ట్యాంక్బండ్పై శ్రీపాదరావు విగ్రహం
కుమురం భీం, రాంజీగోండు, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వంటి ఉద్యమకారులతోపాటు జైపాల్రెడ్డి, శ్రీపాదరావు వంటి ఇతర మహనీయుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
ఆయనతో పాటు మరికొందరివీ
దీనిపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రవీంద్రభారతి, న్యూస్టుడే: కుమురం భీం, రాంజీగోండు, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వంటి ఉద్యమకారులతోపాటు జైపాల్రెడ్డి, శ్రీపాదరావు వంటి ఇతర మహనీయుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అందుకు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం- భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం ముఖ్యఅతిథిగా హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. ‘పీవీ నరసింహారావు ఆదర్శాలను కొనసాగిస్తూ.. శ్రీపాదరావు మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా ఉమ్మడి ఏపీ శాసన సభాపతిగా సేవలు అందించిన గొప్ప నాయకుడు. శాసనసభ నిర్వహణలో ఒక మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆయన కుమారుడైన శ్రీధర్బాబు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా నా వెంట ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్షాలు ఏ అంశాన్ని ప్రస్తావించాలన్నా పూర్తిస్థాయి అవకాశమిస్తున్నారు. ఈ విషయంలో శ్రీధర్బాబుకు ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం, తండ్రి శ్రీపాదరావు నుంచి పొందిన స్ఫూర్తి తెలుస్తున్నాయి. సంక్షేమం, పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు జీవితాన్ని నవతరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న బాలలత, పూర్ణ, డాక్టర్ నరేందర్కుమార్, హిమాన్షీ తదితరులకు పురస్కారాలు ప్రదానం చేశారు. శ్రీపాదరావుకు నివాళిగా రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించడంతోపాటు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. కార్యక్రమంలో శ్రీపాదరావు సతీమణి జయశ్రీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, వేం నరేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నాయకులు మధుయాస్కీ గౌడ్, చాడ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం