నీటి ఎద్దడి లేకుండా..
వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించి, బాధ్యతలు అప్పగించింది.
తక్షణ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక
మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్లు
రేపు ‘దిగువ మానేరు’కు నీటి విడుదల
పురపాలికలకు రూ.30 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించి, బాధ్యతలు అప్పగించింది. తక్షణం కార్యాచరణకు దిగాలని వారికి స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని పురపాలికల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించింది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు వెంటనే రూ.30 కోట్ల విడుదలకు నిర్ణయించింది. అవసరాలకు అనుగుణంగా.. జలాశయాలకు నీటి విడుదల, ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, బోరుబావుల వినియోగం తదితర చర్యలకు కార్యాచరణ చేపట్టింది.
తక్షణం నిధులు..
గత ఆరు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటింది. భూగర్భ జలాలు సైతం తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పలు పురపాలికల పరిధిలో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో తాగునీటికి సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. నిరుపయోగంగా ఉన్న బోర్లలోని పూడిక తీయాలని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయాలని తెలిపింది. నిధుల కొరత లేకుండా 12 మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.7 కోట్లు, 130 మున్సిపాలిటీలకు రూ.23 కోట్లను తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.
రిజర్వాయర్లకు నీళ్లు..
పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల రిజర్వాయర్లను నీటితో నింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఖమ్మం, నల్గొండ పట్టణాల్లో నీటిఎద్దడి నివారణకు గాను పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్లకు సోమవారమే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. కరీంనగర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దిగువ మానేరు డ్యామ్కు మిడ్ మానేరు డ్యామ్ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
30 వేల బోర్ల ద్వారా..
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పవర్ బోర్లు, బోరు బావులు 30 వేల వరకు ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. వాటి నుంచి అన్ని పట్టణాలకూ తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బోర్లు, బోరు బావులను గుర్తించి వేసవి మూడు నెలల కాలానికి అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పురపాలికల్లో కలిపి 300 వరకు నీటి సరఫరా ట్యాంకర్లు ఉన్నాయి. వీటిద్వారా నీటి సరఫరా చేయాలని.. అవసరమైతే కావాల్సినన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ట్యాంకరు ద్వారా నీటికి ప్రజల నుంచి వినతులు వచ్చిన 12 గంటల్లోగా సరఫరా చేసేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.
వెంటనే జిల్లాలకు ప్రత్యేక అధికారులు..
రాష్ట్రంలో జిల్లాలవారీగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పర్యవేక్షణకు పది మంది ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా అధికారులు తమకు కేటాయించిన జిల్లాలను వెంటనే సందర్శించాలని, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల సమన్వయంతో తాగునీటి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వచ్చే జులై నెలాఖరు వరకూ ప్రతి రోజూ అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అధికారులు వచ్చే రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని, ఆ సమయంలో మంచినీటి సరఫరాకు అవసరమైన చర్యలపైనే దృష్టి సారించాలని సూచించారు. సీఎస్ ఆదేశాల మేరకు ఆయా అధికారులు బుధవారమే జిల్లాలకు బయల్దేరి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. -
ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు.