మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్
హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన
32 ఈసేవా కేంద్రాలనూ ప్రారంభించిన సీజేఐ
కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష
ఈనాడు, హైదరాబాద్: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. సరైన మౌలిక వసతులుంటే రెట్టింపు పనిచేయగలరని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేలు భూమిపూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో 31 జిల్లాల్లోని 32 ఈ-సేవా కేంద్రాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు.
గతంలో జిల్లా కోర్టుల్లో మరుగుదొడ్లూ లేని దుస్థితి
‘‘వ్యవస్థ కోసం జీవితాన్ని వెచ్చించే న్యాయవాదులు, న్యాయమూర్తులకు సౌకర్యవంతమైన ఛాంబర్లు.. జడ్జీలు, న్యాయవాదులను కలవడానికి వచ్చేవారికి, యువ న్యాయవాదులకు ప్రత్యేకమైన ప్రాంతాలు అవసరం. దేశంలో చాలా జిల్లా కోర్టుల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో మహిళా న్యాయవాదులు, జడ్జీలు ఉదయం కోర్టుకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేదాకా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక తెప్పించగా జిల్లా కోర్టులతోపాటు పలు హైకోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని తేలింది. గతంలో పరిస్థితులు సరిగా లేక.. బెయిలు, పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, గృహహింస వంటి సున్నిత కేసుల్లోనూ న్యాయమూర్తులు ఉదాసీనంగా పనిచేసేవారు. దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, పసిబిడ్డల తల్లులు న్యాయస్థానాలకు వచ్చినప్పుడు సరైన వసతులు లేక ఇబ్బందులు పడేవారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనం ఇలాంటి సమస్యలన్నింటికీ తెరదించాలి.
రూ.7 వేల కోట్లతో ఈ-కోర్టుల మూడో దశ
దేశవ్యాప్తంగా రూ.7,000 కోట్లతో చేపట్టిన ఈ-కోర్టుల మూడో దశలో భాగమే తెలంగాణలో ప్రారంభించిన 32 ఈ-సేవా కేంద్రాలు. ప్రస్తుతం న్యాయవాదులు, న్యాయమూర్తులతోపాటు ప్రజలకూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికతలో ఎవరూ వెనుకబడకూడదు. సమాజంలో యువత పెరుగుతోంది. విధానాల రూపకర్తలు వారిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. యువ న్యాయవాదులు తక్షణ ఫలితం ఆశిస్తున్నారు. వివాదాలకు కోర్టుల్లో పరిష్కారం కంటే మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ మార్గాలూ ఉన్నాయి.
జిల్లా కోర్టుల్లో 50 శాతానికి పైగా మహిళలే
మన పితృస్వామిక వ్యవస్థలో సామాజిక అసమానతలు, శారీరక దారుఢ్య సమస్యల కారణంగా గతంలో మహిళలు న్యాయవ్యవస్థలో రాణించడానికి అడ్డంకులు ఉండేవి. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల్లో మహిళల సంఖ్య పెరిగింది. జిల్లా జడ్జీల్లో 50 శాతం దాకా వారే ఉంటున్నారు. వచ్చే దశాబ్దకాలంలో న్యాయమూర్తులు, బార్లో వారే కీలకం కానున్నారు. వారికి ప్రత్యేకంగా గదులు ఉండాలి. సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు.. యువ న్యాయవాదులు, జడ్జీలకు మార్గదర్శనం చేయాలి. హైకోర్టు కొత్త భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి, అందుకు కృషి చేసిన న్యాయమూర్తులకు అభినందనలు’’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు.
న్యాయవాదులకూ ఛాంబర్ అవసరం: జస్టిస్ పి.ఎస్.నరసింహ
న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకూ మెరుగైన ఛాంబర్లు ఉండాలన్నది తన కల అని, మూడు దశాబ్దాల్లో ఇది వాస్తవ రూపం దాల్చుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ పేర్కొన్నారు. విధుల నిర్వహణకు మెరుగైన వాతావరణం అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మిస్తున్న ప్రాంతంలో పచ్చదనం బాగా ఉందని, దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే మాట్లాడుతూ.. సత్వర న్యాయం అందించడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. పర్యావరణానికి భంగం వాటిల్లనివ్వబోమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటుచేసే మౌలిక వసతులు మెరుగైన పని పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నా.
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
హైకోర్టు భవనం.. విలువలకు, ఆలోచనలకు, హక్కులకు, విధులకు, బాధ్యతల నిర్వహణతోపాటు చట్టం ఆధిపత్యాన్ని నిలిపే ప్రజాక్షేత్రం.
తెలంగాణ హైకోర్టు కొత్తగా ఏర్పాటైనప్పటికీ ఎంతో చరిత్ర ఉంది. 1919లో ఏడో నిజాం మీర్ అలీఖాన్ నిర్మించిన భవనం చారిత్రకచిహ్నంగా నిలవడమే కాకుండా మానవతామూర్తులను అందించింది. జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్ బి.జీవన్రెడ్డిలతోపాటు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పనిచేసిన జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి ఇక్కడి నుంచే వచ్చారు.
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం