వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తం
అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశంలో పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణం అవుతున్నాయి.
ఇటు భూమిపైన, అటు సముద్రంపైన పెరిగిన వేడి
దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం
ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు రావచ్చు
‘ఈనాడు’తో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ ఎం.రఘు
ఈనాడు - హైదరాబాద్
అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశంలో పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణం అవుతున్నాయి. ఆహారం, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవాలి. మొక్కలను భారీగా పెంచి పచ్చదనాన్ని విస్తరించాలి.
ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ‘ఎల్ నినో’ ప్రభావంతో హిందూ మహా సముద్రంలో, భారతదేశంలోని నగరాలు, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ రఘు ముర్తుగుద్దె పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని చెప్పారు. ఎల్ నినో సమయంలో వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ‘‘వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన, అటు సముద్రంపైన వేడి పెరిగింది. దాంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు నెలకొనవచ్చు. ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు రావచ్చు. వర్షానికి, వర్షానికి మధ్య విరామం పెరగవచ్చు... లేదా తగ్గవచ్చు. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉండొచ్చు’’ అని వివరించారు. రఘు అమెరికాలోని మేరిల్యాండ్ విశ్వవిద్యాలయంలో వాతావరణ, సముద్రశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముంబయి ఐఐటీలోని వాతావరణ అధ్యయన విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
వాతావరణంలో విపరీతమైన వేడికి కారణాలు ఏంటి?
కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కొన్నిసార్లు జూన్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది. కానీ సాధారణ కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు మాత్రం వాతావరణం వేడిగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు, వెచ్చటి వాతావరణం ఉండే సముద్రాలు, కొన్నిసార్లు స్థానిక పరిస్థితులతో వాటిల్లే మార్పుల ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలకు అవకాశాలు ఉంటాయి. దేశంలో పలుచోట్ల ఇప్పుడు అలాంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. 10 సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి?
గ్రీన్హౌస్ వాయువులు పెరగడం కూడా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నీటి ఆవిరి అధికం అవుతుంది. వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. గాలులు సైతం అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతాయి. మధ్య తూర్పు దేశాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. దాంతో అరేబియా సముద్రం వెచ్చగా ఉంటుంది. ఆ కారణాలతో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి పెరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేస్తుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమే. చెట్లను కాపాడుకోవాలి. పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలి.
ఎల్ నినో ప్రభావం ఎంతమేరకు ఉండొచ్చు?
దానివల్లే దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇది వేడిని పెంచుతుంది. ఎల్ నినోతో వడగాలులకూ అవకాశం ఉంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వంటి వాటిపై యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. విస్తృత ప్రచారమూ అవసరం. పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీలకు ముందే సమాచారం ఇవ్వాలి.
ప్రజా కోణంలో మీరిచ్చే సూచనలేమిటి?
సీజన్ల వారీగా వచ్చే వాతావరణ మార్పులు, వడగాలుల హెచ్చరికల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. వాటిని తెలుసుకొని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరికల సమయంలో వృద్ధులను, పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తీవ్ర ఎండల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడాలి. వడగాలుల ప్రభావానికి గురైతే ఆసుపత్రికి సకాలంలో చేర్చడం చాలా ముఖ్యం. అందుకు తగిన ఏర్పాట్లు అవసరం.
దేశంలో అధ్యయనాలు ఏమైనా ఉన్నాయా?
వాతావరణ మార్పుల ముప్పు అధికంగా రైతులు, నిర్మాణరంగ కూలీలు, చిరు వ్యాపారులు, మురికివాడల్లో నివసించేవారిపై ఎక్కువగా ఉంటుంది. ఎవరిపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే విషయమై కొన్ని అధ్యయనాలు జరిగాయి కానీ వాటికి భౌగోళిక విస్తృతి చాలా తక్కువ. వాటిల్లో ఎవరు బాధితులు అవుతారు అన్న సమాచారం లేదు. విస్తృత అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది.
దీనిపై ఓ క్రమబద్ధమైన సర్వే జరగాలని అభిప్రాయపడుతున్నారా?
జవాబు: అవును. వాతావరణ మార్పులతో కలిగే ప్రమాదం ఎలా ఉంటుందన్న విషయంపై నీటి నిర్వహణ, వ్యవసాయం, విద్యుత్తు, ఆరోగ్యం వంటి అంశాల్లో ప్రతి సీజన్లో ఓ క్రమబద్ధమైన సర్వే జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు, ఆస్తి, పంటలను కాపాడుకునేందుకు ఓ సమగ్ర ప్రణాళిక అవసరం. వాతావరణ సమాచార సేకరణ విషయంలో తెలుగు రాష్ట్రాల పనితీరు బాగానే ఉంది.
వ్యవసాయ ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంది?
అధికవర్షాలు లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటల నష్టం జరుగుతుంది. అయితే వానాకాలంలో కురిసే వర్షం నీటిని నిల్వ చేసుకోవాలి. తద్వారా వర్షాభావ పరిస్థితులు వచ్చినా ఇబ్బంది లేకుండా నీటిని వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట