త్వరలో నూతన విద్యుత్తు విధానం
రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి
కొత్తగూడెం సింగరేణి, న్యూస్టుడే: రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలో సింగరేణి రూ.56.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటును ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సింగరేణి సీఎండీ బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. ‘మేం అధికారంలో లేకుంటే విద్యుత్తు కష్టాలు తప్పవని భారాస పెద్దలు ఎన్నికల ప్రచారంలో ప్రజలను భయపెట్టారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? అన్నారు. కానీ ప్రజలు మాత్రం కరెంటు, కాంగ్రెస్ రెండూ కావాలని తీర్పునిచ్చారు’ అని భట్టి అన్నారు. మిగులు విద్యుత్తు గల రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తుందన్నారు. పగలు సౌర విద్యుత్తుతో ఎత్తయిన ప్రాంతాల్లోని జలాశయాలు నింపి, రాత్రి తిరిగి జలవిద్యుత్తు తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
భారాస చేసిందేమీ లేదు..
భారాస ప్రభుత్వం తమ పాలనలో విద్యుత్తుపరంగా కొత్తగా చేసిందేమీ లేదని భట్టి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కర్మాగారాలే నేడు రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తున్నాయన్నారు. కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మించిన మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కర్మాగారం (బీటీపీఎస్) మున్ముందు భారంగా మారుతుందన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్తు కర్మాగారంలో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో విఫలం కావాలని కొందరు చూస్తున్నారని, వారికి ఆ అవకాశం ఇవ్వబోమని విక్రమార్క వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకం కింద 17.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే సభలో రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోని గనులను ఆ సంస్థే దక్కించుకుంటుందని ఆయన చెప్పారు. ఆ సంస్థ నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కర్మాగారానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతన సవరణ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖను ఆదేశించినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలతో ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుతు భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, వాటిని సౌర శక్తి సాయంతో నడిపేలా చూస్తే ప్రభుత్వంపై ఉచిత విద్యుత్తు భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాందాస్నాయక్, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు జనక్ప్రసాద్, సీఎంవోఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి