కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్టు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు.
భూ ఆక్రమణపై గత నెలలో కేసు నమోదు
14 రోజుల రిమాండ్
ఈనాడు, హైదరాబాద్- ఆదిభట్ల, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు మన్నెగూడలో భూ ఆక్రమణ, హత్యాయత్నం కేసులో మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మార్చి 3న ఈ కేసు నమోదు కాగా అప్పటి నుంచి కన్నారావు పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో బాలాపూర్లో ఆయన ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నామని, అనంతరం ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించామని ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్రెడ్డి మీడియాకు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడలోని సర్వే నంబరు 32/ఆర్యూయూలో జక్కిడి సురేందర్రెడ్డికి 2.10 ఎకరాల భూమి ఉంది. ఆయన 2013లో చామ సురేశ్ అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు తీసుకుని అతని పేరిట జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేసి, డబ్బు తిరిగిచ్చినప్పుడు భూమి తనకు అప్పగించాలని ఒప్పందపత్రం రాసుకున్నారు. 2020 వరకూ డబ్బు చెల్లించకపోవడంతో సురేశ్ సదరు భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని ఓఎస్ఆర్ అనే సంస్థకు విక్రయించారు. దీంతో కక్ష పెంచుకున్న సురేందర్రెడ్డి తన ప్రమేయం లేకుండా భూమి ఎలా కొనుగోలు చేస్తారంటూ సంస్థ నిర్వాహకులతో తరచూ ఘర్షణకు దిగేవారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన సోదరులు, ఇతర అనుచరులతో కలిసి భూమిలోకి బలవంతంగా ప్రవేశించి బెదిరింపులకు దిగారు. దీనిపై ఓఎస్ఆర్ సంస్థ ఫిర్యాదుతో ఆదిభట్ల ఠాణాలో కేసు నమోదైంది. తరువాత కూడా తీరు మార్చుకోని సురేందర్రెడ్డి, ఆయన సోదరులు భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేశారు.
రూ.3 కోట్ల డీల్!
తెలిసిన వ్యక్తుల ద్వారా కల్వకుంట్ల కన్నారావును సంప్రదించారు. భూమి తమకు దక్కేలా చేస్తే రూ.3 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా మార్చి 3వ తేదీ తెల్లవారుజామున కన్నారావు, సురేందర్రెడ్డి, హరినాథ్, సురేశ్, డేనియల్ సహా దాదాపు 20 మంది ఆయుధాలతో ఓఎస్ఆర్ సంస్థ భూమిలోకి ప్రవేశించారు. ప్రహరీని కూల్చేసి అక్కడ పనిచేసే సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కంటెయినర్, గుడిసెను దహనం చేసి భయానక పరిస్థితులు సృష్టించారు. సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జేసీబీ డ్రైవరు సహా మరో ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనలో మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కన్నారావు సహా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించారు. కన్నారావు రెండుసార్లు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టుకు వెళతాం: కన్నారావు
రిమాండుకు తరలించే సమయంలో ఆదిభట్ల ఠాణాలో కన్నారావు విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయస్థానం ముందస్తు బెయిల్ను తిరస్కరించడంతో తానే ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి లొంగిపోయానని, ఈ కేసుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?