అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం
భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ అన్నారు.
మున్ముందు ప్రతి మనిషికో ఐపీ నంబరు
ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్
ఈనాడు, హైదరాబాద్: భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ అన్నారు. అందుకు 2040దాకా ఆగాల్సిన పనిలేదని.. కొన్నేళ్లలో ఇది సాకారమవుతుందని చెప్పారు. మొట్టమొదటి అంతరిక్ష యాత్ర గగన్యాన్కు వ్యోమగాములుగా టెస్ట్ పైలట్స్ను ఎంపిక చేశామని.. మున్ముందు చేపట్టే మిషన్లలో పైలట్లే కాకుండా శాస్త్రవేత్తలే వెళ్లి పరిశోధనలు చేస్తారని తెలిపారు. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ(కేఐవైఈ) గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఇన్స్పైర్-హైదరాబాద్ కార్యక్రమానికి సోమనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరంలోని పాఠశాల, కళాశాలల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. వారు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. స్పేస్ ఎకానమీలో 70శాతం ఆదాయం అప్లికేషన్స్ నుంచే వస్తోంది.. మొబైల్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వరకు చాలా సేవలున్నాయని చెప్పారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే.. మున్ముందు ఐపీ నంబరు ఉండే అవకాశముందన్నారు. ఒకవ్యక్తి తమిళ్లో మాట్లాడుతుంటే వెంటనే అనువాదం చేసి తెలుగులో వినిపించే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏఐ రాకతో విద్య, నైపుణ్యాలు, పనివిధానాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదివరకు ఆటోమొబైల్ అంటే మెకానికల్ ఇంజినీరింగ్ ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు ప్రతి కారులో 30-40 చిప్ల అమరికతో ఎలక్ట్రానిక్స్ పాత్ర పెరిగిందన్నారు.
రూ. 21వేల కోట్ల ఎగుమతులు
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) మాజీ ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి 31నాటికి భారత్ రూ.21వేల కోట్ల విలువైన ఉత్పత్తులను 58 దేశాలకు ఎగుమతి చేసిందని చెప్పారు. గ్రీన్ ప్రొపెల్షన్, కాంపోజిట్ రాకెట్ మోటార్స్ వంటి క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధిలో అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయని వివరించారు. త్వరలో కలాం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కేఐవైఈ అధ్యక్షుడు నరేశ్ ఇండియన్ తెలిపారు. సమావేశంలో ఆర్మీ దక్షిణాది జీవోసీ, లెఫ్టినెంట్ జనరల్ కరన్బీర్సింగ్, నిమ్స్మే డైరెక్టర్ జనరల్ డా.ఎస్.గ్లోరి స్వరూప, డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ జి.రాజాసింగ్ మాట్లాడారు. అంకుర సంస్థలు ధ్రువ స్పేస్ వ్యవస్థాపకులు సంజయ్, కాన్స్టెల్లీ సీటీవో సీహెచ్ అవినాశ్రెడ్డి, సీఎస్సీసీ ల్యాబ్స్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్రెడ్డి తమ స్ఫూర్తిగాథలను విద్యార్థులతో పంచుకున్నారు. డీఆర్డీవో యంగ్సైంటిస్ట్ ల్యాబ్ డైరెక్టర్ డా.పి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్