక్షన్లను ఇచ్చి ఆదాయానికి కొందరు అధికారులు గండికొట్టారు. ఇలా అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితాను సైతం సేకరించినట్లు ఈఆర్సీ తెలిపింది.
స్టోర్ మునిగి భారీ నష్టం..
భారీగా విద్యుత్ వ్యాపారం చేస్తున్న సొసైటీ సామగ్రి నిల్వ ఉంచే స్టోర్కు కనీసం బీమా చేయించలేదు. దీనివల్ల 2018-19లో వచ్చిన వరదలకు స్టోర్ మునిగి భారీ నష్టం వాటిల్లింది. గత ఏడాదికాలంగా వ్యర్థాల సామగ్రినీ విక్రయించలేదు. ఈ సొసైటీ పరిధిలోని వినియోగదారులకు సరఫరా చేసేందుకు కరెంటును ఉత్తర డిస్కం నుంచి సెస్ కొంటుంది. ఇలా కొన్న కరెంటుకు ఉత్తర డిస్కంకు రూ.558.44 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చేనేత పరిశ్రమకు వాడుకునే కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీల్లో రాయితీ కింద ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు.
ఆడిట్తో బయటపడిన లొసుగులు..
2019-2022 మధ్యకాలంలో సెస్ ఆదాయ, వ్యయాలపై ఈఆర్సీ ఆడిట్ చేయించగా పలు లొసుగులు, నిధుల దుర్వినియోగం వంటివి బయటపడ్డాయి. ఆదాయానికి గండిపడే చర్యలను అరికట్టాలని, కరెంటు బిల్లులను పక్కాగా జారీ చేయాలని ఇందుకోసం ఉత్తర డిస్కం వినియోగిస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్తో ఆడిట్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర డిస్కం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని నష్టాలు జరగకుండా, ఆదాయాన్ని కోల్పోకుండా ఉండాలంటే సెస్ను మూసేసి అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థనంతా ఉత్తర డిస్కంలో కలిపేయాలని ఈఆర్సీ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. విద్యుత్ చట్టం-2023లోని సెక్షన్ 86(2) కింద ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టంచేసింది.
అవినీతిని ప్రజలే చెప్పారు..
సెస్లో అవినీతి, అక్రమాలను ప్రజలే మండలి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2023-24)కి సంబంధించిన కరెంటు ఛార్జీల ఉత్తర్వులపై సిరిసిల్లలో 2023 ఫిబ్రవరి 20న ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ నిర్వహించింది. 2022 నవంబరు 1న కూడా ప్రజలకు కరెంటు వినియోగంపై మండలి అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లో పలువురు వినియోగదారులే సెస్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సెస్ ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర సహకార శాఖ ఆడిటర్లు ఏటా చేస్తున్న ఆడిట్ పక్కాగా లేనందున అక్రమాలు బయటికి రావడం లేదని ఈఆర్సీ గుర్తించింది. ఈ నేపథ్యంలో 2019-22 మధ్యకాలంలో సెస్ వ్యాపార కార్యకలాపాలపై పక్కాగా ఆడిట్ చేయించుకునేందుకు డిస్కంల నుంచి ఆడిటర్ల జాబితాను ఈఆర్సీ తీసుకుంది. వీటిలో ఒక ఆడిట్ సంస్థను ఎంపిక చేసి వేములవాడ, తంగళ్లపల్లి, గంభీరావుపేట విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించి ప్రయోగాత్మకంగా జరిపిన ఆడిట్లో పలు లొసుగులు బయటపడ్డాయి. దీంతో మరింత లోతుగా సొసైటీ మొత్తం ఆదాయ, వ్యయాలపై ఆడిట్ చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు ‘ఈనాడు’కు చెప్పారు. ఈ సొసైటీ వల్ల తీవ్రనష్టం వస్తోందని, ఉత్తర డిస్కంలో కలిపేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి