కూడబలుక్కునే ‘ట్యాపింగ్’ కుట్ర
ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు.
చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపకల్పన
ఆధారాలు మాయం చేశారు
భుజంగరావు, తిరుపతన్నల రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు. తర్వాత ఆధారాలు మాయం చేయడంతో పాటు హార్డ్డిస్కుల వంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, అందుకే నిందితులను అరెస్టు చేశామని విన్నవించారు. ఫోన్ట్యాపింగ్ కేసులో గత నెల 23న భుజంగరావు, తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మర్నాడు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. దీనికి సంబంధించిన రిమాండు రిపోర్టు ‘ఈనాడు’ చేతికి చిక్కింది. ప్రణీత్రావుతో కలిసి వీరిద్దరూ ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టినట్లు అంగీకరించారని అందులో పేర్కొన్నారు.
నదిలో.. కార్యాలయంలో ఆధారాలు
గత ఏడాది డిసెంబరు 4న నాగోల్లోని మూసీ వంతెన వద్ద హార్డ్డిస్కులను నదిలో వేసినట్లు ఈ కేసులో తొలుత అరెస్టయిన ప్రణీత్రావు మార్చి 21న అంగీకరించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన చోట వెతికి పదుల సంఖ్యలో ధ్వంసమైన హార్డ్డిస్క్లు(కొన్ని యంత్రంతో కత్తిరించి ఉన్నాయి) నీటి అడుగు నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మార్చి 22న ప్రణీత్రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కార్యాలయానికి తీసుకెళ్లామని అక్కడ 12 ఆల్ఇన్వన్ సిస్టమ్స్, ఏడు సీపీయూలు, ఒక ల్యాప్టాప్, ఒక మానిటర్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. హార్డ్డిస్కులను కత్తిరించినప్పుడు తెల్లటి అల్యూమినియం పొడి పడిందని దాన్ని ఎలక్ట్రీషియన్ గదిలో గుర్తించి సేకరించినట్లు వివరించారు. ఎస్ఐబీ కార్యాలయం వెనక కొన్ని దస్త్రాలు దహనం చేసినట్లు ఆయన చెప్పగా అక్కడ కాలిపోగా మిగిలిన స్పైరల్ బైండింగ్ పుస్తకం, కొన్ని ధ్రువపత్రాలతోపాటు సీసీ టీవీ దృశ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పొందుపరిచారు. ఎస్ఐబీలో పనిచేస్తున్న కొత్త నరేష్గౌడ్ అనే ఉద్యోగిని విచారించినప్పుడు తోటి సిబ్బందితో కలిసి ఎన్నికలప్పుడు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల డబ్బు రవాణాపై నిఘా పెట్టి దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునేలా చూశామని అంగీకరించినట్లు రిమాండు రిపోర్టులో తెలిపారు.
ముగిసిన నిందితుల కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల ఐదు రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. దాంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ట్యాపింగ్ కేసులో గత నెల 23న వీరిద్దర్నీ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం అనుమతితో 5 రోజుల విచారణకు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్లో వీరి పాత్రపై ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావు కీలకపాత్ర పోషించగా, డబ్బు తరలింపులో తిరుపతన్న ప్రమేయం ఉందని.. ఇదే విషయాన్ని వీరిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో ప్రధానంగా ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు అన్న వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు డబ్బు చేరవేతలోనూ వీరు చురుగ్గా పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడి కాగా ఆ నగదు ఎక్కడ నుంచి తెచ్చారు? ఎలా సరఫరా చేశారు? ఎవరికి ముట్టజెప్పారు? ఇందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న కోణంలోనూ విచారించినట్లు తెలుస్తోంది. వీరి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.