గండం గట్టెక్కేదెలా!
రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా..కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు.
జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు
తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం
ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు
గోదావరిలోకి రోడ్డు నిర్మాణం.. పంపులు సిద్ధం
సాగర్ నుంచి ఎత్తిపోతకు అదే తరహా కార్యాచరణ
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే, రామగుండం: రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా..కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. పైపెచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండటం, ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండటంతో నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మిషన్ భగీరథ, హైదరాబాద్ తాగునీటికి పంపింగ్ చేసే ఇన్టేక్ వెల్స్కు మరికొద్ది రోజుల్లో నీరందడం కష్టంగా మారనుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇన్టేక్ వెల్స్ వరకు కాలువలను లోతుగా తవ్వగా..మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కసరత్తు ఆరంభించారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్య తలెత్తకుండా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నాగార్జునసాగర్ నుంచి నీటిని తోడేందుకు వీలుగా అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.
2016 నాటి అనుభవంతో..
రాష్ట్రంలో 2016లోనూ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరిలోకి ప్రత్యేక విద్యుత్ లైన్లు, రోడ్లు నిర్మించి నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇన్టేక్ వెల్ వద్ద 140 మీటర్ల మట్టం వద్ద నీళ్లు ఉన్నాయి. 138 మీటర్లకు చేరితే అక్కణ్నుంచి నీటిని తీసుకోవడం సాధ్యం కాదు. హైదరాబాద్కు 330 క్యూసెక్కులు (రోజుకు 172 మిలియన్ గ్యాలెన్లు), పెద్దపల్లి జిల్లా పరిధిలో మిషన్ భగీరథకు 58 క్యూసెక్కులు, రామగుండం ఎరువుల కర్మాగారానికి 18 క్యూసెక్కులు అవసరం ఉంటోంది. అందుకు అనుగుణంగా పక్షం రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి మట్టం పడిపోతే నది మధ్యలోంచి ఎత్తిపోసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నదిలోకి కిలోమీటరున్నర దూరం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. 25 సబ్మెర్సిబుల్ పంపులను నదిలో ఏర్పాటుచేసి అప్రోచ్ కాలువలోకి ఎత్తిపోయనున్నారు. ‘‘జులై చివరి వారం నాటికి ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ప్రారంభమవుతుంది. అప్పటి లోపు నీటి ఎత్తిపోత తప్పనిసరిగా మారింది’’అని అధికారులు తెలిపారు.
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల జలాశయం వద్ద 2016లో ప్రత్యేక మోటార్లు ఏర్పాటుచేసి రామన్పాడుకు తాగునీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది ఇన్ఫ్లో ఆలస్యమైతే ఎత్తిపోత తప్పదని అంచనా వేస్తున్నారు.
- నాగార్జునసాగర్ జలాశయం నుంచి హైదరాబాద్కు రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. సాగర్ నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోతే హైదరాబాద్కు నీటిని తీసుకునే పుట్టంగండి అప్రోచ్ కాలువకు నీళ్లు అందవు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాగర్లో ప్రత్యేకంగా పంపులు అమర్చి..అప్రోచ్ కాలువలోకి ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017లోనూ ఇదే తీరులో ఎత్తిపోశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
జీవన్రెడ్డి మాల్ స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్లో దిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
‘ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. -
తూప్రాన్ ఈఎస్ఐ ఆసుపత్రికి 46 రోజులుగా తాళం
మెదక్ జిల్లా తూప్రాన్లోని ఈఎస్ఐ ఆసుపత్రి 46 రోజులుగా మూతపడి ఉంది. 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఏప్రిల్ 1న ఆసుపత్రికి తాళం వేశారు. -
జూన్ 3న లాసెట్, పీజీఎల్సెట్ పరీక్షలు
తెలంగాణలో లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు, మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి నారాయణరావులు విమర్శించారు. -
మేడిగడ్డపై రేపు సీఎం రేవంత్ సమీక్ష
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్.డి.ఎస్.ఎ.) ఇచ్చిన నివేదికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. -
దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి
దత్తత తీసుకున్న బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని.. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వందనమమ్మా.. డాక్టర్ రవళి
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?