వ్యాట్ ఎగవేత నెలకు రూ.200 కోట్లపైనే?
విదేశాల నుంచి మద్యం దిగుమతుల పేరుతో భారీ కుంభకోణం జరిగిందా? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం తెప్పించి ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్) చెల్లించకుండానే అధిక ధరలకు అమ్మేసుకున్నారా?
విదేశీ మద్యం సరఫరాలో అక్రమాలు
బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే అవకతవకలు
ప్రభుత్వానికి నివేదించిన వాణిజ్య పన్నులశాఖ!
ఈనాడు, హైదరాబాద్: విదేశాల నుంచి మద్యం దిగుమతుల పేరుతో భారీ కుంభకోణం జరిగిందా? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం తెప్పించి ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్) చెల్లించకుండానే అధిక ధరలకు అమ్మేసుకున్నారా? తనిఖీల అనంతరం వాణిజ్య పన్నులశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బట్టిచూస్తూ ఆ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కొందరు నాయకులు, ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీఎల్) నుంచే ఈ అవినీతి తంతును సాగించారని వాణిజ్య పన్నులశాఖ ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ అక్రమాల వల్ల మద్యం సీసాల ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా నిర్ణయించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకున్నారని, ప్రాథమిక అంచనాల మేరకు నెలకు రూ.200 కోట్ల వ్యాట్ ఎగవేతలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొందని తెలిసింది. ఇప్పటికైనా బీసీఎల్ నుంచి దుకాణాలకు సరఫరా అవుతున్న ప్రతి మద్యం సీసా ధర ఎంత, ఎక్సైజ్ సుంకం ఎంత, మొత్తం విలువపై చెల్లించే వ్యాట్ ఎంత అనేది ముద్రించకపోతే ఈ అవినీతి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఈ శాఖ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచారం.
వాస్తవంగా జరగాల్సింది ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యాపారి, ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థ విదేశీ మద్యం దిగుమతి చేసుకున్న పక్షంలో అది నేరుగా తొలుత బీసీఎల్ గోదాములకు రావాలి. మద్యం సీసాల ధరలను బీసీఎల్ నిర్ధారించిన తరవాత దానిపై ఎక్సైజ్ సుంకాన్ని కలిపి మొత్తం ధరను సీసీపై నమోదుచేయాలి. ఆ ధరపై మరో 70 శాతం సొమ్మును వ్యాట్ కింద వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు బీసీఎల్ జమచేయాలి. ఆ ప్రకారం ఒక మద్యం దుకాణదారు తనకు విదేశీ మద్యం ఎంత కావాలో వివరిస్తూ తొలుత బీసీఎల్కు ఆర్డర్ ఇచ్చి, దాని విలువ సొమ్మును డిమాండు డ్రాఫ్ట్(డీడీ) లేదా చలానా రూపంలో బీసీఎల్కు చెల్లించాలి. ఆ సొమ్ములో సదరు వ్యాపారి అడిగిన మద్యం విలువను లెక్కగట్టి ..అందులోనే ఎక్సైజ్ సుంకం, వ్యాట్ మినహాయించుకుని మిగిలిన డబ్బుకు మాత్రమే మద్యం సీసాలను బీసీఎల్ దుకాణదారుకు పంపాలి.
లక్ష్యం నెరవేరలేదు...
మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023-24)తో రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్ సుంకం కింద రూ.19,884 కోట్ల రాబడి సమకూరుతుందని బడ్జెట్లో అంచనా వేయగా, తొలి 11 నెలల్లో (గత ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి) అందులో 95.19 శాతం(రూ.18,927.79 కోట్లు) వచ్చింది. వ్యాట్ కింద రూ.39,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా, ఇదే 11 నెలల్లో కేవలం 69.54 శాతం(రూ.27,467.35 కోట్లు) మాత్రమే వచ్చినట్లు కాగ్ ఆడిట్లో తేలడం మోసాలకు మరో నిదర్శనమని, లోతుగా విచారణ జరిపితే మరిన్ని మోసాలు వెలుగుచూడటంతోపాటు లోపాలను సరిదిద్దితే భవిష్యత్తులో ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం భారీగా పెరుగుతుందని ఈ శాఖ వివరించింది.
మోసాలు జరిగింది ఇలా..
విదేశీ మద్యం సీసాపై ఎక్సైజ్ సుంకం మాత్రం వసూలు చేసుకుంటున్న ఎక్సైజ్ శాఖ వ్యాట్కు వసూలును పట్టించుకోలేదు. బీసీఎల్ కూడా సంబంధిత లెక్కలు చెప్పలేదని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. సంబంధిత బిల్లులనూ నివేదికకు జతచేసింది. అందులో ఓ బిల్లును ‘ఈనాడు’ సేకరించింది. ఆ ప్రకారం.. ‘సెక్స్టన్ సింగిల్ మాల్ట్ ఐరిష్ విస్కీ’ అనే బ్రాండు పేరు గల 700 మిల్లీలీటర్ల విదేశీ మద్యం సీసా ధర రూ.8,183.50గా బీసీఎల్ డిపో ఇచ్చిన బిల్లులో రాశారు. ఈ బ్రాండు సీసాలు ఆరు ఇచ్చామని, మొత్తం రూ.49,101 అయినట్లు బిల్లులో నమోదు చేశారు. దీనిపై ఎక్సైజ్ సుంకం వసూలుచేసిన బీసీఎల్, అదనంగా చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్ను వదిలేయడం గమనార్హం. ‘ఇది వసూలుచేశారా, చేస్తే ప్రభుత్వానికి జమచేస్తారా లేదా అనే వివరాలూ ఎక్కడా లేవు. ఒక దుకాణానికి విదేశీ మద్యం తీసుకెళుతున్న వాహనాన్ని ఇటీవల తనిఖీ చేయగా, ఆ సరకుకు వ్యాట్ వసూలుచేయలేదని తేలింది’ అని వాణిజ్య పన్నులశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ‘అలాగే నగర శివారు పేట్బషీరాబాద్లోని ఒక దుకాణానికి విదేశీ, స్వదేశీ మద్యం కావాలంటూ వ్యాపారి రూ.6 లక్షలు డీడీ రూపంలో చెల్లించారు. ఈ సొమ్ములో రూ.29,040 ఎక్సైజ్ సుంకం కింద మినహాయించుకుని మిగిలిన సొమ్ముకు 18 రకాల మద్యం సీసాలను బీసీఎల్ మేడ్చల్ డిపో నుంచి సరఫరా చేశారు. వ్యాపారికిచ్చిన బిల్లులో అతను ఎంత సొమ్ము చెల్లించారు, మద్యం సీసాల ధర ఎంత, దానిపై ఎక్సైజ్ సుంకం ఎంత అనే వివరాలు మాత్రమే ఉన్నాయి. 70 శాతం వ్యాట్ వసూలు చేశారా లేదా అనేది నమోదు చేయలేదని’ ఆ శాఖ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. అలా మద్యం సీసాల ధర, ఎక్సైజ్ సుంకం మాత్రమే తీసుకుంటూ వ్యాట్ను పట్టించుకోకుండా వదిలేస్తున్నందున ఖజానాకు నెలకు రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు వాణిజ్య పన్నులశాఖ ఆధారాలతో నివేదించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల