శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌

తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.

Published : 28 Mar 2024 03:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఝార్ఖండ్‌ మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని