గత ఆరు నెలల్లో 57.6% లోటు వర్షపాతం
రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
డెడ్స్టోరేజీకి చేరిన ప్రధాన జలాశయాలు
గత మార్చితో పోలిస్తే 2.5 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జల మట్టం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేని పరిస్థితి (డెడ్ స్టోరేజి)కి చేరాయి. భూగర్భ జలమట్టాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో పడిపోయాయి. దీంతో సాగునీటి కోసం రైతులు కొత్త బోర్లు వేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.
ప్రభావం చూపిన ‘డ్రైస్పెల్’
2023 అక్టోబరు నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 139.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మి.మీటర్ల వర్షపాతమే పడింది. దీంతో ఈ ఆరు నెలల కాలంలో 57.6 శాతం లోటు ఏర్పడింది. ఇది వివిధ రకాల వనరులపై ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో భూగర్భ జల మట్టం 2.5 మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే వర్షాలు కురిసినట్లుగానే కనిపిస్తున్నా.. 2023 జూన్ నుంచి సెప్టెంబరు వరకు మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యాయి. అప్పట్లో ఎల్నినో ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఒక్క జులైలోనే కొన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రే భారీ వరదలు వచ్చాయి. అనంతరం అక్టోబరు నుంచి మార్చి వరకు వర్షాల జాడలేకుండా పోయింది. వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్) భారీగా నమోదైంది. ఈ ప్రభావం జలాశయాలపై పడింది. కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో ప్రధాన జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
నాగార్జునసాగర్ కింద ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది 35 టీఎంసీలు మాత్రమే కాగా.. వానాకాలంలో పంట కాలువలకు 27 టీఎంసీలు విడుదల చేశారు.
యాసంగిలో సాగర్ ఆయకట్టు కింద 6 లక్షల ఎకరాల్లో పంట సాగుకు 50 టీఎంసీలు అవసరం కాగా జలాశయంలో మిగిలిన 8 టీఎంసీలు ఎటూ చాలని పరిస్థితి ఏర్పడింది. సాగర్లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 513.40 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. శ్రీశైలం జలాయశం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 810.10 అడుగుల వద్ద ఉంది. కృష్ణా పరీవాహకంలో ఈ ఏడాది (2023 జూన్ నుంచి) ఇప్పటివరకు జూరాల జలాశయానికి ఎగువ నుంచి 154.05 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. 2021లో 1306.25 టీఎంసీలు, 2022లో 885.85 టీఎంసీలు, 2023లో 1229.98 టీఎంసీలు వచ్చాయి.
- గోదావరి పరీవాహకంలో ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన సగటు ఇన్ఫ్లో 205.75 టీఎంసీలు. 2021లో 367.05 టీఎంసీలు, 2022లో 677.94 టీఎంసీలు, 2023లో 590.16 టీఎంసీలు ఎగువ నుంచి వచ్చాయి.
- హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి జలాశయాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 39.78 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం వీటిలో 25.38 టీఎంసీలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 29.71 టీఎంసీలు ఉన్నాయి.
- 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు ప్రధాన జలాశయాల మట్టాలను పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం