గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష
గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్ఈఐఆర్బీ)కి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక మండలి (టీఆర్ఈఐఆర్బీ)కి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గురుకుల విద్యాసంస్థల్లో 132 ఆర్ట్స్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి.వినోద్తోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపిస్తూ.. ఆర్ట్స్ టీచర్ పోస్టులకు టీఆర్ఈఐఆర్బీ 2023 ఏప్రిల్ 5న నోటిఫికేషన్ జారీ చేసిందని, ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుందని అందులో పేర్కొందన్నారు. అయితే ఆగస్టు 1న ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు. దీనివల్ల పిటిషనర్లు పరీక్ష సరిగా రాయలేకపోయారని, ఇది తెలుగు తెలిసినవారి పట్ల వివక్ష చూపడమేనని, అంతేగాకుండా రాజ్యాంగంలోని షెడ్యూలు 8, అధికరణ 14కు విరుద్ధమన్నారు. టీఆర్ఈఐఆర్బీ తరఫు న్యాయవాది ఎన్.రమేశ్ వాదనలు వినిపిస్తూ గురుకుల విద్యాసంస్థలన్నీ ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తున్న అయిదు రెసిడెన్షియల్ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు.
2017లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించిందని, వారు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది ఈ నోటిఫికేషన్తో పాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, లెబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్స్, పీజీటీ, టీజీటీ, క్రాఫ్ట్, మ్యూజిక్, ఆర్ట్స్ అన్నింటికీ కలిపి 9 నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, అన్నింటిలోనూ ప్రశ్న పత్రాలు ఆంగ్లంలోనే ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి టీఆర్ఈఐఆర్బీ తాను విడుదల చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్లు పరీక్ష అయిన వెంటనే కోర్టును ఆశ్రయించారని, అందుకే ఫలితాలను విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. ఈ మేరకు గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ప్రశ్నపత్రం రెండు భాషల్లోనూ ఇవ్వాలని టీఆర్ఈఐఆర్బీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. -
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. -
8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. -
తడిసిన ప్రతి గింజనూ కొంటాం
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. -
మళ్లీ ఊపందుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, శ్రవణ్రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
బోనస్తో రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. -
తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. -
ఈసెట్లో 95.86% ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్ రాశారు. -
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. -
భారీగా పెరిగిన విత్తన పసుపు ధర
రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. -
విత్తనాలకు రైతుల కుస్తీ
విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. -
ఇతర రాష్ట్రాల బార్ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్లో నోటీసులు
తెలంగాణ పరిధిలో సివిల్ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడైన వి.రాకేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. -
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే
కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. -
వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు
సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్ 3 వరకు పొడిగించారు. -
రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. -
క్రష్ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాలను క్రష్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. -
జూన్ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?