టూరు.. ధరలతో బేజారు!
వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు.
వేసవిలో ఊపందుకుంటున్న పర్యాటకం
హోటళ్లు, విమాన, రైలు టికెట్లకు డిమాండ్
గతేడాది కంటే భారీగా పెరిగిన విమానయాన ఖర్చులు
- హైదరాబాద్ నుంచి లద్దాఖ్కు ఏప్రిల్ మొదటి వారంలో ప్రయాణానికి వారం ముందు ప్రయత్నిస్తే ఒకరికి రానుపోను కలిపి గతేడాది దాదాపు రూ.11 వేలకే టికెట్లు దొరికాయి. ఇప్పుడా ఖర్చు ఒకరికి కనీసం రూ.20 వేల పైమాటే. అదే మే రెండో వారంలో ప్రయాణానికి అయితే రానుపోను టికెట్ల ధర ఇప్పుడే రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే శ్రీనగర్కు రానుపోను టికెట్ల ఖర్చు ఇప్పుడే రూ.పాతిక వేలు దాటేసింది. హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా, గువాహటికి రానుపోను గతేడాది రూ.ఏడెనిమిది వేలకు దొరికితే.. ఇప్పుడా టికెట్ల ఖర్చు ఒక్కరికే 16-17 వేలవుతోంది.
- వేసవిలో గోవాకు పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గోవాలోని రెండు ఎయిర్పోర్టులు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడి రిసార్టుల్లో బుకింగ్లు గతేడాది 50 శాతంగా ఉంటే ఇప్పుడు 90 శాతం వరకు అవుతున్నట్లు అంచనా. మంచు ప్రదేశాలకు విమాన టికెట్ల ధరలు భారీగా ఉండటంతో అంత బడ్జెట్ భరించలేని పర్యాటకులు గోవా వంటి బీచ్ స్టేషన్ల బాట పడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. స్వస్థలాలకు సమీపంలో కాకుండా దూరప్రాంతాలు, అంతర్రాష్ట్ర పర్యాటకానికి ఆసక్తి చూపుతున్నారు. వారం నుంచి పర్యాటకం ఒక్కసారిగా జోరు అందుకుంది. హోటళ్లలో గదుల అద్దెలు పెరిగాయి. విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు. ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకం మరింత జోరందుకుంటుందని పర్యాటక ఆపరేటర్లు చెబుతున్నారు.
హిల్స్టేషన్లకు వెళ్లేందుకు మొగ్గు
వేసవి కావడంతో పర్యాటకులు చల్లని ప్రదేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మంచు ఉండే ప్రాంతాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో కశ్మీర్లోని శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, హిమాచల్ప్రదేశ్లోని శిమ్లా, మనాలి, సిక్కింలో గ్యాంగ్టక్, నాథులాపాస్కు అధిక డిమాండ్ ఉంది. దక్షిణాదిలో ఊటీ, కొడైకెనాల్, మున్నార్, కూర్గ్ వంటి హిల్స్టేషన్లకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. వీటికి దగ్గరలో ఉండే కోయంబత్తూర్, మదురై, కొచ్చి, బెంగళూరు విమానాశ్రయాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
అటు మంచు.. ఇటు తులిప్ అందాలు
కశ్మీర్లో ప్రధాన ఆకర్షణ గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గావ్లోని మంచుకొండలు అయితే మరో ముఖ్య ఆకర్షణ శ్రీనగర్లోని తులిప్ గార్డెన్. కశ్మీర్లో చెట్లు, మొక్కలు అధికంగా పుష్పించే కాలం ఏప్రిల్ మొదటివారం. తులిప్ ఫెస్టివల్ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. అందమైన తులిప్ పుష్పాలు నెలరోజులే కనిపిస్తాయి. దీంతో అటు మంచుకొండలు చూసేందుకు, ఇటు తులిప్ గార్డెన్ను వీక్షించేందుకు కశ్మీర్కు పర్యాటకం పోటెత్తుతోంది. మరోవైపు సాహస పర్యాటకం చేసేవాళ్లు లద్దాఖ్కు పెద్దఎత్తున వెళ్తున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల నుంచి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయి.
అప్పటికప్పుడు వెళ్తే ఇబ్బందే
వసతి, ఇతర ముందస్తు ఏర్పాట్లు లేకుండా నేరుగా పర్యాటక ప్రదేశాలకు వెళ్తే ఇబ్బందే. విమాన టికెట్ల ధరలు కశ్మీర్కు రెట్టింపు, ఇతర రూట్లకు 30-45 శాతం పెరిగాయి. రద్దీతో గోవా రిసార్టుల్లో వసతి ధరలు 20-25 శాతం పెరిగాయి. గదుల అద్దె 50 శాతం పైనే పెరిగింది. మంచు ప్రాంతాల్లో గదులు దొరకట్లేదు. నేరుగా వెళ్లినవాళ్లు వాహనాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితులున్నాయి. ఊటీ వంటి హిల్స్టేషన్లలో రద్దీ పెరిగి పెద్ద వాహనాల (10 సీట్లపైనున్నవి)ను అనుమతించట్లేదు.
సుధా చంద్రమౌళి, ది రాయల్ టూరిజం, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.