నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు.
11,062 పోస్టులకు విడుదల
మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు
2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
మళ్లీ బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్దఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూలును త్వరలో వెలువరించనున్నారు. డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్దఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతాయని సర్కారు భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీంతో విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశనం చేయనుంది.
మౌలిక వసతులపై నివేదిక
పాఠశాలలకు ఏయే వసతులు కావాలనే దానిపై విద్యాశాఖ సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై ఎంఈవోలు, డీఈవోల ద్వారా సమాచారం తీసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి బుధవారం దీనిపై నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. గురువారం లేదా మరో రోజు జరిగే సమీక్షలో మౌలిక వసతులకు సంబంధించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. -
ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. -
న్యాయవాదుల సీవోపీ నిబంధనలు సవరించాలి
న్యాయవాదులు తాము ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఐదేళ్లకోసారి బార్ కౌన్సిల్కు సమర్పించే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) నిబంధనలను సవరించాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. -
అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్
రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ అందించే కేంద్రాలు ఉన్నా పలు చోట్ల 8 నుంచి 10 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉంటున్నాయి. -
ఛార్జిషీట్ కాపీలు నిందితులకు ఇవ్వండి
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్లో పత్రాల మాయంపై శుక్రవారం నాంపల్లి కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాలు నిందితులకు ఇచ్చిన ఛార్జిషీట్లో లేవని వారి తరఫు న్యాయవాది సురేందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పెరిగిన నర్సింగ్, పారా మెడికల్ ఫీజులు
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఫీజులను పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఫీజులను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
కల్తీ పురుగు మందుల విక్రయాలపై వివరణ ఇవ్వండి
కల్తీ, నకిలీ పురుగు మందుల విక్రయాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంతతి నియంత్రణ(ఏబీసీ) కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేస్తాయని, ప్రత్యేకించి వీధికుక్కల సంతతి నియంత్రణకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని పురపాలకశాఖ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?