టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు
తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసిఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ స్పష్టంచేశారు.
ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్
ఏపీ అభివృద్ధికే తెదేపా, జనసేనలతో కూటమని వెల్లడి
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసిఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ స్పష్టంచేశారు. ఎవరి ఫోన్నైనా ట్యాప్ చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం దిల్లీలోని తన నివాసంలో ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పరిస్థితులపైనా స్పందించారు. ‘‘దక్షిణాదిలో ఈసారి ఎన్డీయే ఇప్పటివరకూ లేనంత గరిష్ఠ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. తెలంగాణలో రెండంకెల సంఖ్యలో గెలుచుకోబోతున్నాం. గత భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా చేసిన పోరాటమే అందుకు కారణం. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భాజపా ఒక్కటే. దానివల్లే మా ఓటు బ్యాంకు 7% నుంచి 14%కి పెరిగింది. రాష్ట్రానికి మేలు జరగాలంటే లోక్సభ ఎన్నికల్లో మోదీకి, భాజపాకు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. రైలు, రోడ్డు ప్రాజెక్టులు చాలా ఇచ్చాం. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లు స్పందించకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయకూడదు.
8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలం?
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా పార్టీ నాయకులెవరూ అనలేదు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 61 మంది ఎమ్మెల్యేలు కావాలి. మాకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఇంతమందితోనే ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలుగుతాం. భాజపా, భారాసలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. బురదచల్లడం కాంగ్రెస్కు వెన్నతోపెట్టిన విద్య. ఇదివరకు కవితను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక వాదనకు కట్టుబడి ఉండాలి తప్ప అటూ, ఇటూ మాట్లాడకూడదు.
భారాస.. ఫామ్హౌస్ పార్టీ
భారాస పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నేతలు వదిలిపోతున్నారు. దాన్ని మేం ఏదో చేయాల్సిన అవసరమే లేదు. భారాసను వదిలినవారు భాజపాలోకే రావడం లేదు. కాంగ్రెస్లోనూ చేరుతున్నారు. భారాస ఒక కుటుంబానికి చెందిన ఫామ్హౌస్ పార్టీ. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీసుకే రాకపోతే ఫామ్హౌస్ వరకు ఎంతమంది పోగలుగుతారు? ఆ బాధను భరించలేకే ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారు.
ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ సమయం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కూటమి రెండుసార్లు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో భాజపాతో పొత్తు లేకపోతే కూటమి అసంపూర్తిగా ఉంటుందని, కలిసి పోటీ చేస్తే మరింత శక్తిమంతంగా తయారవుతుందని చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ భావించి ఉండొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన మౌలిక వసతులు కల్పించలేదు. పరిశ్రమలూ తీసుకురాలేదు. గుజరాత్ తర్వాత సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వైకాపా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. రూ.వేల కోట్ల అప్పులు చేసి ఏపీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తోసింది. అప్పులకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయలేరు. కొవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలకూ అప్పుల పరిధిని 3% నుంచి 3.5%కి పెంచాం. వివిధ షరతులకు లోబడి అదనపు రుణాలు తీసుకోవడానికీ అన్ని రాష్ట్రాలకూ కేంద్రం అవకాశం ఇచ్చింది. సంస్కరణల ఆధారంగా ప్రోత్సాహకాలు అందించింది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించలేదు.
ఏపీ అభివృద్ధికోసం ఎన్డీయేకు ఓటేయండి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే భాజపా, తెదేపా, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని పిలుపునిస్తున్నా. ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తం సాయం చేస్తామని ఇదివరకే చెప్పాం. ఆంధ్రప్రదేశ్ను ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. దేశంలో మూడు రాష్ట్రాలకు బల్క్డ్రగ్ పార్కులు కేటాయిస్తే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చాం. నాలుగింటిలో ఒక మెడికల్ డివైజ్ పార్క్నూ ఇచ్చాం. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలన్నీ మంజూరు చేసి నిర్మించాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన డబ్బులన్నీ ఇచ్చాం. వై.ఎస్.షర్మిల కాంగ్రెస్లో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. భాజపాలో చేరాలని ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదు’’ అని అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల