రూ.9.9 కోట్ల బియ్యం పురుగులపాలు
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో కొందరు అధికారులు సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాంలు ఏర్పాటుచేస్తున్నారు.
అనుమతి లేకుండా గోదాం అద్దెకు తీసుకుని బియ్యం నిల్వ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో కొందరు అధికారులు సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాంలు ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో వేలాది టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. మిల్లర్ల నుంచి నాణ్యత లేని బియ్యం తీసుకుంటూ పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బొల్లారంలో 2021-22లో అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన గోదాంలో దాదాపు 2,900 టన్నుల బియ్యం పాడైపోవడం అందుకు నిదర్శనం. ఈ కారణంగా సంస్థకు సుమారు రూ.9.90 కోట్ల నష్టం వాటిల్లిందని, బాధ్యులైన డీఎం (జిల్లా మేనేజర్లు)లపై చర్యలు తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు పౌరసరఫరాల శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎవరి లాభం కోసమో?
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్ల నుంచి వచ్చే బియ్యం అటు ఎఫ్సీఐతో పాటు కొంతమేర రాష్ట్ర కోటాకూ వస్తాయి. ఆ నిల్వలను పౌర సరఫరాల సంస్థ అధికారిక గోదాంలలో నిల్వ చేస్తారు. నిల్వలు అధికమైనప్పుడు సంస్థ ఉన్నతాధికారుల అనుమతితో ప్రైవేటు గోదాంలను అద్దెకు తీసుకుంటారు. 2022లో అప్పటి మెదక్ డీఎం సాయిరాం మెదక్ గ్రామీణ మండల పరిధి బొల్లారంలో ఓ గోదాంను అద్దెకు తీసుకుని, 7,900 టన్నుల బియ్యాన్ని నిల్వచేశారు. ఆ తర్వాత అందులో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపినట్లు సమాచారం. గోదాంను అద్దెకు తీసుకోవడం దగ్గర్నుంచి అందులో బియ్యం నిల్వచేసే విషయంలో డీఎం సాయిరాం ప్రధాన కార్యాలయం అనుమతి తీసుకోలేదని సమాచారం. దీంతో సుమారు 2,900 టన్నుల బియ్యం దీర్ఘకాలంగా గోదాంలోనే ఉండిపోయింది. ఆ బియ్యం మొత్తం పాడైంది. పురుగుల పాలైంది. బియ్యానికి పట్టిన పురుగులు కూడా చనిపోయి కుప్పలుగా పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మనుషులు తినేందుకు పనికిరావు..
సాయిరాం స్థానంలో ఆ తర్వాత డీఎంలుగా శ్రీనివాస్, కొద్దికాలం గోపాల్ పనిచేశారు. వారి తర్వాత 2023 సెప్టెంబరులో డీఎంగా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ అనుమతిలేని గోదాంను, అందులో బియ్యం నిల్వలను గుర్తించారు. నమూనాలను హైదరాబాద్ నాచారంలోని ఓ ప్రయోగశాలకు పంపించారు. ఈ వ్యవహారంలో జరిగిన లోపాలపై అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు 2023 నవంబరులో అప్పటి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్కు నివేదిక పంపించారు. ఆ బియ్యం తినడానికి పనికిరావంటూ నాచారంలోని ప్రయోగశాల ఇచ్చిన నివేదికనూ జతచేశారు. స్పందించిన కమిషనర్ ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అడిగారు. ఆ తర్వాత ఆ అధికారి బదిలీ కావడం, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ ప్రక్రియ, బాధ్యులైన అధికారులపై చర్యల అంశం నిలిచిపోయింది. ‘అనుమతి లేకుండా గోదాం ఏర్పాటుచేయడంతోపాటు అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేశారు. కార్పొరేషన్కు రూ.9.90 కోట్ల మేర నష్టం జరిగింది. అందుకు బాధ్యుడైన డీఎం సాయిరాంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కమిషనర్కు నివేదిక ఇచ్చాం. పాడైన బియ్యాన్ని అక్కణ్నుంచి తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అనుమతి కోరాం’ అని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఈ తరహా గోదాంలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? అనే అనుమానాలు పౌరసరఫరాల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనుమతులతో ఉన్న గోదాంలలో బియ్యం నిల్వలు రికార్డుల మేరకు ఉన్నాయా? లేవా? అనే సందేహాలూ ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?