మత్తు దందాపై ‘సఫేమా’ అస్త్రం
మత్తు దందాలో విక్రేతల అరెస్ట్తో వదిలేయకుండా మూలాల్లోకి వెళ్లి రవాణా లింకులను తెంచే దిశగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్న్యాబ్) కార్యాచరణ అమలు చేస్తోంది.
స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై టీఎస్న్యాబ్ దృష్టి
రవాణా లింకులను తెంచేందుకు కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్: మత్తు దందాలో విక్రేతల అరెస్ట్తో వదిలేయకుండా మూలాల్లోకి వెళ్లి రవాణా లింకులను తెంచే దిశగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్న్యాబ్) కార్యాచరణ అమలు చేస్తోంది. స్మగ్లర్ల ఆస్తుల జప్తులో నిమగ్నమైంది. ఇందుకోసం ‘స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(సఫేమా)ను ప్రయోగిస్తోంది. గతేడాది మే 31న బ్యూరో ఏర్పడినప్పటి నుంచి అధికారులు సుమారు రూ.4.36 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. బ్యూరో ఏర్పడకముందు ఏదైనా ప్రాంతంలో మాదకద్రవ్యాలు దొరికినప్పుడు కేసు మాత్రమే నమోదయ్యేది. ఇతర కేసుల ఒత్తిడితో దర్యాప్తు పెద్దగా ముందుకు సాగేది కాదు. ప్రస్తుతం బ్యూరో ఆధ్వర్యంలో ఠాణాలవారీగా మాదకద్రవ్యాల కేసుల్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేసుల్లో ప్రాథమిక ఆధారాన్ని పట్టుకొని కూపీ లాగుతున్నారు.
అంతర్జాతీయ లింకులు బహిర్గతం
మాదకద్రవ్యాల కేసుల్లో ప్రమేయమున్న డ్రగ్ ఫైనాన్షియర్స్, డీలర్స్, కింగ్పిన్లను పట్టుకోవడానికి బ్యూరో ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలే పంజాగుట్ట ఠాణాలో దొరికిన స్టాన్లీ కేసే ఇందుకు ఉదాహరణ. బ్యూరో అధికారులు ఈ కేసు లోతుల్లోకి వెళ్లడంతో అంతర్జాతీయ లింకులు బహిర్గతమయ్యాయి. గోవా నుంచి దందా సాగిస్తున్న ఓక్రా లాంటి అంతర్జాతీయ స్మగ్లర్ను అరెస్ట్ చేయగలిగారు. ఎన్సీబీ, డీఆర్ఐ, కస్టమ్స్ తదితర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా బ్యూరో ఇలాంటి ఆపరేషన్లు చేపడుతోంది. అలాగే తెలంగాణలోకి దిగుమతి అవుతున్న మాదకద్రవ్యాలకు సంబంధించి ఓక్రాతోపాటు హనుమంతుబాబు, దివాకర్, స్వపన్దాస్, విశాల్, సర్ఫరాజ్లాంటి డ్రగ్ కింగ్పిన్ల పాత్రను బ్యూరో బహిర్గతం చేసింది. పారిస్, బెల్జియం నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయని గుర్తించి వాటిపై నిఘా విస్తృతం చేయడం ద్వారా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈకేసుల్లో ప్రమేయమున్న 8 మంది విదేశీయులపై చర్యల కోసం ఎఫ్ఆర్ఆర్వోకు లేఖలు రాశారు. నలుగురు విదేశీయుల్ని వారి దేశాలకు తిప్పిపంపారు.
పార్టీల్లోనే డ్రగ్ టెస్టింగ్ కిట్తో పరీక్షలు
బ్యూరో ఆవిర్భావం తర్వాత డ్రగ్స్ సరఫరాదారులనే కాకుండా వినియోగదారులను గుర్తించడం మొదలుపెట్టింది. మత్తు పార్టీలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లోకి బ్యూరో బృందాలు నేరుగా వెళ్లిపోతున్నాయి. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడం ఆరంభించాయి. ఇటీవలే ఓ రేవ్పార్టీలో 9 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా తేలింది. మరోవైపు పాత నేరగాళ్లపై నిఘా విస్తృతం చేయడం సత్ఫలితాలిస్తోంది. ఇటీవలే నానక్రాంగూడలో వెలుగుచూసిన నీతూబాయి ఉదంతం ఇందుకు ఉదాహరణ. గతంలో వివిధ కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై నిఘా ఉంచగా మరోసారి గంజాయి విక్రయిస్తూ దొరికింది. ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు ప్రతిపాదించారు.
శిక్షణ... అవగాహన
2023లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్)యాక్ట్ కేసుల్లో 2,892 మంది నిందితులను అరెస్ట్ చేసినా కేవలం 14శాతం మందికే శిక్షలు పడ్డాయి. దర్యాప్తు అధికారులకు ఎన్డీపీఎస్ చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇలా కేసులు వీగిపోతున్నాయనే ఉద్దేశంతో శిక్షణపై బ్యూరో దృష్టి సారించింది. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు 3,579 మందికి ఆఫ్లైన్లో.. 1,578 మందికి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చింది. అలాగే 150 మంది ఎక్సైజ్ ఉద్యోగులకు.. 110 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చట్టంపై అవగాహన కల్పించింది.
సమాచారమిస్తే రివార్డు
- సందీప్ శాండిల్య, డైరెక్టర్, టీఎస్న్యాబ్
మాదకద్రవ్యాల్ని అరికట్టడంలో పౌరులు భాగస్వాములు కావాలి. మాదకద్రవ్యాల రవాణా సమాచారమిస్తే రివార్డు ఇస్తాం. 100కిలోల కంటే ఎక్కువ గంజాయికి రూ.2లక్షల వరకు అందజేస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. 87126 71111 నంబర్కు కాల్చేసి సమాచారం ఇవ్వొచ్చు. లేదా tsnabho-hyd@tspolice.gov.inకు మెయిల్ పంపొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం