మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్ ఆఫ్ వాల్- సీకెంట్ పైల్్్సకు సంబంధించిన డిజైన్ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు
మూడో రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు
అన్నారం.. మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు?
డీపీఆర్ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా?
పలు ఇంజినీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్ ఆఫ్ వాల్- సీకెంట్ పైల్్్సకు సంబంధించిన డిజైన్ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డలో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాల్- సీకెంట్ పైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్వాల్స్ లేవనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్ కిందనే సీకెంట్ పైల్స్ ఉంటే, మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్కు సీకెంట్ పైల్స్కు మధ్య ఒక మీటర్ తేడా ఉందని, దీనికి కారణమేంటని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. మూడో రోజు విచారణలో భాగంగా కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఇంజినీర్లతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో, నిర్మాణంలో పాలుపంచుకొన్న ఇంజినీర్లతో సుదీర్ఘంగా చర్చించింది. నిర్మాణ స్థలం నిర్ధారణలో మీ పాత్ర ఏంటి? ఇందులో సీకెంట్ పైల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, సీడీవో పాత్ర డిజైన్ వరకే పరిమితమా అని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీతో సంబంధం లేదని సీడీవో ఇంజినీర్లు చెప్పారు. ‘‘మొదట షీట్ పైల్స్/ఆర్.సి.సి.డయాఫ్రం వాల్ ప్రతిపాదించాం. షీట్ పైల్స్ వీలు కాదని ఎన్.ఐ.టి. వరంగల్ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి తేల్చారని కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ లేఖ రాశారు. సీకెంట్ పైల్స్ ప్రతిపాదనను మొదట ఎల్అండ్టీ తీసుకొచ్చింది. ఉత్తర ప్రత్యుత్తరాల క్రమంలో 2017 ఏప్రిల్ 17న కాళేశ్వరం సీఈ.. సీడీవోకు లేఖ రాశారు. నిర్మాణ స్థలాన్ని బట్టి మూడు బ్యారేజీలలోనూ సీకెంట్ పైల్స్- కట్ ఆఫ్ చేపట్టాలని నిర్ణయించామని, దీని ప్రకారం డిజైన్ ఇవ్వాలని కోరారు’’ అని సీడీవో ఇంజినీర్లు నిపుణుల కమిటీకి వివరించినట్లు సమాచారం. సీకెంట్ పైల్స్ వర్టికాలిటీలో ఏదైనా సమస్య అనిపిస్తే ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలని కూడా కోరామని చెప్పినట్లు తెలిసింది. పని సరిగా చేయకుంటే దాన్ని నిలుపుదల చేసే అధికారం ఉందా.. అని అయ్యర్ అడగ్గా, లేదని సీడీవో ఇంజినీర్లు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. బోర్వెల్స్ డేటా గురించి పదే పదే ఎందుకు అడిగారు, మీకేమైనా అనుమానం వచ్చిందా అని కమిటీ.. వారిని ప్రశ్నించింది. రెండు కిలోమీటర్ల బ్యారేజీకి మూడు బోర్వెల్స్ డేటా సరిపోదని, పదేపదే ఒత్తిడి చేసిన తర్వాత 30 వరకు బోర్వెల్స్ డేటా ఇచ్చారని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
నిర్వహణ లోపాలపై ఆరా
ఓఅండ్ఎం ఇంజినీర్లతో జరిగిన సమావేశంలో.. మూడు బ్యారేజీలకు సంబంధించిన నిర్వహణ డేటాను అందజేయాలని కమిటీ సూచించింది. నిర్వహణ లోపాలపైనా ఆరా తీసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తోందని, ఇంకా నిర్వహణ గడువు ఆ సంస్థపై (డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్) ఉందని ఓఅండ్ఎం ఇంజినీర్లు పేర్కొన్నట్లు సమాచారం.
క్వాంటిటీస్ ఎందుకు పెరిగాయ్?
2017 ఫిబ్రవరిలో డీపీఆర్కు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపితే 2016లోనే కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారని, ఇదెలా సాధ్యమైందని కమిటీ.. ఇంజినీర్లను అడిగినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రాడార్ సర్వేలో డిపార్ట్మెంట్ ఇంజినీర్లు భాగస్వాములై ఉంటే వారి వివరాలు ఇవ్వాలని, బ్యారేజీలు ప్రారంభించిన తర్వాత ఎక్కువ వరద వివరాలు, బ్యారేజీల పైన, దిగువన చేసిన పరీక్షల రికార్డులన్నింటిపైనా సంతకాలు చేసి ఇవ్వాలని కమిటీ కోరింది. మేడిగడ్డ బ్యారేజీలో డీపీఆర్లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్ ఎందుకు పెరిగాయని అడిగినట్లు తెలిసింది. ఈ డీపీఆర్ను కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్ తయారు చేసింది.
రాజీవ్ రతన్తో భేటీ
చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్తో భేటీ అయింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల్లో లోటుపాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తోంది. విజిలెన్స్ విచారణ సందర్భంగా గుర్తించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
పునరుద్ధరణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులు చేయండి
నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీలు అనిల్కుమార్, నాగేంద్రరావుతో కూడా కమిటీ సమావేశం అయింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులు చేయాలని, వర్షాకాలంలో వచ్చే వరదల మూలంగా బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నివారించేందుకు తగిన సూచనలు చేయాలని కమిటీని వారు కోరారు. దీనికి స్పందించిన కమిటీ తాము కోరుతున్న సమాచారం వెంటనే అందించాలని, బ్యారేజీ వద్ద ప్రమాద నివారణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులను అందజేస్తామని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
జలసౌధలో చివరి రోజు విచారణ అనంతరం హిమాయత్సాగర్లో తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని కమిటీ సందర్శించింది. అక్కడ ఏర్పాటు చేసిన మేడిగడ్డ, ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలించింది. ఫ్లడ్ డిశ్చార్జి, హైడ్రాలిక్ పర్టిక్యులర్స్తోపాటు వివిధ దశల్లో నీటి విడుదల, నిల్వ ప్రభావాలకు సంబంధించి గతంలో చేసిన అధ్యయనాలను చూసింది. స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్వో) ఇంజినీర్లతోనూ కమిటీ భేటీ అయింది.
మరింత లోతుగా విచారించాల్సి ఉంది: చంద్రశేఖర్ అయ్యర్
బ్యారేజీలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్ అయ్యర్ పేర్కొన్నారు. జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డతోపాటు ఇతర ఆనకట్టల అంశం పరిశీలనలో ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ