ఎల్ఆర్‘ఎస్’.. దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలు
ఈనాడు, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కింద స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. దీంతో మూడున్నరేళ్లుగా పెండింగులో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక రానుంది.
2020 ఆగస్టు 31న ఉత్తర్వులు..
అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్-2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అదే ఏడాది సెప్టెంబరు 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ప్లాట్లు కొనుగోలు చేసినవారు దరఖాస్తుతోపాటు రూ.వెయ్యి, లేఅవుట్ వేసిన డెవలపర్ దరఖాస్తు చేసిన పక్షంలో రూ.10 వేలు ఫీజుగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 25.44 లక్షల దరఖాస్తులు అందాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.55 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల అర్జీలు వచ్చాయి. అధికారులు పరిష్కార ప్రక్రియ చేపట్టేలోగా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని అఫిడవిట్ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించవచ్చని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. సుమారు 4 వేల మంది దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకు రావటంతో వారికి అధికారులు అనుమతులు జారీచేశారు. అఫిడవిట్ ఇచ్చిన దరఖాస్తుదారుల్లో సుమారు 20 శాతం మందికి ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు.
ప్రభుత్వ స్థలాల్లోని లేఅవుట్లతోపాటు దేవాదాయశాఖ, వక్ఫ్, చెరువు గర్భం, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిశీలన తరవాత సుమారు 20 శాతం దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు గుర్తించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం స్వయంగా ఆదేశించడంతో విధివిధానాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేయనున్నారు.
సర్కారుకు రూ.8 వేల కోట్లకు పైగా ఆదాయం!
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు రూ.4 వేల కోట్లు, పంచాయతీలకు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ప్లాట్ల క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతాయని.. తద్వారా మరో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.