విద్యుత్ సంస్థల్లో పైరవీకారులపై కొరడా
కీలక ప్రాంతాల్లో పాతుకుపోయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యుత్ సంస్థ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులపై కొత్తగా వచ్చిన సీఎండీలు దృష్టి సారించారు.
పని చేయని ఇంజినీర్లపై చర్యలు
ఒకేచోట పాతుకుపోయిన వారికి బదిలీలు
ఈనాడు, హైదరాబాద్: కీలక ప్రాంతాల్లో పాతుకుపోయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యుత్ సంస్థ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులపై కొత్తగా వచ్చిన సీఎండీలు దృష్టి సారించారు. కొందరు ఇంజినీర్లు రాజకీయ నేతల అండతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి డీఈని క్రమశిక్షణ చర్యల కింద మింట్కాంపౌండ్లోని డిస్కం ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిర్యాలగూడలో విద్యుత్ డిమాండును సరిగా అంచనా వేయకుండా కోతలకు కారణమైనందుకు డీఈకి ఛార్జి మెమో జారీ చేసింది. కొండాపూర్ ప్రాంతంలో అకస్మాత్తుగా సరఫరా నిలిపివేసిన ఒక లైన్మెన్, మరో ఇద్దరు జూనియర్ లైన్మెన్లను డిస్కం సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితం తాత్కాలిక ఉద్యోగికి వేతన బకాయిల సొమ్ము విడుదల చేయడానికి రూ.35 వేల లంచం తీసుకుంటూ దక్షిణ డిస్కం హైదరాబాద్ హబ్సిగూడ కార్యాలయం జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అనిశాకు పట్టుబడ్డారు. గతంలో పైరవీలతో కీలక పోస్టుల్లో చేరిన ఇంజినీర్లకు విద్యుత్ సంస్థలు స్థానచలనం కల్పిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు కదిలేదిలేదంటూ ఇంకా పైరవీలు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ముగ్గురు డివిజనల్ ఇంజినీర్ల(డీఈ)ను బదిలీ చేస్తూ మూడు విద్యుత్ సంస్థలు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. వీరిలో ఇద్దరు రిలీవ్ కాకుండా బదిలీని ఆపేందుకు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక డీఈపై పలు ఆరోపణలు ఉండటంతో బదిలీ చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు డీఈ నగరంలోని ఓ ఎమ్మెల్యేకు, ఏపీలో ఓ వైకాపా ముఖ్యనేతకు దగ్గరని ప్రచారం ఉంది.
ఐటీ కారిడార్లో అనేక వివాదాలు
నగరంలోని ఐటీ కారిడార్, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ ఇంజినీర్ల పోస్టులకు బాగా డిమాండు ఉంది. ఇక్కడ ఏఈ, ఏడీఈ, డీఈ పోస్టు దక్కాలంటే పలుకుబడితోపాటు పెద్దమొత్తంలో లంచాలు ఇవ్వాలనే ప్రచారం ఉంది. విద్యుత్ సంస్థల్లో ఫోకల్(కీలక), నాన్ ఫోకల్(అప్రాధాన్య) విభాగాలుంటాయి. ఐటీ కారిడార్లో ఏఈ లేదా డీఈగా మూడేళ్లు పనిచేస్తే తప్పనిసరిగా కార్యాలయంలో నాన్ఫోకల్ పోస్టులోకి బదిలీ చేయాలి. కానీ కొందరు ఫోకల్ పోస్టుల్లోనే పాతుకుపోయి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఎర్రగడ్డలో ట్రాన్స్కోకు చెందిన చీఫ్ ఇంజినీరు గ్రామీణ విభాగం కార్యాలయం ఉంది. అక్కడ అకౌంట్స్ విభాగంలో దశాబ్దకాలంగా పనిచేస్తున్న సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులు బయట ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రోజూ మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆఫీసుకు వస్తున్నట్లు సీఎండీ రిజ్వీకి కొందరు ఫిర్యాదు చేశారు.
రాజకీయ వివాదాలతోనూ పలు మార్పులు..
నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దీనికితోడు ఇసుక, కంకర తరలింపు గుత్తేదారు మార్పు కోసం కొందరు నేతలు పట్టుబట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి సహాయ డీఈ(ఏడీఈ)ని రామగుండం థర్మల్ విద్యుత్కేంద్రానికి బదిలీ అయ్యారు. రాజకీయ నేతల మధ్య వివాదాలకు ఏడీఈని ఎలా బదిలీ చేస్తారని ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని వెనుక ప్రతిపక్ష నేతల హస్తం ఉందని ఆరోపణలు రావడంతో వెంటనే అక్కడి సహాయ ఇంజినీరు(ఏఈ)ని జోగులాంబ జిల్లా ఆలంపూర్కు బదిలీ చేస్తూ ట్రాన్స్కో ఉత్తర్వులు జారీ చేసింది. ఒక లైనులో మంటలు వస్తే టెక్నికల్ అసిస్టెంటు మరో లైను సరఫరా నిలిపివేశారని, దీనికి ఏఈని బదిలీ చేయడమేంటని రాష్ట్ర ఇంజినీర్ల సంఘం ట్రాన్స్కో అధికారుల వద్ద నిరసన తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల