సంక్షిప్త వార్తలు (10)
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో జవాన్ యాదయ్య మరణించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో జవాన్ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పట్టాదారు పాసుపుస్తకం అందించారు.
గల్ఫ్ మృతుల బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించేలా ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ గల్ఫ్ సంఘాల పక్షాన పీసీసీ ప్రవాస భారతీయ విభాగం ఛైర్మన్ వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తదితరులు బుధవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు
సీఎం రేవంత్రెడ్డిని పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర మొగులయ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు
నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడిగా విజయసాయి
ఈనాడు, హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మేక విజయసాయి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీధర్రెడ్డి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా కాలి ప్రసాద్, డాక్టర్ లయన్ వై.కిరణ్, కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు వీరు పదవిలో ఉండనున్నారు. ఇటీవల జరిగిన 28వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాసంబంధాల విభాగంతో అత్యుత్తమ సేవలు
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్ అజయ్ మిశ్ర
ఈనాడు, హైదరాబాద్: ప్రజాసంబంధాల విభాగంతో ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ ఛైర్మన్ అజయ్ మిశ్ర సూచించారు. బుధవారం హైదరాబాద్లో జాతీయ ప్రజాసంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంకితభావం, నిబద్ధత ఉండాలని, ప్రభుత్వం, శాఖల మధ్యేగాక..సమాజంలోని భిన్నవిభాగాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ విభాగం అవసరమని తెలిపారు. పీఆర్సీఐ వ్యవస్థాపకులు ఎంబీ జయరామ్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీఆర్సీఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో నారాయణ విద్యార్థుల ప్రతిభ
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నీల్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2024లో తమ విద్యార్థులు సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డా.పి.సింధూర నారాయణ, శరణి నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది విద్యాసంస్థల నుంచి పాల్గొనే సైన్స్ ప్రాజెక్టుల్లో మొదటి స్థానంలో 2, రెండో స్థానంలో 5, మూడో స్థానంలో 7 ప్రాజెక్టులు తమ విద్యార్థులవేనని పేర్కొన్నారు. 20 ప్రోత్సాహక ప్రాజెక్టులతో కలిపి మొత్తం 34 ప్రాజెక్టుల్లో విజయకేతనం ఎగువేసినట్లు వివరించారు.
ఎన్ఎస్ఎస్ స్పేస్ కాంటెస్ట్లో శ్రీచైతన్య విద్యార్థుల హవా
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలోని ఎన్ఎస్ఎస్ స్పేస్ కాంటెస్ట్ 2024లో మొత్తం మూడు క్యాష్ అవార్డుల్లో 2 శ్రీచైతన్య విద్యార్థులు వరుసగా రెండో సంవత్సరం కూడా పొందినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ సీమ బుధవారం తెలిపారు. సుమారు 28కుపైగా దేశాల నుంచి విద్యార్థులు పాల్గొన్న పోటీలో ప్రపంచ మొదటి ప్రైజ్-7 ప్రాజెక్టులు, రెండో ప్రైజ్- 11, మూడో ప్రైజ్- 15, ప్రోత్సాహక- 29 కలిపి మొత్తం 62 ప్రాజెక్టులు విజయం సాధించారన్నారు.
బోధన రుసుము చెల్లించాలి
ఈనాడు, హైదరాబాద్: సకాలంలో విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలని ఆయా కళాశాలల సంఘం సీఎం రేవంత్రెడ్డిని కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి, ఇతర నేతలు బుధవారం సీఎంను తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయమే అతి పెద్ద ఉపాధి రంగం
నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్చంద్
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయమే దేశంలో అతి పెద్ద ఉపాధి రంగంగా వెలుగొందుతోందని, యువత సైతం వ్యవసాయం, అనుబంధ రంగాల వైపు వెళ్తున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్చంద్ అన్నారు. హైదరాబాద్ ఫార్మ్, సైన్స్ ఫౌండేషన్ బుధవారం హైదరాబాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జె.రఘోత్తంరెడ్డి స్మారక ప్రసంగం చేశారు. 2022-2023 దేశంలో నాటికి మొత్తం ఉపాధి రంగంలో 45.76 శాతం మంది వ్యవసాయంలోనే ఉద్యోగాలు పొందారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో 11.2 కోట్ల మందికి ఈ రంగంలో ఉపాధి కలిగిందన్నారు.
పెన్షనర్లకు న్యాయం చేయాలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా పెన్షనర్ల సమస్యలు అలానే ఉన్నాయని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం పేర్కొంది. అధ్యక్షుడు ఎం. మోహన్నారాయణ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగదు రహిత ఆరోగ్య పథకం సరిగా అమలు గాక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కల్పించేందుకు ఆదేశాలివ్వాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే