అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేశారు?
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అంచనాలో అదనపు టీఎంసీ పనికి ఆస్కారం లేదు.
ఏ అధికారం కింద అలా వ్యవహరించారు?
‘మేడిగడ్డ’పై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం
రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు
ఈనాడు, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అంచనాలో అదనపు టీఎంసీ పనికి ఆస్కారం లేదు. అదనపు టీఎంసీ సివిల్ పనులకు మాత్రం అంచనాలు తయారు చేశాం’ అని ప్రాజెక్టు మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చెప్పారు. ఏ అధికారం కింద అలా సిఫార్సు చేశారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా, ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనని, రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది. ఒకవైపు సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి ఇంకోవైపు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇమ్మని ఎలా సిఫార్సు చేశారని ప్రశ్నించగా, ఎస్ఈ నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీకి పంపానని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కింది ఇంజినీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని, అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.. ఈ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లును రెండు రోజుల క్రితం విచారించగా, మిగిలిన ఇంజినీర్లను కూడా త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లుకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభంతో పని పూర్తయినట్లు భావిస్తున్నారా అని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా.. లేదని ఈఎన్సీ సమాధానమిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారం కూడా అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న ఆయనను మళ్లీ విచారణకు రావాలని పిలిచినట్లు తెలిసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం విజిలెన్స్ అధికారుల ప్రశ్నలు, ఈఎన్సీ జవాబుల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
విజిలెన్స్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీ నోట్స్ ఏమైనా ఇచ్చారా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: తనిఖీ చేశా. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత ఇస్తా.
విజిలెన్స్: మీ విజ్ఞప్తి మేరకే సీడీవో చీఫ్ ఇంజినీర్ పియర్స్ డ్రాయింగ్స్ సవరించారు. ఆర్సీసీ ఎం25-40 ఎం.ఎస్.ఎ.కు బదులుగా ఎం25-20 ఎం.ఎస్.ఎ.గా మార్చారు. ఈ మార్పును పియర్స్ పని ప్రారంభించక ముందే హైపవర్ కమిటీ ర్యాటిఫికేషన్ తీసుకోవాలని సీడీవో సూచించింది కదా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ప్రస్తుతం ఆ వివరాలు గుర్తులేవు. తర్వాత అందజేస్తా.
విజిలెన్స్: పనిలో సౌలభ్యం కోసం సీకెంట్ పైల్స్ పద్ధతి అనుమతించాలని గుత్తేదారు కోరారు. ఈ ప్రతిపాదనను సీడీవో చీఫ్ ఇంజినీర్కు పంపే ముందు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: చేశాం. ఆర్థిక భారంపై కూడా విశ్లేషించాం. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తా.
విజిలెన్స్: నాటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినపుడు ఆదేశించారని బ్యారేజీ ఎగువన, దిగువన సీసీ బ్లాకుల సైజులో మార్పు చేశారు. కొత్త సైజు సీసీ బ్లాకులకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్ స్టడీస్/టెక్నికల్ స్టడీస్ చేశారా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ఇందుకోసం ఎలాంటి మోడల్ స్టడీస్ చేయలేదు.
విజిలెన్స్: ఆమోదించిన డ్రాయింగులకు అనేక సార్లు సవరణలు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు చేసే ముందు కొన్నింటికి ఆర్థికంగా అధ్యయనం, కొన్నింటికి మోడల్ స్టడీస్ అవసరం. కానీ ఇలాంటివేమీ లేకుండా సిఫార్సు చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమైంది కదా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: ఆమోదించిన ప్రతి డ్రాయింగు సవరణకు మోడల్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదు.
విజిలెన్స్: 2020 ఫిబ్రవరి 20న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని రూ.3,260 కోట్ల నుంచి రూ.4,613 కోట్లకు పెంచి సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం 2021 సెప్టెంబరు 6న సవరించిన అంచనాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 29న ప్రారంభమైందన్నారు. సవరించిన అంచనాకు సిఫార్సు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని ఎలా చెప్పారు?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందన్నారు. దాన్నే నేను రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీకి నివేదించా. 2019 సెప్టెంబరు 9న చాలా వరకు పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్కొన్న దానిపై ఎస్ఈ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికేట్పై నాకు అవగాహన లేదు. 2021 మార్చి 15న పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్కొన్న దానిపై ఎస్ఈ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికెట్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ మా కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగిన తర్వాతనే ఈ సమాచారం తెలిసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జారీ చేసింది పని పూర్తయినట్లుగా ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. అనుభవానికి సంబంధించినది మాత్రమే.
విజిలెన్స్: పని పూర్తి కాకుండానే బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయాలని ఎలా సిఫార్సు చేశారు?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: సూపరింటెండెంట్ ఇంజినీర్ సిఫార్సు మేరకే స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టా.
విజిలెన్స్: త్రీడీ మోడల్ స్టడీస్ ప్రకారం బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం ప్రారంభించే ముందు 88 మీటర్ల మట్టం వరకు ఏమీ అడ్డంకులు లేకుండా అంతా ఒక లెవల్లో ఉండేలా చూడాలి కదా?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: నీటిని నిల్వ చేయమని రాతపూర్వకంగా నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
విజిలెన్స్: బ్యారేజీ ప్రారంభించిన తర్వాత కాఫర్ డ్యామ్స్, డీవాటరింగ్, అదనపు లీడ్కు సంబంధించి ఒప్పందంలోని నిబంధనలకు సవరణలు ప్రతిపాదించారు. 2017 ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు చేస్తే.. 2018 ఏప్రిల్లో పంపిన రివైజ్డ్ ఎస్టిమేట్-1లో కాకుండా బ్యారేజీ ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్-2లో ఎందుకు పంపారు?
ఈఎన్సీ వెంకటేశ్వర్లు: నాటి ముఖ్యమంత్రి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొన్నది వాస్తవం.ఈ ఆదేశాలు మొదటి రివైజ్డ్ ఎస్టిమేట్కు ముందే ఇచ్చినా అప్పుడు కాకుండా రివైజ్డ్ ఎస్టిమేట్-2లో పంపడానికి కారణాలు తెలపడానికి సమయం కావాలి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీర్తో చర్చించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం