ప్రతి గింజనూ కొంటాం
ధాన్యం సేకరణకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) సాఫ్ట్వేర్ ఉంది. రైతులు అమ్మిన ధాన్యం తూకం, గ్రేడింగ్ను కొనుగోలు కేంద్రంలో సిబ్బందే వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించాం.
48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు
ధాన్యం లెక్కలు వెంటనే ఆన్లైన్లో
పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్పోస్టులు
‘ఈనాడు’తో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబర్లు 1967, 180042500333
ధాన్యం సేకరణకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) సాఫ్ట్వేర్ ఉంది. రైతులు అమ్మిన ధాన్యం తూకం, గ్రేడింగ్ను కొనుగోలు కేంద్రంలో సిబ్బందే వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించాం. ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు లేకుంటే.. తూకాన్ని తగ్గించే అధికారం డిప్యూటీ తహసీల్దార్, జిల్లా పౌరసరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులకు మాత్రమే ఉంటుంది.
డీఎస్ చౌహాన్
ఈనాడు, హైదరాబాద్: యాసంగి ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం జరగనివ్వబోమని.. కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో 56 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. యాసంగి వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై ‘ఈనాడు’ ఆయనతో మాట్లాడింది.
ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించగా.. తాము తీసుకోబోయే చర్యలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- వరి కోతలు మొదలైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఇప్పటికే 3134 కేంద్రాలు ప్రారంభించి.. 2980 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిగిలిన చోట్ల దశలవారీగా తెరుస్తున్నాం. ఏప్రిల్ 5 నాటికి అన్ని కేంద్రాలూ అందుబాటులోకి వస్తాయి. గత యాసంగిలో 7307 కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. ఈసారి ఆ సంఖ్యను 7149కి పెంచుతున్నాం. గత సీజన్లో 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈసారి లక్ష్యాన్ని 75.4 లక్షల టన్నులకు పెంచాం. ఇంకా అదనంగా ఎంత ధాన్యం వచ్చినా.. కొనుగోలు చేస్తాం. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం.. గ్రేడ్ ఏ రకానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2183 చెల్లిస్తాం. రైతులు బయట కూడా ఇంతకంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనవద్దని రైస్మిల్లర్లను ఆదేశించాం. వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే ఎన్నికల కోడ్ వచ్చింది.
- కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. ఎండ ప్రభావం లేకుండా నీడ ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఎండాకాలం మాదిరిగా ఈసారి వేసవిలో అకాల వర్షాలు కురుస్తాయన్న అంచనాలు లేవు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాలతో నష్టం జరిగే అవకాశం లేదు. గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు తగినన్ని ఉంటాయి. కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చాం.
- రైతులు తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు తీసుకురావాలి. తేమ శాతం గరిష్ఠంగా 17 శాతం దాటొద్దు. చెత్త, తాలు, మట్టిబెడ్డలు, రాళ్లు, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో నిబంధనలు పాటిస్తే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాల్ని వివరించే పోస్టర్లను కేంద్రాల దగ్గర పెడుతున్నాం.
- రైతులు అమ్మిన ధాన్యంలో కోత పెట్టే అధికారం మిల్లర్లకు లేదు. అలా చేస్తే సహించేది లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతు మోసపోకుండా టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాం. కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదుల కోసం 1967, 180042500333 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
- మిల్లుల దగ్గర ధాన్యం అన్లోడింగ్లో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం ఉండదు. యాసంగి ధాన్యంలో 50 శాతం కొనుగోళ్లు ఒక్క మే నెలలోనే జరుగుతాయి. రైతులంతా ఒకేసారి కేంద్రాలకు వస్తే కొంత ఆలస్యం కావచ్చు. ఇలాంటి అంశాల్లో శాఖాపరంగా పర్యవేక్షించి జాప్యాన్ని తగ్గిస్తాం.
- మిల్లర్లు తీసుకున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడంలో (సీఎంఆర్) ఈసారి జాప్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ రవాణా నివారణకు రాష్ట్ర సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాల్లో 24 గంటల్లోగా వేయాలన్నది మా లక్ష్యం. గరిష్ఠంగా 48 గంటల్లో వేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం