నిందితులకు ‘క్రొమటోగ్రఫీ’ పరీక్ష!
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
‘రాడిసన్ డ్రగ్స్’ కేసులో సైబరాబాద్ పోలీసుల నిర్ణయం
3 నెలల వరకు మాదకద్రవ్యాల ఆనవాళ్లు గుర్తించే వీలు
న్యాయస్థానం అనుమతి కోసం ప్రయత్నాలు
ఈనాడు, హైదరాబాద్: రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిందితులకు ‘క్రొమటోగ్రఫీ’ డ్రగ్ టెస్ట్ నిర్వహించే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ పరీక్ష ద్వారా నిందితులు డ్రగ్స్ తీసుకున్న మూడు నెలల వరకూ మూత్ర నమూనాల్లో ఆనవాళ్లను గుర్తించే వీలుంటుంది. ఈ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పోలీసులు ఇప్పటికే కూకట్పల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, అందుకు న్యాయస్థానం నుంచి అనుమతి లభించకపోవడంతో హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పరీక్ష నిర్వహించిన దాఖలాలు లేకపోవడంతో ఈ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్ పార్టీ జరిగినట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. హోటల్లోని 1200, 1204 గదులను తనిఖీ చేసి మూడు ఖాళీ ప్లాస్టిక్ పేపర్లతోపాటు ఒక వైట్ పేపర్ రోల్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లభించిన తెల్లటిపొడి ఆనవాళ్లను డ్రగ్ కిట్లో విశ్లేషించి కొకైన్గా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో 14 మందికి ప్రమేయముందని దర్యాప్తులో తేలింది. అప్పట్లోనే పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితుడు గజ్జెల యోగానంద్తోపాటు మరో ఇద్దరి నమూనాల పరీక్షల్లో మాదకద్రవ్యాలు సేవించినట్లు తేలింది. కానీ, సినీ దర్శకుడు క్రిష్తోపాటు లిషి, సందీప్, శ్వేత, నీల్ తదితరులు మాత్రం తొలుత విచారణకు హాజరు కాలేదు.
సమయం గడిచేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండవనే కారణంతోనే నిందితులు కాలయాపన చేశారనే ఆనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 1న క్రిష్ అనూహ్యంగా పోలీసుల ముందుకొచ్చి నమూనాలను ఇచ్చారు. మరో రెండు రోజులకే లిషి, సందీప్.. తదితర నిందితులూ హాజరై నమూనాలను ఇచ్చారు. వారి నమూనాలను విశ్లేషించడంతో నెగిటివ్ వచ్చింది. అయితే, పోలీసులు మాత్రం నిందితులు కాలయాపన చేయడంతోనే నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు చిక్కలేదని బలంగా నమ్మి ‘క్రొమటోగ్రఫీ’ పరీక్ష దిశగా కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా ఎవరైనా మాదకద్రవ్యాలు సేవించారో తెలుసుకునేందుకు డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. అందులో అనుమానిత ఆనవాళ్లు కనిపిస్తే నిందితుల మూత్ర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నివేదిక తెప్పిస్తారు. ఈ నివేదికనే అధికారికంగా న్యాయస్థానానికి సమర్పిస్తారు. అయితే, నిందితులు మాదకద్రవ్యాలు సేవించిన 72 గంటల్లోపు మూత్ర నమూనాలను విశ్లేషించినప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిపే పరీక్షలకు ఆనవాళ్లు చిక్కుతాయి. అంతకంటే ఆలస్యమయ్యేకొద్దీ ఆనవాళ్లు లభించడం కష్టమవుతుంది. రాడిసన్ హోటల్ది హైప్రొఫైల్ కేసు కావడంతో సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని క్రొమటోగ్రఫీ డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత