ధరణి అధికారాల బదిలీ
భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి.
కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలకు..
భూసమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు
ఈనాడు - హైదరాబాద్
భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన ప్రభుత్వం.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయించనుంది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపై నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి.. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
అధికారాల బదలాయింపుతోనే..
2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూ దస్త్రాల్లో మార్పులు-చేర్పులన్నీ కలెక్టర్లు మాత్రమే చేస్తున్నారు. తీరిక లేని విధులుండటంతో వారి స్థాయిలో భూ సమస్యలు, దస్త్రాలు పెండింగ్లో ఉండిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తహసీల్దారు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేక ఉత్తర్వు ద్వారానే ఈ పద్ధతిని మార్చవచ్చా అనే అంశంపై వారు దృష్టి సారించారు. యాజమాన్య హక్కుల కల్పన, సవరణలన్నీ కలెక్టర్లు చేస్తున్నా.. తుది దస్త్రంపై తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విధులు బదిలీ చేస్తే సరిపోతుందని, దీనికి శాఖ అంతర్గత ఆదేశాలు చాలని పలువురు సీనియర్ అధికారులు సూచించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పెండింగ్ తక్కువ చూపేందుకు తిరస్కరణ!
ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి ఈ ఏడాది జనవరి వరకు పోర్టల్కు 16.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2.40 లక్షల దరఖాస్తులను పెండింగ్లో చూపుతున్నారు. ఇప్పటివరకు 6.38 లక్షల అర్జీలనే పరిష్కరించారు. తిరస్కరణకు గురైనవి 5.37 లక్షలు ఉన్నాయి. ప్రభుత్వం సమీక్ష చేసిన ప్రతిసారీ కొన్ని జిల్లాల్లో తక్కువ దరఖాస్తులే పెండింగ్లో ఉన్నాయని చూపేందుకు ఎడాపెడా తిరస్కరించేవారని రెవెన్యూవర్గాల సమాచారం. దరఖాస్తుల్లో చిన్న తప్పున్నా, ఆధారాలు లేకపోయినా తిరస్కరించిన దాఖలాలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన క్రమంలో తిరస్కరించిన దరఖాస్తుల్లోనూ అర్హత ఉన్నవాటికి మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
పాసుపుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలోనూ జాప్యమే..
- పాసుపుస్తకాల్లో పేర్లు, సర్వే విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్ నంబర్, చిరునామా లాంటివి తప్పుగా నమోదు కాగా.. వాటిపై వచ్చిన అర్జీల్లో 2.43 లక్షల దరఖాస్తులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయి.
- వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే.. కలెక్టరేట్లలో సిబ్బంది ఉదాసీన వైఖరి కూడా కొంతమేరకు కారణమని బాధితులు చెబుతున్నారు.
- ధరణి ప్రారంభం నుంచి భూ సంబంధిత సమస్యలపై 4.30 లక్షల దరఖాస్తులు రాగా.. తిరస్కరించినవి పెద్దసంఖ్యలో ఉన్నాయి.
- సాగు భూములను సాగేతర భూములుగా తప్పుగా నమోదు చేశారంటూ దాఖలైన వాటిలో 25 శాతం పెండింగ్లో ఉన్నాయి.
- ఎప్పుడో వ్యవసాయేతర భూమిగా మారగా ఇప్పటికీ సాగుభూమిగా చూపుతున్నారంటూ దాఖలైనవి 32.44 శాతం, మైదాన ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు 22.72 శాతం పెండింగ్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల