ఎన్టీపీసీ ఒప్పందంతో భారం!
భవిష్యత్తులో ఖరీదైన థర్మల్ విద్యుత్ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌర, జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
2,400 మెగావాట్ల ప్లాంట్ పూర్తయ్యేనాటికి యూనిట్ కరెంటు ధర రూ.9కి చేరుతుందని అంచనా
అంత ధరకు కొంటే డిస్కంలు నష్టపోతాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
విద్యుదుత్పత్తి, కొనుగోళ్లపై కొత్త విధానం తయారీకి కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: భవిష్యత్తులో ఖరీదైన థర్మల్ విద్యుత్ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌర, జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ తెలంగాణ కోసం నిర్మించ తలపెట్టిన కొత్త 2,400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల ప్లాంట్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్ల ప్లాంట్లను తెలంగాణ కోసం ఎన్టీపీసీ నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపడతామని, పీపీఏ చేసుకోవాలని ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖలు రాసింది. ఆ ప్లాంట్ పూర్తయ్యేందుకు మరో ఐదేళ్లు పడుతుంది. అందులో 85 శాతం విద్యుత్ను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వజూపుతోంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్కు రూ.5.90 చొప్పున ఎన్టీపీసీ పాత ప్లాంట్ల నుంచి కరెంటు లభిస్తోంది. కానీ కొత్త ప్లాంట్ పూర్తయ్యేసరికి యూనిట్ ధర రూ.8 నుంచి రూ.9 వరకు చేరుతుందని అంచనాలున్నాయి. మరోవైపు సంప్రదాయేతర ఇంధనం ఒక్కో యూనిట్ రూ.2 నుంచి రూ.4 లోపు లభిస్తోంది. ఎక్కువ రేటు పెట్టి ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ నుంచి కరెంటు కొంటే డిస్కంలు భారీగా నష్టపోతాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాబోయే పాతికేళ్ల పాటు కరెంటు కొంటామని కొత్త ప్లాంట్తో పీపీఏ చేసుకుంటే తెలంగాణ ప్రజలపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుందని తేల్చింది.
కొత్త విద్యుత్ విధానంపై అసెంబ్లీలో బిల్లు
ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యాలతో కొత్త విద్యుత్ విధానంపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా బిల్లుపై వివిధ రంగాల నిపుణులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ విచారణ కూడా నిర్వహించాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులతో నిరంతర కరెంటు సరఫరాకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
2032 నాటికి డిమాండు 27,059 మెగావాట్లకు
2031-32 నాటికి పెరిగే గరిష్ఠ డిమాండుకు అనుగుణంగా.. నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పనకు సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు గరిష్ఠంగా 15,623 మెగావాట్లు కాగా 2031-32 నాటికి 27,059 మెగావాట్లకు చేరుతుందని అంచనా. పదేళ్లుగా విద్యుత్ కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని ప్రభుత్వం తేల్చింది. పెద్దఎత్తున సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించి ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా ఎంచుకుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తోంది.
హిమాచల్ప్రదేశ్లో తెలంగాణ జల విద్యుత్కేంద్రం!
రాష్ట్రంలో ఉన్న మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంప్డ్ స్టోరేజీ విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. హిమాచల్ప్రదేశ్లో జల విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ జలవిద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిల్లీలో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్తో దీనికి సంబంధించి సంప్రందింపులు జరిపినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?