‘సీకెంట్ పైల్’ పద్ధతికే మొగ్గు ఎందుకు?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్లో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది?
దానికి అంత వేగంగా ఎలా కార్యరూపమిచ్చారు?
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్డీఎస్ఏ అధ్యయనం
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్లో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది? సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సీకెంట్తో పాటు ఆర్.సి.సి. డయాఫ్రం ఇచ్చినా సీకెంట్ పైల్స్ కటాఫ్ వైపు ప్రాజెక్టు ఇంజినీర్లు మొగ్గు చూపడానికి కారణాలేమిటన్న అంశాలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గుత్తేదారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ, ప్రభుత్వం.. ఇలా అందరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాల నిర్ణయాలకు సంబంధించిన మినిట్్్స కావాలని నిపుణుల కమిటీ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై 2016 అక్టోబరు 22న జరిగిన సమావేశంలో తొలుత చర్చించగా, తాము సీకెంట్ పైల్ పద్ధతిని మూడు బ్యారేజీల్లో అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు 2017 ఏప్రిల్ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్.. సీడీఓ చీఫ్ ఇంజినీర్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ 2017 జనవరి 16న సంబంధిత ఇంజినీర్కు పంపిన లేఖలో.. జనవరి 9న జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఇటీవల పర్యటనలో లోతుగా చర్చించిన నిపుణుల కమిటీ, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
సంబంధిత వివరాలు
- 2016 అక్టోబరు 22న ఇంజినీర్ ఇన్ చీఫ్ (పరిపాలన) ఛైర్మన్గా హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈఎన్సీ జనరల్, సీడీఓ, కాళేశ్వరం, హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్లు, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్కు చెందిన శంభూ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. బోర్వెల్ డేటా, నేల స్వభావానికి సంబంధించిన పరీక్షలను పరిగణనలోకి తీసుకొని రాఫ్ట్, కటాఫ్ వాల్పై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.
- 2017 జనవరి 11న సీడీఓ చీఫ్ ఇంజినీర్.., కాళేశ్వరం సీఈ(రామగుండం)కి లేఖ రాశారు. సీడీఓ ప్రతిపాదించిన షీట్ పైల్స్కు మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కన్సల్టెంట్లు.. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ఈ పద్ధతి సరిపోదని చెప్పారు. ఇక మిగిలింది ఆర్.సి.సి. డయాఫ్రం కటాఫ్కు వెళ్లడం లేదా ఎల్అండ్టీ అభిప్రాయపడినట్లుగా సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతిని అనుసరించడం. నిర్మాణస్థలం వద్ద పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాలి. దీంతోపాటు ఆర్.సి.సి. కట్ ఆఫ్ డయాఫ్రం, సీకెంట్ పైల్ కటాఫ్లకు సంబంధించిన రెండు డ్రాయింగులను జత చేస్తున్నాం. సబ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత బ్లాకుల వారీగా డ్రాయింగులు ఇస్తాం. తదుపరి ఏ పద్ధతి సరైనదనే దానిపై సమగ్రంగా అధ్యయనం జరగాలి. బ్యారేజీ వెడల్పుతో పాటు గ్రౌండ్ లెవల్ వివరాలు అందజేయాలి. ఏ కటాఫ్ వాడాలనే విషయంలో ఆర్థికపరమైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే ఈ ప్రతిపాదనను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హైపవర్ కమిటీ ఎదుట ఉంచి ఆమోదం పొందాలి.
- 2017 జనవరి 28న అన్నారం బ్యారేజి ఆర్.సి.సి. డయాఫ్రం, సీకెంట్ పైల్ కటాఫ్ రెండింటికీ సీడీఓ డ్రాయింగులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి 2017 మార్చి 29న రెండు డ్రాయింగులు ఇచ్చింది.
- 2017 ఏప్రిల్ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సీడీఓ చీఫ్ ఇంజినీర్కు లేఖ రాశారు. నిర్మాణ స్థలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మూడు బ్యారేజీల్లో సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించామని, దీనికి డిజైన్లు, డ్రాయింగులు ఇవ్వాలని కోరారు.
- అయితే 2017 జనవరి 16న అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ప్రాజెక్టు ఇంజినీర్కు లేఖ రాసింది. ఇందులో జనవరి 9న నీటిపారుదలశాఖ సమావేశంలో సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొంది. దీన్ని బట్టి జనవరిలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగినట్లు స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..