విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక మేరకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్లు ఇస్తాం
భారాస పాపాల్లో భాజపాకూ పాత్ర: మంత్రి ఉత్తమ్
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక మేరకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. విజిలెన్స్ నేడో రేపో మరో నివేదిక ఇవ్వనుందని అనంతరం న్యాయ సలహా తీసుకుని చర్యలు చేపడతామన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని సీడబ్ల్యూసీ చెప్పిందని కేంద్ర జలశక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ గురువారం కుండబద్ధలు కొట్టారు. ఈ ప్రాజెక్టుతో కాంగ్రెస్కు పేరొస్తుందని, కమీషన్లు మిగలవని కేసీఆర్ కుట్ర చేసి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. నీళ్ల కోసం కాదు. పైసల కోసం కాళేశ్వరం కట్టారు. చంద్రశేఖర్ అయ్యర్తో కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. శనివారం దిల్లీకి వెళ్లి కమిటీ, నిపుణులను కలుస్తాను. త్వరగా అధ్యయనం చేసి ఎలా ముందుకు వెళ్లాలనేది సూచించాలని కోరుతాం. ఆ కమిటీ నెల రోజుల్లో ఒక నివేదిక ఇస్తుంది. నాలుగు నెలల్లోనే పూర్తి నివేదిక అందిస్తుంది. నివేదిక రాగానే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు ఇస్తాం. భారాస నాయకులు వాళ్లే విధ్వంసం చేసి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డను బొందలగడ్డ అన్నవాళ్లు నేడు ఎందుకు వెళ్లారో. కనీసం అక్కడికి వెళ్లైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారాస నాయకులు వెళ్లే బస్సు టైర్ పేలింది. ఇప్పటికే కారు షెడ్కు పోయింది. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) కన్నా కేటీఆర్ నిపుణుడేమీ కాదు. కాఫర్ డ్యాం కట్టి నీళ్లను మళ్లించొచ్చు అని పనికిమాలిన ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతేడాది అక్టోబరు 21న పిల్లర్లు కుంగితే డిసెంబరు 7 వరకు భారాస ప్రభుత్వమే ఉంది. అన్ని రోజులు మాట్లాడని నాటి సీఎం కేసీఆర్ ఆ తరువాత నల్గొండ వెళ్లి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్నారం, సుందిళ్లలోనూ నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. డిజైన్లు, జీఐఎస్ సర్వే తదితర లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. నాటి ప్రభుత్వం ఒక్క నివేదిక కూడా రూపొందించలేదు. ఎన్డీఎస్ఏ అడిగినా ఇవ్వలేదు. మా ప్రభుత్వాన్ని అడిగినా నివేదికలేవీ లేవని స్పష్టంగా చెప్పాం. బ్యారేజీ పూర్తయిందని ఒకటి కన్నా ఎక్కువ నివేదికలను గత ప్రభుత్వంలో ఇచ్చారు’ అని తెలిపారు.
పదే పదే అబద్ధాలు..: మేడిగడ్డ నిర్మాణంలో బ్లాకుల వారీగా నివేదికలు రూపొందించలేదని మంత్రి పేర్కొన్నారు. ‘చాలా నివేదికలు లేవు. వానాకాలం ముందు, తరువాత ప్రవాహ నివేదికలు లేవు. నివేదికలు రూపొందించే విధానంలో ఏదో మతలబు ఉందని విజిలెన్స్ అభిప్రాయపడింది. నిర్మాణంలోకక్కుర్తి, అసమర్థత, నిర్లక్ష్యం ఉన్నాయి. కాళేశ్వరం కింద ఐదేళ్లలో 120 టీఎంసీలు ఎత్తిపోసి స్థిరీకరణకు నీళ్లు ఇచ్చామని పదే పదే అబద్ధాలు చెబుతున్నారు. భారాస, భాజపాల మధ్య అలయ్ బలయ్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.లక్ష కోట్ల రుణాలు ఎలా అందాయి. భారాస పాపాల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. విద్యుత్ ఖర్చు యూనిట్కు రూ.6 అయితే రూ.3గా చూపడం, వరి దిగుబడిని మూడింతలుగా చూపి రుణాలు తీసుకొచ్చారు. నిర్మాణ సంస్థ కాకుండా ఉప గుత్తేదారులు ఉన్నట్లు మాకు తెలిసినా దస్త్రాలపరంగా ఎక్కడా కనిపించలేదు. ఎల్అండ్టీ సంస్థకు రూ.400 కోట్ల బిల్లులు నిలిపివేశాం. కేంద్ర బలగాలు తొలగిస్తే సాగర్ నిర్వహణ పూర్తి స్థాయిలో చేపడుతాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు తుమ్మిడిహెట్టి నిర్మిస్తాం.’ అని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు