మేడిగడ్డ ఘటనపై 3 కేసులు..
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.
నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు!
ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. నిర్మాణసంస్థ ఎల్ అండ్ టీతో పాటు ఇటీవల కాళేశ్వరం (రామగుండం) ఇంజినీర్ ఇన్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. సీఐడీ ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పని పూర్తికాకముందే పూర్తయినట్లు, డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని, బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలని గత ఈఎన్సీ వెంకటేశ్వర్లు సిఫార్సు చేయడం.. దీనివల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లినపుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈఎన్సీ రాసిన ఈ లేఖ ఆధారంగా రూ.150 కోట్ల బ్యాంకు గ్యారంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదోవ పట్టించారంటూ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) నోటీసు ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పని పూర్తిచేయకుండానే పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకోవడం.. పని పూర్తయి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని అప్పటి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు నివేదించినా కింది ఇంజినీర్లకు ఈ సమాచారం ఇవ్వకపోవడం.. కింది ఇంజినీర్లు బ్యారేజీలో దెబ్బతిన్న పనులను బాగుచేయాలంటూ లేఖలు రాయడం గురించి కూడా వివరంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాఫర్డ్యాం నిర్మాణం చేపట్టి బ్యారేజీ నిర్మాణం తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా తొలగించకుండా వదిలేయడం, దీనివల్ల ప్రవాహంలో వచ్చిన మార్పుతో జరిగిన నష్టం, అంచనాలోనే కాఫర్డ్యాం నిర్మాణానికి, తొలగించడానికి అయ్యే వ్యయం ఉన్నా, తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైన కూడా మరో కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.
బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుకను ఓ మట్టానికి తేవడం, సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయకుండా వదిలిపెట్టడం గురించి ప్రశ్నించినట్లు సమాచారం. గుత్తేదారు చేసిన పనిని ఎం.బుక్కులో రికార్డు చేయడం, దీని ఆధారంగా బిల్లు చెల్లించడానికి పే అండ్ ఎకౌంట్స్ (పీఏవో)కు సిఫార్సు చేయడం, పీఏవో బిల్లు చెల్లించడం జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎం.బుక్కులు ఇమ్మని కోరగా, సంబంధిత ఇంజినీర్ వీటికోసం గుత్తేదారుకు లేఖ రాశారు. అయితే ఇప్పటివరకు ఈ ఎం.బుక్కులు అందకపోవడంతో పే అండ్ ఎకౌంట్స్ నుంచి పరిశీలించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇందులో కూడా పలు లోపాలను గుర్తించినట్లు తెలిసింది. ఎం.బుక్కులో కొట్టివేతలతోపాటు రికార్డు చేయడంలో వరుసక్రమం లేకపోవడం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట పైన పని చేసినట్లు ఎం.బుక్కులు రికార్డు చేయడం, తర్వాత కింది పనికి రికార్డు చేయడం ఇలా పలు అవకతవకలు గుర్తించామంటూ దీనిపైన కూడా కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ బ్యారేజీ నిర్మాణ వ్యయం పెరగడం, ఇలా పెరిగిన పనులన్నీ అనధికార ఉప గుత్తేదారులు చేయడం, బిల్లు ప్రధాన గుత్తేదారు నుంచి ఉప గుత్తేదారులకు రావడం, వీరికున్న అర్హతలు తదితర అంశాలపై కూడా విచారణ పూర్తిచేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ త్వరలోనే మరికొన్ని కేసుల నమోదుకు సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించి 3 కేసుల నమోదుకు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం