ఆవిష్కరణలతో పేదలకు మేలు జరగాలి
శాస్త్రసాంకేతిక రంగాల్లో ఏ పురోగతి సాధించినా.. దాని ఫలాలు ముందుగా పేదలకు దక్కాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉద్ఘాటించారు.
ముందస్తు వ్యాధి నిర్ధారణ చికిత్సలో చాలా కీలకం
అంకుర పరిశ్రమలకు వేదికగా బయో ఏషియా సదస్సు
గవర్నర్ తమిళిసై ఉద్ఘాటన
ఈనాడు- హైదరాబాద్: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఏ పురోగతి సాధించినా.. దాని ఫలాలు ముందుగా పేదలకు దక్కాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉద్ఘాటించారు. ‘‘అల్ట్రాసౌండ్ వంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేక గ్రామీణ పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. మన దేశంలో వైద్యఖర్చులు చాలా ఖరీదైనవి. వాటిని తగ్గించే విధంగా నూతన ఆవిష్కరణలకు బయో ఏషియా సదస్సు వేదికైంది. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ అనంతరం రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను కూడా ప్రారంభ దశలోనే మునుపటి కంటే 20 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో నిర్ధారణ చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. ముందస్తు వ్యాధి నిర్ధారణ చికిత్సలో చాలా కీలకం. పేద ప్రజలకు మేలు చేకూర్చేలా వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో మరిన్ని ఆవిష్కరణలు రావాలి’’ అని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జరుగుతున్న 21వ బయో ఏషియా సదస్సు ముగింపు వేడుకల్లో బుధవారం గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘ఫార్మా, జీవ వైద్య విజ్ఞాన రంగంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించింది. అల్ట్రాసౌండ్ పరీక్షను కొత్త రోబోటిక్ విధానంలో చేయగలిగే ఆవిష్కరణ ఈ సదస్సు ద్వారా అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. పేద రోగులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చేలా.. దీన్ని రూపొందించిన అంకుర సంస్థకు బయో ఏషియాలో పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు రావడానికి ఈ సదస్సు ప్రేరణగా నిలవాలి. నేను కూడా కరోనా నుంచి రక్షణ పొందడానికి భారత్ బయోటెక్ టీకా పొందాను. తెలంగాణలో తయారైన టీకా విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పుడు నేను చెప్పలేనంత ఆనందాన్ని పొందాను’’ అని గవర్నర్ తమిళిసై తెలిపారు.
50వేల మందికి జీవ వైద్యంలో నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్బాబు
జీవ వైద్యశాస్త్ర రంగంలో 50 వేల మంది స్థానిక గ్రాడ్యుయేట్లకు అయిదు నుంచి ఆరేళ్ల లోపు నైపుణ్య శిక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. బయో ఏషియా ముగింపు సదస్సులో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదికకు అనుబంధంగా నెలకొల్పిన ‘సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెలంగాణ’ కేంద్రాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ పేరిట రెండు ప్రత్యేక కోర్సులను ప్రారంభించి నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నాం. దీనికి సంబంధించిన మొదటి బ్యాచ్ను ప్రయోగాత్మకంగా వారం రోజుల్లోనే ప్రారంభించనున్నాం. హీమోఫిలియా అసోసియేషన్ సూచనతో మూడుచోట్ల ప్రయోగాత్మకంగా క్లినికల్ రిజిస్ట్రీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తాం. రోగుల సంఖ్యను నమోదు చేయడం వల్ల వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు, ఆరోగ్య సంరక్షణపై వనరులను మెరుగ్గా కేటాయించడం సాధ్యమవుతుంది. వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్తగా 10వేల ఉద్యోగాలను సృష్టించడం, 20-25 వర్ధమాన కంపెనీలు, స్టార్టప్లను పెంపొందించడం, రిజిస్ట్రీ ద్వారా 10-25 కొత్త ఆలోచనలను రూపొందించడం వంటి లక్ష్యాల దిశగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. భారతదేశ ఫార్మా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 40 శాతం వాటా కలిగి ఉంది. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఇక్కడి నుంచి జరుగుతోంది. 1000 గ్లోబల్ హెల్త్కేర్, లైఫ్ సైన్స్ కంపెనీలకు నిలయంగా తెలంగాణ విరాజిల్లుతోంది’’ అని మంత్రి శ్రీధర్బాబు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది కూడా బయో ఏషియా సదస్సు హైదరాబాద్లోనే నిర్వహించనున్నట్లు శ్రీధర్బాబు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. -
ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. -
న్యాయవాదుల సీవోపీ నిబంధనలు సవరించాలి
న్యాయవాదులు తాము ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఐదేళ్లకోసారి బార్ కౌన్సిల్కు సమర్పించే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) నిబంధనలను సవరించాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. -
అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్
రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ అందించే కేంద్రాలు ఉన్నా పలు చోట్ల 8 నుంచి 10 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉంటున్నాయి. -
ఛార్జిషీట్ కాపీలు నిందితులకు ఇవ్వండి
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్లో పత్రాల మాయంపై శుక్రవారం నాంపల్లి కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాలు నిందితులకు ఇచ్చిన ఛార్జిషీట్లో లేవని వారి తరఫు న్యాయవాది సురేందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పెరిగిన నర్సింగ్, పారా మెడికల్ ఫీజులు
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఫీజులను పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఫీజులను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
కల్తీ పురుగు మందుల విక్రయాలపై వివరణ ఇవ్వండి
కల్తీ, నకిలీ పురుగు మందుల విక్రయాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంతతి నియంత్రణ(ఏబీసీ) కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేస్తాయని, ప్రత్యేకించి వీధికుక్కల సంతతి నియంత్రణకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని పురపాలకశాఖ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?