వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత
అమ్మిన సరకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్
రెండు డిస్టిలరీల్లోనే రూ.500 కోట్ల అక్రమాలు బహిర్గతం
మొత్తం 19 చోట్లా తనిఖీ చేస్తే ఇంకెంతో?
వ్యాపారులు, అధికారులు, నేతల కుమ్మక్కు!
విచారణలో గుర్తించిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తయారీ నుంచి అమ్మకాల దాకా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్)ను ఎగ్గొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అవినీతి వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం అమ్మకాలెంత, ఖజానాకు ఏటా చెల్లించిన వ్యాట్ సొమ్ము ఎంత అనే కోణంలో సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ విచారణ ప్రారంభించగానే ఏటా ఎన్ని లీటర్లు అమ్మారనే లెక్కలను పబ్లిక్ డొమైన్(పోర్టల్) నుంచి ఎక్సైజ్ శాఖ తొలగించడం గమనార్హం. ఈ వివరాల కోసం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వం మారగానే ఈ లెక్కలను అధికారులు ఎందుకు దాస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు, కొత్త సంవత్సర వేడుకలు, ఇతర పండగలు, ఉత్సవాల సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. కానీ, అదేస్థాయిలో మద్యంపై వచ్చే పన్ను ఆదాయం పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానమొచ్చి లోతుగా విచారణ ప్రారంభించింది. ఉదాహరణకు 2021-22 ఆర్థిక సంవత్సరం 2021 నవంబరులో రూ.1,007 కోట్లు, డిసెంబరులో రూ.1,536 కోట్లు మద్యంపై వ్యాట్ రూపంలో ఖజానాకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో అవే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున మద్యం అమ్మకాలు భారీగా పెరిగినా వ్యాట్ అదనంగా రాలేదు. 2023 నవంబరులో రూ.1,021 కోట్లు, డిసెంబరులో రూ.1,388 కోట్లు మాత్రమే వ్యాట్గా చెల్లించారు. ఎన్నికలున్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే వ్యాట్ ఎందుకు తగ్గిందని ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.
ఇదెలా సాధ్యం...
వ్యాట్ ఎగవేత ఉదంతాల నేపథ్యంలో మద్యం తయారు చేసే రెండు డిస్టిలరీల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణ జరపగా.. విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండింటిలోనే రూ.528.75 కోట్ల వ్యాట్ ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మద్యం తయారీలో డీ…మినరలైజ్డ్ నీటిని కలుపుతారు. ఈ నీరు ఎంత సరఫరా చేశారు, వాటితో మద్యం ఎంత తయారుచేశారనే లెక్కలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పోల్చి తనిఖీలు చేస్తే 123.82 లక్షల లీటర్ల మద్యాన్ని పన్నులు చెల్లించకుండా అక్రమంగా సరఫరా చేసినట్లు తేలింది. వాస్తవానికి ఈ అక్రమ మద్యంపై రూ.528.75 కోట్ల వ్యాట్ ఎగవేసినట్లు స్పష్టంగా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 డిస్టిలరీలున్నాయి. కేవలం రెండు డిస్టిలరీల్లోనే ఏకంగా ఒక్క ఏడాదిలోనే రూ.528.75 కోట్లు ఎగవేస్తే రాష్ట్రమంతా తనిఖీలు చేస్తే భారీగా అక్రమాలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ రెండు డిస్టిలరీల్లో ‘ఓవర్టైం రిలాక్సేషన్’(మినహాయింపు) ఇచ్చి అదనపు మద్యం తయారీకి గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్లు తేలింది. వ్యాట్ ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ఈ డిస్టిలరీలకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేశారు.
అమ్మకాలతో పొంతనే లేదు..
మద్యం ఒక్కదానిపై వ్యాట్ పేరుతో పన్ను వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని రకాల వస్తువులు, సామగ్రి, సేవలపై జీఎస్టీని వసూలు చేస్తారు. రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద ఏటా 18 శాతం వృద్ధి రేటు నమోదవుతుంటే వ్యాట్ మాత్రం ఐదారు శాతానికి ఎందుకు మించడం లేదని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తాజాగా ప్రశ్నించింది. మద్యం అమ్మకాల విలువ భారీగా పెరుగుతున్నట్లు ఎక్సైజ్శాఖ లెక్కలే చెపుతున్నాయి. కానీ, వ్యాట్ మాత్రం అదేస్థాయిలో పెరగకపోవడంతో విచారణకు ఆదేశించింది. ఉదాహరణకు 2018లో రూ.20,012 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా 2021లో రూ.30,222 కోట్లకు చేరాయి. అంటే నాలుగేళ్లలో ఏకంగా 50 శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ, ఇదే కాలంలో వ్యాట్ 50 శాతం పెరగలేదని వాణిజ్య పన్నులశాఖ తనిఖీల్లో గుర్తించారు. 2018 జులై నెలలో మద్యం అమ్మకాలపై రూ.1,200 వ్యాట్ను ఖజానాకు చెల్లించగా.. 2023 జులైలో సైతం రూ.1,260 కోట్లు మాత్రమే వసూలవడం గమనార్హం.
డిస్టిలరీ నుంచి గోదాములకు మద్యాన్ని రాష్ట్ర బేవరేజెస్ సంస్థ తరలిస్తుంది. అక్కడి నుంచి దుకాణాల వ్యాపారులు తీసుకెళతారు. డిస్టిలరీ నుంచి మద్యం బయటికి వచ్చే సమయంలోనే దాని విలువపై ఎంత వ్యాట్ చెల్లించాలనేది బిల్లుపై స్పష్టంగా రాసి పోర్టల్లో నమోదు చేయాలి. ఇలా చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం రాష్ట్ర బేవరేజెస్ సంస్థలోని అధికారులకు తెలిసే జరుగుతోందా లేక సంస్థ కళ్లుగప్పి నేతలు, వ్యాపారుల సహకారంతో జరుగుతోందా అనేది సమగ్ర విచారణలో తేలుతుందని ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు మద్యం సీసాలపై వేసే లేబుళ్లు, ఇతర సర్వీసులపై విడిగా జీఎస్టీ చెల్లించాలి. ఇందులోనూ అక్రమాలు జరుగుతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి