ఎన్నికల ప్రసంగాలు ఇవ్వడానికి.. కోర్టులు రాజకీయ వేదికలు కావు
విచారణ సందర్భంగా ఎన్నికల ప్రసంగాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని, ముడుపులు చేతులు మారాయని మీకెలా తెలిసిందని పిటిషనర్లను ప్రశ్నించింది.
కాళేశ్వరం నిర్మాణంలో ముడుపులు చేతులు మారాయని ఎలా తెలుసు
ఇందులో మీ పరిశోధన ఏమిటి?
పిటిషనర్లు, న్యాయవాదులపై హైకోర్టు ప్రశ్నల వర్షం
ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా? ప్రచార వ్యాజ్యాలా అంటూ నిలదీత
సీబీఐ దర్యాప్తుపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: విచారణ సందర్భంగా ఎన్నికల ప్రసంగాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని, ముడుపులు చేతులు మారాయని మీకెలా తెలిసిందని పిటిషనర్లను ప్రశ్నించింది. 2016లో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? అవినీతి జరిగిందని గతంలో ఎవరికైనా ఫిర్యాదు చేశారా? అంటూ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించామని ప్రభుత్వం పేర్కొంటున్నా.. దీనికి సంబంధించి తాము గతంలో ఉత్తర్వులు ఇచ్చామని చెబుతున్నా పట్టించుకోరా? అని నిలదీసింది. మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దాఖలైనవి ప్రజాప్రయోజన వ్యాజ్యాలో, ప్రచార వ్యాజ్యాలో చెప్పాలంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్, బి.రామ్మోహన్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కె.ఎ.పాల్ వాదనలు వినిపిస్తూ రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలు సేకరించానని పేర్కొన్నారు.
ఈ దశలోనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశిస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని, సదరు ఉత్తర్వులతో ఏకీభవిస్తారా లేకుంటే ప్రచార కాంక్షతో వాదనలు కొనసాగిస్తారా అని ప్రశ్నించింది. పాల్ వాదనలు కొనసాగిస్తుండటంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘ఈ రోజే దీన్ని తేల్చేయాలా, మీ పిటిషన్లను అనుమతించి తప్పు చేసినవారిని జైలుకు పంపాలా, ఇది మీ ఎన్నికల ఎజెండానా’ అంటూ మండిపడింది. కోర్టు విచారణకు ఓ విధానం ఉంటుందని, ప్రభుత్వ వాదన వినాల్సి ఉందని, ఈ అంశం మీకు అర్థం కాకపోతే అమికస్ క్యూరీగా మరొకరిని నియమిస్తామంది. ‘‘అవినీతి జరిగిందని ఎలా తెలిసింది. ఆ విషయాన్ని పిటిషన్లో ఎక్కడ పేర్కొన్నారు. మీడియా కథనాలు అని చెబుతున్నారు. అవి కాకుండా మీరు చేసిన పరిశోధనలేంటి. ముడుపులు చేతులు మారాయనడానికి ఆధారాలేమిటి. ప్రాజెక్టు నాలుగు పియర్స్కు మరమ్మతు చేయించాలంటున్నారు. ఇప్పుడు మేము వెళ్లి పనులు చేయించాలా. అందరం వెళ్లి ప్రాజెక్టుకు అడ్డుగా నిలబడదామా’’ అంటూ వ్యాఖ్యానించింది. సీజనల్గా పిటిషన్లు వేసే మీరు ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. హైకోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్ను సవరించి దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
పిల్ వేయడం వరకే మీ పని
ఇతరుల వాటితో తమ పిటిషన్ను జతచేయవద్దని బక్క జడ్సన్ తరఫు న్యాయవాది ఎస్.శరత్ కోరారు. పాల్ వేసిన పిటిషన్తో మిగిలిన వాటిని కలపడం సరికాదని, దాన్ని విడిగా విచారించాలని విన్నవించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘‘ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి తరఫు న్యాయవాది గడువు కోరుతున్నారు. మీరేమో ఇప్పుడే విచారించాలంటున్నారు. ఇలా విడివిడిగా విచారించలేం. ఒకవేళ అదే మీ అభ్యర్థన అయితే తిరస్కరిస్తూ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేస్తున్నామని’’ తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సమస్యను కోర్టు దృష్టికి తీసుకురావడం వరకే మీ బాధ్యత అని, మిగిలిన అంశాలు కోర్టు చూసుకుంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని, అదే చట్టమని తేల్చి చెప్పింది. ‘‘పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు స్వీకరించింది. ఇకపై మీకు పిటిషన్లతో సంబంధం లేదు. ఇందులో మీరు హాజరుకావాల్సిన అవసరం లేదు. అది మా పిటిషన్ అనడానికి ఇదేం సర్వీసు వివాదమూ కాదు’’ అని న్యాయవాదులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
విశ్వనాథరెడ్డి తరఫు న్యాయవాది జి.నందిత వాదనలు వినిపిస్తూ.. తాము ఎన్నికలకు ముందే గత నవంబరులో పిటిషన్ దాఖలు చేశామని, నంబరు కేటాయించడంలో జాప్యం జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం అసహనం వ్యక్తంచేస్తూ రాజకీయ ప్రయోజనాలతో పిటిషన్ దాఖలు చేశారా? అంటూ ప్రశ్నించింది. పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చినపుడు న్యాయవాదిగా మీరెందుకు హాజరుకాలేదని నిలదీసింది. ప్రభుత్వ వాదన వినకుండా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లపై విడివిడిగా విచారించలేమని స్పష్టంచేసింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ‘‘పిటిషనర్ల ఆత్రుత ఎలా ఉందో గమనిస్తున్నారా’’ అంటూ ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెప్పాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్