ప్రభాకర్రావు చుట్టూనే..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
భారాస అసమ్మతివర్గీయులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకే ‘స్పెషల్ ఆపరేషన్స్ టీం’ ఏర్పాటు
ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందినవారి డబ్బు పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది
రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు అధికార పార్టీలోని అసమ్మతివర్గీయులపై నిఘా పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు.. దీనికి ‘స్పెషల్ ఆపరేషన్స్ టీం’ అని పేరు పెట్టినట్లు రాధాకిషన్రావు విచారణలో వెల్లడైంది. సామాజికవర్గం ప్రాతిపదికన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావుకు ఏరికోరి దీని బాధ్యతలు అప్పగించినట్లు బహిర్గతమైంది. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును పట్టుకున్నట్లు కూడా తేలింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్రావు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత గురువారం అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఎస్ఐబీ విధానాలకు విరుద్ధంగా ప్రత్యేక బృందం..
2014లో భారాస(అప్పటి తెరాస) తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికవర్గ సమీకరణాల మేరకు 2016లో ప్రభాకర్రావును నిఘా విభాగానికి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయన తన సామాజికవర్గానికే చెందిన వారితోపాటు గతంలో తనతో కలిసి పనిచేసిన వారిలో కొందర్ని నిఘా విభాగంలోని వేర్వేరు ఉప విభాగాల్లో నియమించారు. వీరిలో నల్గొండ జిల్లా నుంచి ప్రణీత్రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్రావు, హైదరాబాద్ కమిషనరేట్ నుంచి తిరుపతన్న తదితరులు ఉన్నారు. వీరందరితో ‘స్పెషల్ ఆపరేషన్స్ టీం’ ఏర్పాటు చేశారు. దీని నాయకత్వ బాధ్యతను ప్రణీత్రావుకు అప్పజెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, సొంత పార్టీలోని తిరుగుబాటుదారులపై నిఘా పెట్టడమే ఈ బృందం ఏర్పాటు ఉద్దేశం. ఎస్ఐబీ విధానాలకు ఇది పూర్తిగా విరుద్ధం.
రాధాకిషన్రావు సూచనతో ఎస్ఐబీలోకి గట్టుమల్లు
సామాజిక సమీకరణాలతోపాటు ప్రభాకర్రావు సూచనల ప్రకారం హైదరాబాద్ నగరంపై రాజకీయంగా, ఇతరత్రా పట్టు నిలుపుకొనేందుకు భారాస అధినాయకత్వం 2017లో తనను టాస్క్ఫోర్స్ డీసీపీగా నియమించిందని రాధాకిషన్రావు విచారణలో అంగీకరించారు. ఆ తర్వాత తన సూచన మేరకు గట్టుమల్లును పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ సీఐగా ప్రభుత్వం నియమించిందన్నారు. అక్కడ రెండేళ్లపాటు అంటే 2021 వరకూ పనిచేశాక.. తమ ఉమ్మడి లక్ష్యసాధన(భారాస పాలన కొనసాగేలా చూడటం)లో భాగంగా తన సూచన మేరకు గట్టుమల్లును ప్రభాకర్రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారని రాధాకిషన్రావు వెల్లడించారు. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో భారాస(అప్పటి తెరాస)ను బలోపేతం చేయడంతోపాటు అదే పార్టీ పాలన కొనసాగేలా చూసేందుకు ప్రభాకర్రావు, భుజంగరావు, వేణుగోపాల్రావు, ప్రణీత్రావులు తరచూ సమావేశమవుతుండేవారు. తమ రహస్య, అనధికారిక కార్యకలాపాలు బయటకు పొక్కకుండా వాట్సప్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో భారాసను ఎలాగైనా మళ్లీ అధికారంలోకి తేవడంతోపాటు పార్టీపై అధినేతకు పూర్తి అజమాయీషీ ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ప్రభాకర్రావు బృందం భావించిందని, దీనిలో భాగంగా ప్రతిపక్షాల నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారులు, భారాస అసమ్మతి వర్గీయులతోపాటు అదే పార్టీలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెట్టిందని రాధాకిషన్రావు విచారణలో వెల్లడించారు.
రాజకీయ పలుకుబడితో రెండుసార్లు ఓఎస్డీగా..
రాధాకిషన్రావుకు సంబంధించిన కొన్ని కీలకాంశాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2020 ఆగస్టులో టాస్క్ఫోర్స్ డీసీపీగా ఆయన పదవీ విరమణ చేశారు. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గ సమీకరణాలు ఉపయోగించి, అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి మూడేళ్లపాటు ఓఎస్డీగా నియమితులయ్యారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ అధినేతగా కొనసాగారు. 2023 ఆగస్టు నాటికి మూడేళ్లు పూర్తి కాగా.. మరో మూడేళ్లపాటు ఇదే హోదాలో పనిచేసేందుకు ఇంకోసారి అనుమతి తెచ్చుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో తమ పట్టు కొనసాగించాలంటే రాధాకిషన్రావు అవసరం ఉందని అప్పటి రాజకీయ పెద్దలతోపాటు ప్రభాకర్రావు కూడా భావించారు.
ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం
టాస్క్ఫోర్స్లో పనిచేసినప్పుడు ప్రభాకర్రావు ఆదేశాలు, ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్రావు డబ్బు స్వాధీనం వంటి కేసులు పట్టుకున్నారు. వాస్తవానికి టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు.
- ప్రభాకర్రావు సూచనల మేరకు 2018 ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్రావుకు ప్రణీత్రావు చేరవేశారు. దీని ఆధారంగా రాధాకిషన్రావు ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ సిబ్బంది హైదరాబాద్లోని రామ్గోపాల్పేట ఠాణా పరిధిలో ప్యారడైజ్ హోటల్ వద్ద శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన భవ్య సిమెంట్స్ సంస్థ అధినేత ఆనంద్ప్రసాద్కు చెందిన రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
- 2020లో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్రావు బృందం సాంకేతిక నిఘా (టెక్నికల్ సర్వేలైన్స్) కార్యకలాపాలు నిర్వహించింది. ఈ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్రావు ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ పోలీసులు.. భాజపా అభ్యర్థి రఘునందన్రావు బంధువులకు సంబంధించి సిద్దిపేటలోని ఒక చిట్ఫండ్ కంపెనీకి చెందిన కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
- 2022 మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు సాంకేతిక నిఘా నిర్వహించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నాటి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనుచరులైన గుంట సాయికుమార్రెడ్డి, కుండె మహేశ్, డి.సందీప్కుమార్, ఎం.మహేందర్, ఎ.అనూష్రెడ్డి, వెన్నం భరత్ల నుంచి రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకుని.. గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్