అమలు గ్యారంటీ
అభయహస్తం గ్యారంటీల్లోని మరో రెండు హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘గృహజ్యోతి’లోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ‘మహాలక్ష్మి’లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు.
ఆర్థిక సంక్షోభమున్నా ఆ హామీలు నెరవేర్చి తీరుతాం
సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
200 యూనిట్ల విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: అభయహస్తం గ్యారంటీల్లోని మరో రెండు హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘గృహజ్యోతి’లోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ‘మహాలక్ష్మి’లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, దేశానికి నమూనాగా మారుస్తామని పేర్కొన్నారు. మహిళల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి లబ్ధిదారులకు సులభంగా అందేలా ఈ పథకాల్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందన్నారు. ‘‘సెప్టెంబరు 17న తుక్కుగూడ సభలో ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సోనియా ఇచ్చిన మాట శిలాశాసనం. సువర్ణాక్షరాలతో లిఖించేలా వీటిని తూచా తప్పకుండా అమలుచేసి తీరుతాం. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి క్రమపద్ధతిలో నిధులు కేటాయిస్తున్నాం.
వారిని ప్రజలు విశ్వసించట్లేదు
కాంగ్రెస్ హామీలు అమలు కాకపోతే బాగుంటుందని తండ్రీకుమారులు.. మామాఅల్లుళ్లు కోరుకుంటున్నారు. భారాస నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించడం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం రూ.1,200 వరకు తీసుకెళ్లింది. నాడు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. చేవెళ్లలో లక్ష మంది మహిళలతో ప్రియాంకా గాంధీ సమక్షంలో ఈ రెండు పథకాలను ప్రారంభించాలని అనుకున్నాం. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయంలో నిర్వహించాల్సి వచ్చింది’’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
వారికి మార్చిలో ‘జీరో’ కరెంట్ బిల్లు: భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఈ నెలలో 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడే అర్హులకు మార్చిలో ‘జీరో’ బిల్లు వస్తుందని చెప్పారు. ‘‘ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో బ్యాంకుల నుంచి ఓవర్డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్ని గత ప్రభుత్వం కల్పించింది. ఎన్ని ఒడుదొడుకులున్నా దృఢసంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నాం. రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను ప్రారంభించిన ఈరోజు చరిత్రాత్మకం. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ. సాంకేతిక కారణాలతో ఎంపిక కానివారు మండల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయాలి’’ అని భట్టి సూచించారు.
మున్ముందు రూ.500 కడితే చాలు: ఉత్తమ్
ప్రస్తుత విధానంలో లబ్ధిదారు సిలిండర్పై మొత్తం ధర చెల్లిస్తే తర్వాత సబ్సిడీ మొత్తం వారి ఖాతాలో పడుతుందని.. రానున్న రోజుల్లో రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ పథకాన్ని దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభిస్తున్నా.. రానున్న రోజుల్లో అర్హులందరికీ వర్తింపజేస్తామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మిగిలిన గ్యారంటీలనూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గృహజ్యోతి ‘జీరో’ విద్యుత్తు బిల్లు, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, పలువురు ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే