దివ్యాంగులకు త్వరలో 5 శాతం రిజర్వేషన్లు
రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు విద్యావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని ఆదేశించారు.
అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్
ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు
జీహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు
మహిళా, శిశు సంక్షేమశాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు విద్యావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, ఉపాధి హామీ పథకం కింద తొలి ప్రాధాన్యంగా వీటి నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. శనివారమిక్కడ సచివాలయంలో శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారితో కలిసి మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు.
‘‘ఆర్నెల్లకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి శిశు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారానికి ఎన్ని నిధులు అవసరం? టీఎస్ ఫుడ్స్కు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? చిన్నారులకు ఆటలు, బొమ్మలతో కూడిన బోధన కోసం నిధులెన్ని అవసరం? వెంటనే అధికారులు దస్త్రం పంపాలి. మహిళాశిశు సంక్షేమశాఖకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. అంగన్వాడీ సెంటర్లన్నీ ఒకేలా కనిపించాలి. వాటిలో బొమ్మలు, ఇతర బోధన సామగ్రి ఉంచాలి. మహిళల్లో ఎందుకు రక్తహీనత సమస్యలు వస్తున్నాయి. రక్తహీనత, పౌష్టికాహారలోపం సమస్యల నివారణకు ప్రణాళిక రూపొందించాలి.
గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయాలా? లేదా ఇంటివద్ద చేయాలా..? వారికి సరకులు అందించేందుకు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వానికి పంపాలి. అంగన్వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. టాటా ఆధ్వర్యంలో నడిచే పారిశ్రామిక శిక్షణ కేంద్రాల సహకారం పొందాలి. బాలల న్యాయచట్టం, సీడబ్ల్యూసీ, బాలల పరిరక్షణ కమిషన్లో సభ్యుల నియామకాలు పూర్తిచేస్తాం. మహిళా గ్రూపులతో శానిటరీ నాప్కిన్లు తయారు చేయించాలి. పాఠశాల, కళాశాలల విద్యార్థినులకు ఉచితంగా నాప్కిన్లు అందించాలి. దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి. ట్రాన్స్జెండర్ల సంక్షేమం, ఉపాధి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేయాలి. వృద్ధాశ్రమాల నిర్మాణాలకు అవసరమైన నిధుల ప్రతిపాదనలివ్వాలి’’ అని సీఎం ఆదేశించారు.
దత్తత ఎందుకు ఆలస్యమవుతోంది?
పిల్లల్లేని దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసిన ఎందుకు ఆలస్యమవుతోందని రేవంత్ అధికారులను ప్రశ్నించారు. దత్తత కోసం దరఖాస్తు చేసినా దంపతుల కుటుంబ, ఆరోగ్య, ఆదాయ, న్యాయ నివేదికలు సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పడుతోందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 200 మంది చిన్నారులుండగా.. దాదాపు 18 వేల మందికిపైగా దంపతులు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. దత్తతకు ముందు ప్రక్రియను జిల్లాల్లో శిశు సంక్షేమ అధికారులు నిర్ణీత గడువులోగా చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షలో మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, కమీషనర్ కాంతివెస్లీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్