తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పనేలేదు
‘‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఎక్కడా చెప్పలేదు.
కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు నిరర్థకం
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాల నిరూపణకు సిద్ధం
నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్
ఈనాడు, హైదరాబాద్: ‘‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఎక్కడా చెప్పలేదు. 165 టీఎంసీల లభ్యత ఉంది. కానీ 67 టీఎంసీలే ఉన్నట్లు భారాస ప్రభుత్వం దుష్ప్రచారం చేసి పునరాకృతితో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం చేపట్టింది. నిర్మాణం కోసం సొంతంగా డిజైన్లు రూపొందించుకుంది. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించలేదు’’ అని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను ఆయన మీడియాకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారాస నేత, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలుగా విలేకరులు పలు అంశాలను ప్రస్తావించగా స్పందిస్తూ.. కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల్లో ప్రాజెక్టు ఖర్చుకు, వచ్చే ప్రయోజనానికి నిష్పత్తిని ఎక్కువగా చూపారని, దీనిని నిరూపించేందుకు సిద్ధమని శ్రీరామ్ స్పష్టం చేశారు. తాను భువనగిరి ఎంపీ సీటుకు ప్రయత్నాలు చేస్తున్నాననేది వ్యక్తిగతమని, ఆ విషయం పార్టీ చూసుకుంటుందని అన్నారు.
కేంద్ర సహకారాన్నీ కోరలేదు...
‘‘ప్రాణహితపై 152 మీటర్ల స్థాయిలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 165 టీఎంసీలను మళ్లించాలని 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రాజెక్టును చేపట్టింది. 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టుకు మరోవైపు ఉన్న మహారాష్ట్రను ముంపు విషయంలో (3,665 ఎకరాలు) ఒప్పించలేదు. ఆయకట్టు లేకున్నా కేవలం కాలువల పనులకు రూ.11,917 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఇది. మహారాష్ట్ర 148 మీటర్ల వద్ద నిర్మించుకోవాలని సూచించినా పదేళ్ల కాలంలో అంగీకారానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2014 తరువాత భారాస ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రాన్ని ఒప్పించలేకపోయింది. కనీసం కేంద్ర సహకారం కూడా అడగలేదు.
అనుమతులు లేని ప్రాజెక్టుకు రుణాలు నిలిపివేయాలని లేఖలు రాసిన కేంద్రం
కాళేశ్వరం ప్రాజెక్టును రోజుకు రెండు టీఎంసీల చొప్పున 96 రోజుల్లో 195 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు చేపట్టారు. 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామన్నారు. అదే వరద నీటిని రోజుకు మూడు టీఎంసీల చొప్పున 65 రోజుల్లో మళ్లించుకుంటామని మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల అదనంగా రూ.30 వేల కోట్ల వ్యయం పెరిగింది. ఆయకట్టు ఒక్క ఎకరా పెరగలేదు. అనుమతులు లేని ప్రాజెక్టు కావడంతో రూ.28 వేల కోట్ల రుణాలు నిలిపివేయాలని కేంద్రం బ్యాంకులకు లేఖలు రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగునీటి సెస్, సాగు నీటి పన్నులు వసూలు అవుతాయని డీపీఆర్లో పేర్కొని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారు.
- మేడిగడ్డ విషయంలో కేంద్రం పట్టించుకోలేదనేది అవాస్తవం. 2023 అక్టోబరు 21న కుంగితే 25లోపు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రకాల డేటా ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా అసమగ్ర సమాచారం ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమూ ఈనాటికీ ఆ డేటా అందజేయలేదు. ఇటీవల లేఖ రాశాం.
- మేడిగడ్డ బ్యారేజీలో అన్ని రకాల లోపాలు ఉన్నట్లు అధ్యయనం సందర్భంగా ఎన్డీఎస్ఏ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బ్యారేజీ నిర్మాణంలో జియోలాజికల్ ఫ్రొఫైల్ను తనిఖీ చేయాల్సి ఉంది.
- అన్నారంలోనూ నీటిని నిలిపి ఎత్తిపోయొచ్చని భారాస నాయకులు అంటున్నారు. ఇప్పటికే లీకేజీలు బయటపడ్డాయి. నీటిని నింపితే ఒత్తిడితో మరింత నష్టం జరుగుతుంది.
- కాళేశ్వరం ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయంగా నదుల అనుసంధానంలో నిర్మించే ఇచ్చంపల్లి నుంచి వెనుక నీటిని తీసుకోవచ్చు. లేదా 100 టీఎంసీలతో మరొక బ్యారేజీ నిర్మాణానికి కూడా అవకాశం ఉంది.
- 2004లో చేపట్టిన దేవాదులలో డిజైన్ లోపాలు ఉన్నాయి. ఈ ఎత్తిపోతల కిందే నాకు అయిదు ఎకరాలు ఉన్నా చుక్కనీరు రావడం లేదు.
గందరగోళం సృష్టిస్తున్న భారాస, కాంగ్రెస్
కృష్ణా, గోదావరి బోర్డులు రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన సంస్థలు. నాటీ యూపీఏ ప్రభుత్వమే చట్టం చేసింది. ఆ చట్టంలో రాసిందే మేం అమలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు భౌగోళికంగా ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే ఆ రాష్ట్రం నిర్వహించుకోవాలని రాశారు. బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన చట్టంలో అన్ని కాంపొనెంట్లు బోర్డు చూస్తుందని రాశారు. ఇదిలాఉంటే మీ నిర్వాకంతోనే కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లాయంటూ భారాస, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నాయి. ట్రైబ్యునల్ చేసిన నీటి వాటాల పర్యవేక్షణ మాత్రమే బోర్డు బాధ్యతని తెలిసినా ఇలా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నా 2015లో కృష్ణా జలాల పంపకం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలే ఎందుకు అడిగింది? 2020 నుంచి మాత్రమే 50 శాతం చొప్పున పంపిణీకి డిమాండ్ చేస్తోంది. తెలంగాణ హక్కుల పరిరక్షణకే నదీ జలాల పంపిణీకి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్-2కు విధివిధానాలు ఖరారు చేసింది. వీలైనంత త్వరగా మొత్తం నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్ డ్యాంలు ప్రమాదంలో ఉన్నాయని ఇటీవల ఎన్డీఎస్ఏ గుర్తించింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలి’’ అని వెదిరె శ్రీరామ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్