భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
నేడు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి భేటీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పెండింగ్ సమస్యలపై సమీక్ష చేపట్టనున్నారు. ధరణి పోర్టల్కు సంబంధించి దాదాపు రెండున్నర లక్షలకుపైగా అపరిష్కృత ఫిర్యాదులున్నాయి. ఇవన్నీ జిల్లా కలెక్టర్ల వద్ద పేరుకుపోయాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కూడా పెద్దఎత్తున అర్జీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్లతో ధరణి కమిటీ నిర్వహించాల్సిన కాన్ఫరెన్స్ రద్దు అయ్యింది.
రెండు భాగాలుగా సమస్యలు
భూ సమస్యలను రెండు భాగాలుగా చూడనున్నారు. మొదట సులువుగా పరిష్కారమయ్యేవి. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న వాటిపై ముందుగా చర్యలు చేపట్టనున్నారు. రెండోది శాశ్వత భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు. దీనిలో భాగంగా ధరణిలో పూర్తిస్థాయిలో మార్పులు తేవడం, రెవెన్యూ పరిపాలనలో సంస్కరణలు, సమగ్ర సర్వే తదితర చర్యలు చేపట్టనున్నారు. భూ సమస్యలపై సలహాలకు, ధరణి పునర్నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై కోదండరెడ్డి, భూమి సునీల్, రేమండ్పీటర్ తదితరులతో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇప్పటికే కొంత కసరత్తు చేసింది. సీఎం సమీక్ష నేపథ్యంలో కమిటీ ప్రాథమికంగా ఒక నివేదికను అందించనుంది.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఇవే.. సీఎంసారూ!
జిల్లా కలెక్టరేట్లు, హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి (గ్రీవెన్స్) వస్తున్న ఎక్కువ సమస్యల్లో హక్కుల జారీకి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి నుంచి విచారణ నివేదికలను వెంటనే తెప్పించుకుని పరిష్కరించగలిగేవే ఎక్కువగా ఉన్నాయి. కలెక్టర్ల బిజీ షెడ్యూలు, తహసీల్దారు కార్యాలయాల నుంచి విచారణ నివేదికలు సకాలంలో రాకపోవడం లాంటి లోపాలున్నాయి. దరఖాస్తుల్లో లేదా విచారణ సందర్భంగా ఏ చిన్న సమాచారం లభించకపోయినా వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో సమస్యలు పెండింగ్లో పడిపోతున్నాయి. అలాంటి సమస్యల్లో కొన్ని..
- అచ్చు, పేర్లు తప్పుగా ఉన్నవి
- సాగులో ఉన్నప్పటికీ మిస్సింగ్ సర్వే నంబర్లుగా చూపుతున్న భూములు
- ఇనాం భూములకు హక్కులు జారీ (ఓఆర్సీ జారీ అయినవి)
- భూమి రకం (క్లాసిఫికేషన్) తప్పుగా నమోదైనవి
- సాగులోనే ఉన్నా.. సగం విస్తీర్ణాలే పాసుపుస్తకాల్లో నమోదు చేసినవి
- అటవీ-రెవెన్యూ సరిహద్దు సమస్యతో నిలిచిపోయిన పట్టాల జారీ
భారంగా దరఖాస్తు రుసుం..
ధరణి సమస్యలపై మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన ప్రతిసారి రూ.1200 వరకు రైతులు చెల్లించాల్సి వస్తోంది. డాక్యుమెంట్ల స్కానింగ్ ధరలు అదనం. సమస్యలు పరిష్కారం కాకపోవడం, అర్జీలు తిరస్కరణకు గురైనప్పుడల్లా తిరిగి దరఖాస్తు చేయడానికి రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. దీనిపై సీఎం దృష్టిసారించి వ్యయప్రయాసలు లేని విధానాన్ని తీసుకురావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు దరఖాస్తు అందిన నిర్దిష్ట సమయంలో పరిష్కారం చూపేలా పౌర నియమావళిని (సిటిజన్ ఛార్ట్) అమలు చేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ