వరద వచ్చేలోగా కాళేశ్వరం పునరుద్ధరణ సాధ్యమేనా?
గత ఏడాది అక్టోబరులో కాళేశ్వరం ఎత్తిపోతలలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు ఏర్పడటంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అన్నారంలో నీరు ఖాళీ చేసినా ఓ పియర్ వద్ద కొనసాగుతున్న సీపేజీ
ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వ నిర్ణయం
మేడిగడ్డలో కాఫర్ డ్యాం నిర్మాణంపై ముందుకురాని గుత్తేదారు సంస్థ
పంపుహౌస్ మునగకుండా చేపట్టిన పనులూ అసంపూర్తిగానే
గత ఏడాది అక్టోబరులో కాళేశ్వరం ఎత్తిపోతలలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు ఏర్పడటంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు డిజైన్, నాణ్యత, నిర్వహణ.. ఇలా అన్నింటిలోనూ లోపాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. అన్నారం, సుందిళ్లలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని, నీటిని ఖాళీ చేయాలని సూచించారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో మేడిగడ్డ బ్యారేజీకి మరింత ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు తేలింది. అన్నారం బ్యారేజీని కూడా నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సీపేజీని అరికట్టడానికి కెమికల్ గ్రౌటింగ్ చేస్తే వేరే చోట సీపేజీలు వచ్చాయి. ఇప్పటికీ డబుల్ పియర్ ఉన్న 35వ గేటు వద్ద సీపేజీ కొనసాగుతున్నట్లు తెలిసింది. అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నా, ఇంకా సీపేజీ వస్తున్నట్లు సమాచారం.
మళ్లీ సమస్యలు రాకుండా ఉండేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో మూడు బ్యారేజీలను నిశితంగా తనిఖీ చేయించి.. వారిచ్చే సిఫార్సు మేరకు ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆమేరకు ఈ నెల 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా.. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి, కేంద్ర జలసంఘానికి లేఖలు రాశారు. కమిటీని పంపాలని కోరారు.
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమేంటో ఇంకా తెలియదు. మేడిగడ్డలో కుంగిన పియర్ వద్ద మరమ్మతులకు ఇప్పటివరకు కాఫర్డ్యాం నిర్మాణం ప్రారంభం కాలేదు. అన్నారం బ్యారేజీలో పూర్తిగా నీటిని ఖాళీ చేసిన తర్వాత కూడా ఓ పియర్ వద్ద సీపేజీ కొనసాగుతోందని తాజాగా గుర్తించారు. గతంలో వచ్చిన భారీ వరదకు అన్నారం బ్యారేజీ వద్ద పంపుహౌస్ నీట మునిగింది. మరోసారి మునగకుండా చేపట్టిన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఈ పనులన్నీ ఎప్పుడవుతాయో తెలియదు. కానీ మరో 3 నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. భారీ వరద వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన సాగునీటిశాఖ వర్గాల్లో నెలకొంది. కొన్నిసార్లు ప్రధాన గోదావరికి వరద ఆలస్యంగా వచ్చినా.. ప్రాణహితకు మాత్రం ముందుగానే ప్రారంభమవుతుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఇంజినీర్లు గుర్తించిన సమస్యలు
మూడు రోజుల క్రితం రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందో ప్రాథమికంగా అంచనా వేసింది. ‘‘మేడిగడ్డ 20వ పియర్లో గేటు దగ్గర పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. ఇవి 75 మి.మీ. నుంచి 350 మి.మీ. వరకు ఉన్నాయి. 19, 21 పియర్ల స్ట్రక్చర్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ 3 పియర్ల వద్ద రాఫ్ట్ దెబ్బతింది. 20వ పియర్ 1.356 మీటర్లు, 19వ పియర్ 0.84 మీ., 21వ పియర్ 0.14 మీ., 18వ పియర్ 0.21 మీ. మేర కుంగాయి. 6, 7, 8 బ్లాక్ల దిగువన 1.5 మీ. మేర ఇసుక మేట వేసింది. అన్నారంలోనూ 3 బ్లాక్లలో లాంచింగ్ ఆఫ్రాన్ల మీద ఇసుక ఉంది. బ్యారేజీ మొత్తం ఎగువ భాగంలో 1.5 నుంచి 2.5 మీ. మేర ఇసుక నిల్వలు ఉన్నాయి. 42 వెంట్స్లో వియరింగ్ కోట్ దెబ్బతినడం, సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, సీపేజీ లాంటి సమస్యలు ఉన్నాయి’’ అని గుర్తించింది. అయితే నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ పరిశీలించిన తర్వాత కానీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.
కాఫర్డ్యాంపై..
మేడిగడ్డలో రూ.54 కోట్లకు అనుబంధ ఒప్పందం చేసుకొంటే కానీ కాఫర్డ్యాం పని చేయబోమని గుత్తేదారు సంస్థ ఎల్ అండ్ టీ తేల్చి చెప్పింది. దీంతో ఏ రకంగా చూసినా ఈ సీజన్లో బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే ‘‘మేడిగడ్డలో ఇప్పటివరకు కుంగిన ఏడో బ్లాక్ వద్ద మినహా మిగిలిన బ్యారేజీలో ఎక్కడేం జరిగిందో పరిశీలించలేదు. మిగిలిన చోట ఏం కాలేదని నిర్ధారించుకొని కాఫర్డ్యాం నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది. లేదంటే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది’’ అని నీటిపారుదలశాఖ వర్గాల అభిప్రాయం.
అన్నారం, సుందిళ్లలో సీపేజీని పూర్తిస్థాయిలో అరికట్టే పనులు కూడా వరద వచ్చే లోగా పూర్తవుతాయా అనే సంశయమూ ఉంది.
పంపుహౌస్పై...
గతంలో భారీ వరదకు అన్నారం బ్యారేజీ వద్ద పంపుహౌస్ నీటమునిగింది. బ్యాక్వాటర్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని 132 మీ. వద్ద పంపుహౌస్ బే నిర్మించడానికి మొదట ఆమోదం తెలిపిన నీటిపారుదలశాఖ తర్వాత 124 మీ. తగ్గించింది. ఆ డిజైన్ మేరకు గుత్తేదారు నిర్మించారు. తర్వాత 130 మీ.కుపైగా నీటి ప్రవాహం రావడంతో పంపుహౌస్ నీట మునిగింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు 950 మీ. మేర కాంక్రీటు గోడ నిర్మాణం చేపట్టారు. జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అనుమతి రాకముందే పనులు ప్రారంభించారు. సుమారు 650 మీ. నిర్మాణం పూర్తయ్యింది. 135.5 మీ. మట్టం వరకు వరద వచ్చినా పంపుహౌస్కు ఏమీ కాకుండా ఈ పని చేపట్టామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పని ఇంకా 300 మీ. పూర్తి కావాల్సి ఉంది. రూ.68.84 కోట్ల విలువ గల ఈ పనికి ప్రభుత్వం నుంచి ఇంకా పరిపాలన అనుమతి రాకపోవడంతో చేసిన పనికి గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలలకు పైగా పరిపాలన అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఈ కారణంగా పని నెమ్మదించిందని, మరో మూడు నెలల్లోగా మిగిలిన పనిని పూర్తి చేయకపోతే.. మళ్లీ వరద వస్తే పంపుహౌస్కు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తమ్మీద మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అన్ని పనులపై వర్షాకాలం లోగానే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు