కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం
తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు.
బిడ్డ జైలుకు వెళ్లాక ఆయనకు ప్రజలు గుర్తుకొచ్చారు..
వేల పుస్తకాలు చదివినా వానాకాలం ఎప్పుడొచ్చేదీ తెలియదా?
ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శలు
ఈనాడు - హైదరాబాద్, మహేశ్వరం - న్యూస్టుడే: తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి డి.శ్రీధర్బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా సీఎం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 6న తుక్కుగూడ సభలోనే జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలను ఇదే తుక్కుగూడలో నిర్వహించిన సభలో ప్రకటించాం. వాటిలో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించాం. 200 యూనిట్ల కరెంటు పథకాన్ని ఇప్పటికే 50 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. మిగిలిన హామీలను ఎన్నికల కోడ్ ముగిశాక అమలు చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. జూన్ 9న ఎర్రకోటపై జెండాను కాంగ్రెస్ ఎగరేస్తుంది. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులే’ అని రేవంత్రెడ్డి అన్నారు.
గత ఏడాది వానలు లేకనే కరవు
‘కేసీఆర్ ఇప్పటికైనా పొలంబాట పట్టడం.. పదేళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం ఆయనకు గుర్తుకు రావడం సంతోషకరం. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన నిర్వాకాల వల్లే కవిత జైలుకు వెళ్లారు. ఆమె జైలుకు వెళ్లినందుకు సాటి మనుషులుగా మాకు కొంచెం సానుభూతి ఉంది.
అధికారం పోయి.. బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారు. వేల పుస్తకాలు చదివిన ఆయనకు వానాకాలం ఎప్పుడొస్తుందో తెలియదా? గత వర్షాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. ఆయన చేసిన పాపాల ఫలితంగానే గత ఏడాది వానలు పడలేదు. అందుకే ఇప్పుడు కరవు వచ్చింది.
64 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం
2018 ఎన్నికలకు ముందు మినహా కేసీఆర్ ప్రభుత్వం ఏ సీజన్లోనూ రైతుబంధు నిధుల పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయలేదు. ప్రతి సీజన్లోనూ నాలుగైదు నెలల సమయం తీసుకుంది. మా ప్రభుత్వం 64,75,581 మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును ఇప్పటికే జమ చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన 4 లక్షల ఖాతాలకు జమ చేస్తాం. మేం చెప్పిన లెక్కలు తప్పయితే.. ఏ శిక్షకైనా సిద్ధం. అవి వాస్తవమని నిరూపిస్తే.. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలోనే రైతుబంధు లెక్కలు బయటపెడదామంటే ఆయన సభకు రాలేదు. ఇటీవల కేసీఆర్ పర్యటించిన రోజున సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదు. ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు మైక్ జనరేటర్కు కనెక్ట్ అయి ఉంది. మీ జనరేటర్లో ఎవరు పుల్ల పెట్టారో ఎవరికి తెలుసు? భారాస పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. ఆ సొమ్ము నుంచి రూ.100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే కేసీఆర్ చేసిన పాపం కొంతయినా తగ్గేది. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆయన వేషాలు వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే.. ప్రతి వారం ప్రజల్లోకి వెళ్లాలి. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలి.
రైతు ఆత్మహత్యల వివరాలివ్వగలరా?
రేవంత్రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నారని కేసీఆర్ అంటున్నారు. నేను ఫాంహౌస్లోనో.. సినిమా వాళ్ల గెస్ట్హౌసుల్లోనో పడుకోవడంలేదని కేసీఆర్ గ్రహించాలి. కేసీఆర్, కేటీఆర్లు వాళ్ల బాస్ మోదీ గెలవాలని.. కాంగ్రెస్కు దేశంలో 40 సీట్లే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్కు 48 గంటల సమయం ఇస్తున్నా... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 200 మంది రైతులు చనిపోయారని ఆరోపిస్తున్న మీరు ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వగలరా? నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత మాది.
మేడిగడ్డ నీరు వదిలింది భారాస హయాంలోనే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక లాంటి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. భారాస అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ నుంచి నీరు వదిలేశారు. అది మరిచి ఇప్పుడు కేసీఆర్ మాపై నెపం నెడుతున్నారు. అన్నారం కట్ట పాడైందని.. దాని నుంచి నీరు బయటికి వదిలాం. డ్యాం సేఫ్టీ అధికారులే నీరు నిల్వ చేయవద్దని చెబుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువగా ఇచ్చాం. వెయ్యి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తున్నాం. సాగర్లో నీటిమట్టాలు డెడ్స్టోరేజీకి పడిపోయాయి. తాగునీటికే మొదటి ప్రాధాన్యం. బోర్లు ఎండిపోయినందున ఇంటి అవసరాలకు ట్యాంకర్ల ద్వారా కూడా నీరందిస్తున్నాం. రైతుల బోర్లను తీసుకుని ఊర్లలో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.
మీ తప్పుల్ని సరిచేయడానికి కష్టపడుతున్నాం
రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి మేం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మేం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంటే.. ఈ ప్రభుత్వం కూలాలి, పోవాలంటూ శాపనార్థాలు పెట్టడమేంటి కేసీఆర్? వరికోతలు ఇంకా పూర్తిస్థాయిలో మొదలే కాలేదు. క్వింటా ధాన్యానికి 10 కిలోల కమీషన్ కొట్టే విధానం మాకు లేదు. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రం నుంచి పెండింగు ప్రాజెక్టులు సాధించుకొచ్చాం. ఈ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే వారిని ఆపడానికి కేసీఆర్ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. భారాసకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే అవుతుంది’ అని రేవంత్ దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల