ధరణి అర్జీలకు మోక్షం!
ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్
మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం
ఒక్కో మండలంలో రెండు లేదా మూడు బృందాల ఏర్పాటు
మండల స్థాయిలో విచారణ.. అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు
జిల్లా కలెక్టర్ల అధికారాల విభజన
ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ
ఈనాడు, హైదరాబాద్: ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం (మార్చి 1) నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి.. విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డీఆర్డీఏ, వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులను ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి.. విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతోపాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి.. పరిష్కారం లేదా తిరస్కరణలలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ పేర్కొన్నారు.
తహసీల్దార్ల స్థాయిలో..
నాలుగు రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దారు పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా పహాణీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి.. సమస్యలను పరిష్కరిస్తారు.
టీఎం-4: ఎసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు (పాసుపుస్తకాలు కూడా)
టీఎం-10: జీపీఏ/ఎస్పీఏ/ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు
టీఎం-14: భూ సమస్యలకు సంబంధించిన వినతులు
టీఎం-32: రెండు, మూడు ఖాతాలు నమోదై ఉంటే కలపడం
ఆర్డీవో స్థాయిలో..
ఆరు రకాల మాడ్యూళ్లలో వచ్చిన దరఖాస్తులను ఆర్డీవోలు పరిష్కరిస్తారు. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి.. విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది.
టీఎం-7: పాసుపుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి
టీఎం-16: భూ సేకరణకు సంబంధించిన సమస్యలు
టీఎం-20: ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు
టీఎం-22: సంస్థల పేరుతో పాసుపుస్తకాలు
టీఎం-26: కోర్టు కేసులు, సమాచారం
టీఎం-33: పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైనవి
మూల విలువ రూ.5 లక్షల్లోపు ఉన్న భూములకు సంబంధించిన మిస్సింగ్ సర్వే నంబర్లు/సబ్ డివిజన్ సర్వే నంబర్లు/విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారు.(రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం)
కలెక్టర్ల పరిధిలో..
ఆర్డీవోల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీవోలకు నివేదికలు ఇవ్వాలి. ఆర్డీవోలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలి. తిరస్కరించే దరఖాస్తులకు సరైన కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలి. ఏడు రకాల మాడ్యూళ్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, ఆర్డీవోల స్థాయిలో విచారణలు చేసిన అనంతరమే వీరు చర్యలు తీసుకోవాలి.
టీఎం-3: యాజమాన్య హక్కుల బదిలీ(మ్యుటేషన్)
టీఎం-4: ఎసైన్డ్ భూములతోపాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసుపుస్తకాలు లేనివి
టీఎం-15: నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు
టీఎం-23: సెమీ అర్బన్ భూములు
టీఎం-24: కోర్టు కేసులు-పాసుపుస్తకాలు
టీఎం-31: ఇళ్లు/ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి
టీఎం-33: పాసుపుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి. వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు. మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్లు
మూల విలువ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు (రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం)
సీసీఎల్ఏ స్థాయిలో..
టీఎం-33 మాడ్యూల్కు సంబంధించి అన్ని రకాల పాసుపుస్తకాల సవరణలను సీసీఎల్ఏ చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూమి స్వభావం మార్పు, మూల విలువ రూ.50 లక్షల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించి సవరణలు, మిస్సింగ్ సర్వే/సబ్ డివిజన్ తదితర సవరణలు చేపడతారు. అన్నిరకాల దరఖాస్తులను తహసీల్దార్లకు పంపించి.. విచారణ చేయిస్తారు. తహసీల్దారు ఆర్డీవోకు, అక్కడి నుంచి అదనపు కలెక్టర్కు పంపుతారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్కు పంపుతారు. అక్కడి నుంచి సీసీఎల్ఏకు నివేదిక చేరుతుంది.
నిర్దిష్ట సమయంలో పరిష్కారం
2020 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి.. వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు