మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్
హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన
32 ఈసేవా కేంద్రాలనూ ప్రారంభించిన సీజేఐ
కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష
ఈనాడు, హైదరాబాద్: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. సరైన మౌలిక వసతులుంటే రెట్టింపు పనిచేయగలరని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేలు భూమిపూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో 31 జిల్లాల్లోని 32 ఈ-సేవా కేంద్రాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు.
గతంలో జిల్లా కోర్టుల్లో మరుగుదొడ్లూ లేని దుస్థితి
‘‘వ్యవస్థ కోసం జీవితాన్ని వెచ్చించే న్యాయవాదులు, న్యాయమూర్తులకు సౌకర్యవంతమైన ఛాంబర్లు.. జడ్జీలు, న్యాయవాదులను కలవడానికి వచ్చేవారికి, యువ న్యాయవాదులకు ప్రత్యేకమైన ప్రాంతాలు అవసరం. దేశంలో చాలా జిల్లా కోర్టుల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో మహిళా న్యాయవాదులు, జడ్జీలు ఉదయం కోర్టుకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేదాకా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక తెప్పించగా జిల్లా కోర్టులతోపాటు పలు హైకోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని తేలింది. గతంలో పరిస్థితులు సరిగా లేక.. బెయిలు, పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, గృహహింస వంటి సున్నిత కేసుల్లోనూ న్యాయమూర్తులు ఉదాసీనంగా పనిచేసేవారు. దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, పసిబిడ్డల తల్లులు న్యాయస్థానాలకు వచ్చినప్పుడు సరైన వసతులు లేక ఇబ్బందులు పడేవారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనం ఇలాంటి సమస్యలన్నింటికీ తెరదించాలి.
రూ.7 వేల కోట్లతో ఈ-కోర్టుల మూడో దశ
దేశవ్యాప్తంగా రూ.7,000 కోట్లతో చేపట్టిన ఈ-కోర్టుల మూడో దశలో భాగమే తెలంగాణలో ప్రారంభించిన 32 ఈ-సేవా కేంద్రాలు. ప్రస్తుతం న్యాయవాదులు, న్యాయమూర్తులతోపాటు ప్రజలకూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికతలో ఎవరూ వెనుకబడకూడదు. సమాజంలో యువత పెరుగుతోంది. విధానాల రూపకర్తలు వారిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. యువ న్యాయవాదులు తక్షణ ఫలితం ఆశిస్తున్నారు. వివాదాలకు కోర్టుల్లో పరిష్కారం కంటే మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ మార్గాలూ ఉన్నాయి.
జిల్లా కోర్టుల్లో 50 శాతానికి పైగా మహిళలే
మన పితృస్వామిక వ్యవస్థలో సామాజిక అసమానతలు, శారీరక దారుఢ్య సమస్యల కారణంగా గతంలో మహిళలు న్యాయవ్యవస్థలో రాణించడానికి అడ్డంకులు ఉండేవి. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల్లో మహిళల సంఖ్య పెరిగింది. జిల్లా జడ్జీల్లో 50 శాతం దాకా వారే ఉంటున్నారు. వచ్చే దశాబ్దకాలంలో న్యాయమూర్తులు, బార్లో వారే కీలకం కానున్నారు. వారికి ప్రత్యేకంగా గదులు ఉండాలి. సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు.. యువ న్యాయవాదులు, జడ్జీలకు మార్గదర్శనం చేయాలి. హైకోర్టు కొత్త భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి, అందుకు కృషి చేసిన న్యాయమూర్తులకు అభినందనలు’’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు.
న్యాయవాదులకూ ఛాంబర్ అవసరం: జస్టిస్ పి.ఎస్.నరసింహ
న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకూ మెరుగైన ఛాంబర్లు ఉండాలన్నది తన కల అని, మూడు దశాబ్దాల్లో ఇది వాస్తవ రూపం దాల్చుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ పేర్కొన్నారు. విధుల నిర్వహణకు మెరుగైన వాతావరణం అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మిస్తున్న ప్రాంతంలో పచ్చదనం బాగా ఉందని, దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే మాట్లాడుతూ.. సత్వర న్యాయం అందించడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. పర్యావరణానికి భంగం వాటిల్లనివ్వబోమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటుచేసే మౌలిక వసతులు మెరుగైన పని పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నా.
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
హైకోర్టు భవనం.. విలువలకు, ఆలోచనలకు, హక్కులకు, విధులకు, బాధ్యతల నిర్వహణతోపాటు చట్టం ఆధిపత్యాన్ని నిలిపే ప్రజాక్షేత్రం.
తెలంగాణ హైకోర్టు కొత్తగా ఏర్పాటైనప్పటికీ ఎంతో చరిత్ర ఉంది. 1919లో ఏడో నిజాం మీర్ అలీఖాన్ నిర్మించిన భవనం చారిత్రకచిహ్నంగా నిలవడమే కాకుండా మానవతామూర్తులను అందించింది. జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్ బి.జీవన్రెడ్డిలతోపాటు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పనిచేసిన జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి ఇక్కడి నుంచే వచ్చారు.
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!