‘సీకెంట్ పైల్’ పద్ధతికే మొగ్గు ఎందుకు?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్లో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది?
దానికి అంత వేగంగా ఎలా కార్యరూపమిచ్చారు?
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్డీఎస్ఏ అధ్యయనం
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్లో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది? సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సీకెంట్తో పాటు ఆర్.సి.సి. డయాఫ్రం ఇచ్చినా సీకెంట్ పైల్స్ కటాఫ్ వైపు ప్రాజెక్టు ఇంజినీర్లు మొగ్గు చూపడానికి కారణాలేమిటన్న అంశాలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గుత్తేదారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ, ప్రభుత్వం.. ఇలా అందరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాల నిర్ణయాలకు సంబంధించిన మినిట్్్స కావాలని నిపుణుల కమిటీ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై 2016 అక్టోబరు 22న జరిగిన సమావేశంలో తొలుత చర్చించగా, తాము సీకెంట్ పైల్ పద్ధతిని మూడు బ్యారేజీల్లో అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు 2017 ఏప్రిల్ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్.. సీడీఓ చీఫ్ ఇంజినీర్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ 2017 జనవరి 16న సంబంధిత ఇంజినీర్కు పంపిన లేఖలో.. జనవరి 9న జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో సీకెంట్ పైల్ కటాఫ్ వాల్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఇటీవల పర్యటనలో లోతుగా చర్చించిన నిపుణుల కమిటీ, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
సంబంధిత వివరాలు
- 2016 అక్టోబరు 22న ఇంజినీర్ ఇన్ చీఫ్ (పరిపాలన) ఛైర్మన్గా హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈఎన్సీ జనరల్, సీడీఓ, కాళేశ్వరం, హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్లు, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్కు చెందిన శంభూ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. బోర్వెల్ డేటా, నేల స్వభావానికి సంబంధించిన పరీక్షలను పరిగణనలోకి తీసుకొని రాఫ్ట్, కటాఫ్ వాల్పై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.
- 2017 జనవరి 11న సీడీఓ చీఫ్ ఇంజినీర్.., కాళేశ్వరం సీఈ(రామగుండం)కి లేఖ రాశారు. సీడీఓ ప్రతిపాదించిన షీట్ పైల్స్కు మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కన్సల్టెంట్లు.. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ఈ పద్ధతి సరిపోదని చెప్పారు. ఇక మిగిలింది ఆర్.సి.సి. డయాఫ్రం కటాఫ్కు వెళ్లడం లేదా ఎల్అండ్టీ అభిప్రాయపడినట్లుగా సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతిని అనుసరించడం. నిర్మాణస్థలం వద్ద పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాలి. దీంతోపాటు ఆర్.సి.సి. కట్ ఆఫ్ డయాఫ్రం, సీకెంట్ పైల్ కటాఫ్లకు సంబంధించిన రెండు డ్రాయింగులను జత చేస్తున్నాం. సబ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత బ్లాకుల వారీగా డ్రాయింగులు ఇస్తాం. తదుపరి ఏ పద్ధతి సరైనదనే దానిపై సమగ్రంగా అధ్యయనం జరగాలి. బ్యారేజీ వెడల్పుతో పాటు గ్రౌండ్ లెవల్ వివరాలు అందజేయాలి. ఏ కటాఫ్ వాడాలనే విషయంలో ఆర్థికపరమైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే ఈ ప్రతిపాదనను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హైపవర్ కమిటీ ఎదుట ఉంచి ఆమోదం పొందాలి.
- 2017 జనవరి 28న అన్నారం బ్యారేజి ఆర్.సి.సి. డయాఫ్రం, సీకెంట్ పైల్ కటాఫ్ రెండింటికీ సీడీఓ డ్రాయింగులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి 2017 మార్చి 29న రెండు డ్రాయింగులు ఇచ్చింది.
- 2017 ఏప్రిల్ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సీడీఓ చీఫ్ ఇంజినీర్కు లేఖ రాశారు. నిర్మాణ స్థలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మూడు బ్యారేజీల్లో సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించామని, దీనికి డిజైన్లు, డ్రాయింగులు ఇవ్వాలని కోరారు.
- అయితే 2017 జనవరి 16న అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ప్రాజెక్టు ఇంజినీర్కు లేఖ రాసింది. ఇందులో జనవరి 9న నీటిపారుదలశాఖ సమావేశంలో సీకెంట్ పైల్ కటాఫ్ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొంది. దీన్ని బట్టి జనవరిలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగినట్లు స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు