ఫోన్ ట్యాపింగ్పై పక్కాగా విచారణ
‘‘ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నారు.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్పై పక్కాగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
బాధ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు
భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా.. విన్నారు
కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘‘ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నారు.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్పై పక్కాగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాధ్యులు చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ట్యాపింగ్ చేయవద్దని ఆ రోజే తాము చెప్పినా అధికారులు వినలేదని.. దాని ఫలితాన్ని ఈ రోజు వారు అనుభవిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాల్మీకి, బోయలతో శుక్రవారం గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం. అంతకుముందు ఎవరైనా ఫోన్లో మాట్లాడుకోవాలన్నా భయం ఉండేది. గత ప్రభుత్వం.. ఓట్లేసిన ప్రజలనే భయపెట్టి, పోలీసు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరేం మాట్లాడుకున్నా వినే దుర్మార్గమైన ఆలోచన చేసింది. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా.. విన్నారు. కొద్దిమంది ఫోన్లు విన్నాం అని కేటీఆర్ ఇప్పుడు బరితెగించి మాట్లాడుతున్నారు. వింటే ఏమవుతుందని అంటున్నారు. ప్రజలు ఇళ్లల్లో మాట్లాడుకునే వాటితో మీకు అవసరం ఏంటి?. వాళ్లు చెప్పినట్లు ఆ రోజు విని ట్యాపింగ్ చేసిన అధికారులు ఈ రోజు ఊచలు లెక్కబెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయవద్దని, వారి(భారాస నేతలు) మాట వింటే మీరు జైలుకు పోతారని అప్పుడే మేం అధికారులకు చెప్పాం. వారు ఈ రోజు కేసుల్లో ఇరుక్కుంటే అయ్యో పాపం అని కూడా భారాస వాళ్లు అనడం లేదు. మేం ఇలాగే చేస్తాం అని కేటీఆర్ అంటున్నారు. గ్రామాల్లో పెద్దమనుషులు ప్రశ్నిస్తే.. మేం ఇలాగే చేస్తాం అని కొందరు అంటారు.. అలా మాట్లాడితే దాని ఫలితం దానికి ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తాం..
ఓటు విలువ తెలిసినందున నేను దిల్లీ నుంచి వచ్చి కొడంగల్ వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేశాను. ఓటు వేశాక కొడంగల్లో అందరినీ కలసి యోగక్షేమాలు తెలుసుకుని వచ్చాను. ఉమ్మడి పాలమూరులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. గడీలు బద్దలు కొట్టి ప్రజా పాలన తెచ్చాం. లేకలేక మన జిల్లా(పాలమూరు)కు చెందిన నాకు ఒక అవకాశం వచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కూడా గెలిచేవాళ్లం. కానీ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు వరకూ భారాసతో పోరాడినట్లు చేసిన భాజపా నాయకురాలు డీకే అరుణ తీరా పోలింగ్ రోజున తన బంధువైన భారాస అభ్యర్థికి ఓట్లు వేయించారు. డీకే అరుణ ఐదేళ్లుగా భాజపాలో ఉన్నా పాలమూరుకు ఏం చేశారు? భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న ఆమె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదు?. రేవంత్రెడ్డిని దెబ్బతీయాలని భాజపా, భారాస కూడబలుక్కుని కుట్రలు చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో కూడా ఇదే రాజకీయం నడుస్తోంది. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తే రేవంత్రెడ్డిని రాష్ట్రమంతా బలహీన పరచవచ్చని భారాస, భాజపాలు కిందిస్థాయిలో కుట్ర చేస్తున్నాయి. అలా కుట్ర చేసే పార్టీలో ఉన్న మిత్రులు నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పి పోతున్నారు. దేనికోసం ఓడిస్తారు ? మా నీళ్లు మాకు కావాలని కర్ణాటకతో మేం కొట్లాడుతున్నందుకు కాంగ్రెస్ను ఓడిస్తారా? ఇప్పుడు మళ్లీ భాజపా గెలిస్తే మోదీ చంద్రమండలానికి రాజు అవుతారా? గత పదేళ్లు మోదీ ఏం చేశారు? భాజపా నేతలు ఓట్ల కోసం వచ్చి పోతారు. కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుంది. అందరూ కలసి మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. ఎన్నికలైన తరవాత సీఎం కార్యాలయానికి వాల్మీకి, బోయలను పిలిపించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా. కంచె వేసి గద్వాల కోటను కాపాడింది బోయలే. మీరు మాట ఇస్తే దానిపై నిలబడతారు. పాలమూరు జిల్లాలో రెండు సీట్లు గెలిపిస్తామని బోయలు మాట ఇవ్వాలి. వారికి ప్రభుత్వంలో మంచి హోదా ఇస్తాం. కష్టపడేవారందరికీ ఏదో పదవి ఇస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే సంపత్కు ఎన్నికల తరవాత ప్రభుత్వంలో మంచి పదవి ఇస్తాం’’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, వంశీచంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం