ఆఫర్లకు ఆకర్షితులవ్వొద్దు.. లింకుల్ని క్లిక్‌ చేయొద్దు

సైబర్‌ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌ ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.

Published : 29 Feb 2024 05:37 IST

అనిశా డీజీ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌ ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు. ఆన్‌లైన్‌ ఆఫర్లకు ఆకర్షితులు కావొద్దని, లింకుల్ని క్లిక్‌ చేయొద్దని, యాప్‌ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని, నమ్మశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టొద్దని పేర్కొన్నారు. ‘సైబర్‌నేరాలు రోజు రోజుకీ విస్తృతమవుతున్నాయి. నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు. ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించినా నేరస్థులు మళ్లీ కొత్త ఖాతాలు తెరిచే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైమ్‌ బృందం రాజస్థాన్‌ వెళ్లి అతికష్టం మీద నిందితుడిని పట్టుకురాగలిగారు. గతేడాది చైనా దేశస్థుల అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి రూ.903కోట్లు, రూ.712 కోట్ల విలువైన మోసాల కేసుల్ని మేం కనిపెట్టగలిగాం. ఇలాంటివి పెద్దస్థాయిలో జరుగుతున్నా నిత్యం వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్‌నేరాల బారిన పడుతున్నారు. నేరస్థులు ఎక్కడో కూర్చుని ఆన్‌లైన్‌లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి..’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని