టాస్క్ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ)లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు.. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత!
దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బహిర్గతం
చంచల్గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ)లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావును అరెస్టు చేసి విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ఫోర్స్ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. కేసుల దర్యాప్తునకే పరిమితం కాకుండా.. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా గత నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాకస్థాయికి చేరాయి. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్రావు బృందం కీలకంగా వ్యవహరించింది. పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ పోలీసుల్లో పలువురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండటంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండటంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు.
14 రోజుల జ్యుడిషియల్ రిమాండు
రాధాకిషన్రావును సుదీర్ఘంగా విచారించిన అనంతరం శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండు విధించారు. దీంతో రాధాకిషన్రావును చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. కానీ అంతకు ముందు బంజారాహిల్స్ ఠాణా నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో మాత్రం మీడియాకు అభివాదం చేస్తూ వెళ్లారు. న్యాయమూర్తి నివాసం వద్ద ఏసీపీ వెంకటగిరి మీడియాతో మాట్లాడుతూ.. రాధాకిషన్రావును పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ‘రాధాకిషన్రావు ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతోపాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది’ అని వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం.విజయ్కుమార్ తెలిపారు.
పోలీసు కస్టడీకి అదనపు ఎస్పీలు
చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. తొలిరోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు.
ప్రణీత్రావు ద్వారా ప్రత్యర్థుల కదలికలపై నిఘా
రాధాకిషన్రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీచేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీని కోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి రాధాకిషన్రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలుత అనిశాకు బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరక ముందే ఇంటెలిజెన్స్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ.. ప్రైవేటు ప్రొఫైళ్లను ప్రణీత్రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్