హార్డ్డిస్కుల నుంచి ఆధారాలెలా?
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది.
మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
ట్యాపింగ్ దర్యాప్తునకు ఆటంకాలు
ఈనాడు, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు ప్రణీత్రావు ముఠా హార్డ్డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడంతో వీటి నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం కష్టంగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ)లో హార్డ్డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనే పంజాగుట్టలో తొలుత కేసు నమోదైంది. వీటిని ఎందుకు ధ్వంసం చేశారని విచారించినప్పుడు ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్రావు నేతృత్వంలో ప్రణీత్రావు తదితరులు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.
ఎవరెవరి ఫోన్లు, ఎప్పుడెప్పుడు ట్యాప్ చేశారు, ఏమి రికార్డు చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి పంపారు వంటి వివరాలన్నీ ఈ హార్డ్డిస్కుల్లో ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే డిసెంబరు 4వ తేదీన ప్రణీత్రావు ఎస్ఐబీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు ఆపివేయించి, కంప్యూటర్లలో ఉన్న హార్డ్డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బయటకు తీయించాడు. వాటిని మెటల్ కట్టర్లతో కత్తిరించి, నాగోలు వద్ద మూసీ నదిలో పడేశాడు. దస్త్రాలు, ఇతర పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే తగులబెట్టాడు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు మూసీ నుంచి తొమ్మిది హార్డ్డిస్కులకు సంబంధించిన శకలాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులెవరైనా హార్డ్డిస్కుల్లో సమాచారాన్ని చెరిపివేసినా.. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని పునరుద్ధరించగలరు.
కొద్దిపాటి తేమ ఉంటేనే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చెడిపోతాయి. అలాంటిది మూసీ బురదలో కూరుకుపోయిన హార్డ్డిస్కుల నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం ఎలా అన్నది సంక్లిష్టంగా మారింది. సెల్ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలు, చాటింగ్ వంటివాటిని ఆయా సర్వీస్ ప్రొవైడర్ల సర్వర్ల నుంచి పొందే అవకాశం ఉంటుంది. కాని పూర్తి అనధికారికంగా జరిగిన ట్యాపింగ్ తతంగం అంతా ఈ హార్డ్డిస్కుల్లో తప్ప మరెక్కడా నిల్వ ఉండే అవకాశం లేదు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ వీటి నుంచి సమాచారం రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సైబర్భద్రతా నిపుణులను సంప్రదిస్తున్నారు. అవసరమైతే వీటిని విదేశాలకైనా పంపాలని యోచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు