టూరు.. ధరలతో బేజారు!
వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు.
వేసవిలో ఊపందుకుంటున్న పర్యాటకం
హోటళ్లు, విమాన, రైలు టికెట్లకు డిమాండ్
గతేడాది కంటే భారీగా పెరిగిన విమానయాన ఖర్చులు
- హైదరాబాద్ నుంచి లద్దాఖ్కు ఏప్రిల్ మొదటి వారంలో ప్రయాణానికి వారం ముందు ప్రయత్నిస్తే ఒకరికి రానుపోను కలిపి గతేడాది దాదాపు రూ.11 వేలకే టికెట్లు దొరికాయి. ఇప్పుడా ఖర్చు ఒకరికి కనీసం రూ.20 వేల పైమాటే. అదే మే రెండో వారంలో ప్రయాణానికి అయితే రానుపోను టికెట్ల ధర ఇప్పుడే రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే శ్రీనగర్కు రానుపోను టికెట్ల ఖర్చు ఇప్పుడే రూ.పాతిక వేలు దాటేసింది. హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా, గువాహటికి రానుపోను గతేడాది రూ.ఏడెనిమిది వేలకు దొరికితే.. ఇప్పుడా టికెట్ల ఖర్చు ఒక్కరికే 16-17 వేలవుతోంది.
- వేసవిలో గోవాకు పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గోవాలోని రెండు ఎయిర్పోర్టులు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడి రిసార్టుల్లో బుకింగ్లు గతేడాది 50 శాతంగా ఉంటే ఇప్పుడు 90 శాతం వరకు అవుతున్నట్లు అంచనా. మంచు ప్రదేశాలకు విమాన టికెట్ల ధరలు భారీగా ఉండటంతో అంత బడ్జెట్ భరించలేని పర్యాటకులు గోవా వంటి బీచ్ స్టేషన్ల బాట పడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. స్వస్థలాలకు సమీపంలో కాకుండా దూరప్రాంతాలు, అంతర్రాష్ట్ర పర్యాటకానికి ఆసక్తి చూపుతున్నారు. వారం నుంచి పర్యాటకం ఒక్కసారిగా జోరు అందుకుంది. హోటళ్లలో గదుల అద్దెలు పెరిగాయి. విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు. ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకం మరింత జోరందుకుంటుందని పర్యాటక ఆపరేటర్లు చెబుతున్నారు.
హిల్స్టేషన్లకు వెళ్లేందుకు మొగ్గు
వేసవి కావడంతో పర్యాటకులు చల్లని ప్రదేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మంచు ఉండే ప్రాంతాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో కశ్మీర్లోని శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, హిమాచల్ప్రదేశ్లోని శిమ్లా, మనాలి, సిక్కింలో గ్యాంగ్టక్, నాథులాపాస్కు అధిక డిమాండ్ ఉంది. దక్షిణాదిలో ఊటీ, కొడైకెనాల్, మున్నార్, కూర్గ్ వంటి హిల్స్టేషన్లకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. వీటికి దగ్గరలో ఉండే కోయంబత్తూర్, మదురై, కొచ్చి, బెంగళూరు విమానాశ్రయాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
అటు మంచు.. ఇటు తులిప్ అందాలు
కశ్మీర్లో ప్రధాన ఆకర్షణ గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గావ్లోని మంచుకొండలు అయితే మరో ముఖ్య ఆకర్షణ శ్రీనగర్లోని తులిప్ గార్డెన్. కశ్మీర్లో చెట్లు, మొక్కలు అధికంగా పుష్పించే కాలం ఏప్రిల్ మొదటివారం. తులిప్ ఫెస్టివల్ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. అందమైన తులిప్ పుష్పాలు నెలరోజులే కనిపిస్తాయి. దీంతో అటు మంచుకొండలు చూసేందుకు, ఇటు తులిప్ గార్డెన్ను వీక్షించేందుకు కశ్మీర్కు పర్యాటకం పోటెత్తుతోంది. మరోవైపు సాహస పర్యాటకం చేసేవాళ్లు లద్దాఖ్కు పెద్దఎత్తున వెళ్తున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల నుంచి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయి.
అప్పటికప్పుడు వెళ్తే ఇబ్బందే
వసతి, ఇతర ముందస్తు ఏర్పాట్లు లేకుండా నేరుగా పర్యాటక ప్రదేశాలకు వెళ్తే ఇబ్బందే. విమాన టికెట్ల ధరలు కశ్మీర్కు రెట్టింపు, ఇతర రూట్లకు 30-45 శాతం పెరిగాయి. రద్దీతో గోవా రిసార్టుల్లో వసతి ధరలు 20-25 శాతం పెరిగాయి. గదుల అద్దె 50 శాతం పైనే పెరిగింది. మంచు ప్రాంతాల్లో గదులు దొరకట్లేదు. నేరుగా వెళ్లినవాళ్లు వాహనాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితులున్నాయి. ఊటీ వంటి హిల్స్టేషన్లలో రద్దీ పెరిగి పెద్ద వాహనాల (10 సీట్లపైనున్నవి)ను అనుమతించట్లేదు.
సుధా చంద్రమౌళి, ది రాయల్ టూరిజం, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్