కష్టం తోడైంది.. కల ‘కొలువైంది’!
మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతకు భవిష్యత్తుపై ఎన్నో కలలు..ఆశలు ఉంటాయి. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా చాలామందే ప్రయత్నాలు ఆరంభిస్తారు.
తొమ్మిది ఉద్యోగాలు సాధించిన శ్రీకాంత్
ఎనిమిదింటిని చేజిక్కించుకున్న ఉదయ్హసన్
ఈనాడు, హైదరాబాద్: మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతకు భవిష్యత్తుపై ఎన్నో కలలు..ఆశలు ఉంటాయి. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా చాలామందే ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఒకట్రెండు వైఫల్యాలు ఎదురుకాగానే ‘ఇదంతా మన వల్ల కాదులే’ అనుకుని నిరాశలో కూరుకుపోతారు. ఈ ఇద్దరు యువకులు మాత్రం అందుకు భిన్నం. వైఫల్యాలను సవాలుగా స్వీకరించి..అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అందులో ఒకరైన శ్రీకాంత్ తొమ్మిది కొలువులు సాధించగా.. మరో యువకుడు ఉదయ్హసన్ ఒకే ఏడాదిలో ఎనిమిది ఉద్యోగాలు సాధించి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సోదరి కష్టం.. స్నేహితుడి ప్రోత్సాహంతో..
నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన శ్రీకాంత్ది మధ్య తరగతి కుటుంబ నేపథ్యం. 2014లో తండ్రి, 2019లో తల్లి మరణించడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అక్క శ్రీలక్ష్మి ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అన్నీ తానై కుటుంబాన్ని నడిపించారు. తన చదువు కొనసాగిస్తూనే..తమ్ముడు శ్రీకాంత్నూ చదివించారు. సోదరి ప్రోత్సాహంతో 2020లో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీకాంత్ 2021లో హైదరాబాద్లో బ్యాంకింగ్ శిక్షణ కేంద్రంలో చేరారు. తొలి ప్రయత్నంలో రాసిన పరీక్షల ఫలితాలు నిరాశపరిచినా కుంగిపోలేదు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి పరీక్ష రాస్తూ వచ్చారు. 2022లో సౌత్ ఇండియా బ్యాంకు(ప్రయివేటు)లో ఉద్యోగం రాగా చేరిపోయారు. ఏడు నెలల తర్వాత రాజీనామా చేసి మళ్లీ సాధన మొదలుపెట్టారు. 2022లోనే రెండు ఉద్యోగాలు సాధించినా వాటిలో చేరలేదు. 2023లో విడుదలైన అనేక నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు రాశారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా ఏడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అకౌంటెంట్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఫైనాన్స్ ఎకౌంట్స్ స్పెషలిస్ట్), ఐబీపీఎస్ క్లర్క్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అప్పర్ డివిజన్ క్లర్క్, సౌత్ ఇండియన్ బ్యాంకు పీవో (ప్రయివేటు), కరీంనగర్ డీసీసీబీలో క్లర్క్, ఆర్ఆర్బీ(రీజనల్ రూరల్ బ్యాంక్స్) పీవో, ఆర్ఆర్బీ క్లర్క్ కొలువులు సాధించారు. ‘‘ఏకలవ్య మోడల్ స్కూల్లో చేరాలని ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అసిస్టెంట్ తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అవీ వెల్లడైన తర్వాత ఎందులో చేరాలో నిర్ణయించుకుంటానని’ శ్రీకాంత్ తెలిపారు. తన ఉద్యోగ ప్రయత్నంలో అక్క శ్రీలక్ష్మితోపాటు స్నేహితుడు శ్రీశైలం అండగా ఉండి మార్గదర్శనం చేశారని, తన విజయం వెనుక వారి ప్రోత్సాహం ఉందన్నారు.
తొలి ప్రయత్నం నిరాశపరిచినా...
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉదయ్హసన్ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి నాగేశ్వర్రావు ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి సృజనకుమారి గృహిణి. అంతంతమాత్రంగా ఉన్న తండ్రి సంపాదనతో ఇల్లు గడిచేది. తాను ఉన్నత స్థానానికి చేరుకుంటే తప్ప కుటుంబ ఆర్థిక పరిస్థితి మారదనే అభిప్రాయాన్ని బలంగా మనసులో నాటుకున్న ఉదయ్హసన్ కష్టపడి చదివారు. 2022లో బాసర ట్రిపుల్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. వెనువెంటనే బ్యాంకు ఉద్యోగ సాధన లక్ష్యంతో శిక్షణ కోసం హైదరాబాద్కు వచ్చారు. చేరిన మొదటి సంవత్సరంలోనే ఎనిమిది నోటిఫికేషన్లు రాగా..అన్నీ రాశారు. 2022 ‘ఎస్బీఐ పీవో’ ఉద్యోగ పరీక్షలో ర్యాంకు సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తుది ఫలితాల్లో నిరాశ ఎదురైనా వెనకడుగు వేయలేదు. 2023లో క్లరికల్, పీవో, ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించి ఎనిమిది నోటిఫికేషన్లు రావడంతో ఉత్సాహం రెట్టింపయింది. మరింత శ్రమించారు. ఇందులో ఏడు ఉద్యోగాలు(ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీవో, ఏపీజీవీబీలో క్లర్క్, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీవో, ఐబీపీఎస్ పీవో(కెనరా బ్యాంకు), పంజాబ్ నేషనల్ బ్యాంకు(క్లర్క్) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ‘వీటితోపాటే న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తుది ఫలితాల్లో ఉద్యోగం సాధించానని, ఆ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులో ఇటీవలే చేరిపోయానని’ ఉదయ్హసన్ తెలిపారు. దీన్ని కొనసాగిస్తూనే ఆర్బీఐ గ్రేడ్-బి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, దాన్నీ నెరవేర్చుకుంటానని ధీమా వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు